విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాను మొదలుపెట్టే సమయానికి రష్మిక మందన్నా.. తన తొలి చిత్ర కథానాయకుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంది. కానీ గీత గోవిందం పూర్తయ్యే సమయానికి ఆమె అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక అప్పట్నుంచి విజయ్తోనే ఆమె రిలేషన్షిప్లో ఉన్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్-రష్మిక కెమిస్ట్రీ చూసినా.. బయట వీళ్లిద్దరూ తరచుగా కలవడాన్ని గమనించినా వీరి మధ్య ప్రేమ ఉన్నట్లే భావిస్తారు ఎవరైనా.
ఈ ఇద్దరూ తమ రిలేషన్షిప్ను ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఇన్డైరెక్ట్ హింట్స్ ఇస్తూ అభిమానులను టీజ్ చేస్తూనే ఉంటారు. విజయ్, రష్మిక వేర్వేరుగా ఫొటోలు పెడతారు. కానీ ఆ ఫొటోలు ఒకే చోట తీసినవని.. ఇద్దరూ కలిసే ఉన్నారని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే కానీ అర్థం కాదు. ఇలా గతంలో ఎన్నోసార్లు చేసిందీ జంట. తాజాగా మరోసారి విజయ్, రష్మిక అభిమానులను ఇలాగే టీజర్ చేశారు. రష్మిక తాజాగా ఒక రెస్టారెంట్లో ఫుడ్ తింటున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ‘‘గుడ్ ఫుడ్’’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. ఐతే తర్వాత ఎవరో ఆమె ఎదురుగా విజయ్ కూర్చున్న ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మరోసారి ఈ జంట బంధం గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. కోస్టార్తో ఎప్పుడైనా డేటింగ్ చేశారా అని అడిగితే విజయ్ ఔనని సమాధానం చెప్పడం తెలిసిందే. కానీ వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇలా విజయ్, రష్మిక అభిమానులతో దోబూచులాడుతూ ఎన్నాళ్లు గడుపుతారో చూడాలి. వీళ్లిద్దరూ ఏదో ఒక రోజు పెళ్లి కబురు చెబుతారనే అందరి అంచనా. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తుండగా, రష్మిక ‘పుష్ప-2’తో పలకరించబోతోంది.
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…
కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…
దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత సెలెక్టివ్ గా ఉంటారో తెలిసిందే. కథలు, క్యాస్టింగ్, టీమ్, కంటెంట్ ఏదైనా సరే రాజీ…