విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాను మొదలుపెట్టే సమయానికి రష్మిక మందన్నా.. తన తొలి చిత్ర కథానాయకుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంది. కానీ గీత గోవిందం పూర్తయ్యే సమయానికి ఆమె అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక అప్పట్నుంచి విజయ్తోనే ఆమె రిలేషన్షిప్లో ఉన్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్-రష్మిక కెమిస్ట్రీ చూసినా.. బయట వీళ్లిద్దరూ తరచుగా కలవడాన్ని గమనించినా వీరి మధ్య ప్రేమ ఉన్నట్లే భావిస్తారు ఎవరైనా.
ఈ ఇద్దరూ తమ రిలేషన్షిప్ను ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఇన్డైరెక్ట్ హింట్స్ ఇస్తూ అభిమానులను టీజ్ చేస్తూనే ఉంటారు. విజయ్, రష్మిక వేర్వేరుగా ఫొటోలు పెడతారు. కానీ ఆ ఫొటోలు ఒకే చోట తీసినవని.. ఇద్దరూ కలిసే ఉన్నారని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే కానీ అర్థం కాదు. ఇలా గతంలో ఎన్నోసార్లు చేసిందీ జంట. తాజాగా మరోసారి విజయ్, రష్మిక అభిమానులను ఇలాగే టీజర్ చేశారు. రష్మిక తాజాగా ఒక రెస్టారెంట్లో ఫుడ్ తింటున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ‘‘గుడ్ ఫుడ్’’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. ఐతే తర్వాత ఎవరో ఆమె ఎదురుగా విజయ్ కూర్చున్న ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మరోసారి ఈ జంట బంధం గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. కోస్టార్తో ఎప్పుడైనా డేటింగ్ చేశారా అని అడిగితే విజయ్ ఔనని సమాధానం చెప్పడం తెలిసిందే. కానీ వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇలా విజయ్, రష్మిక అభిమానులతో దోబూచులాడుతూ ఎన్నాళ్లు గడుపుతారో చూడాలి. వీళ్లిద్దరూ ఏదో ఒక రోజు పెళ్లి కబురు చెబుతారనే అందరి అంచనా. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తుండగా, రష్మిక ‘పుష్ప-2’తో పలకరించబోతోంది.
This post was last modified on November 24, 2024 2:23 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…