విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాను మొదలుపెట్టే సమయానికి రష్మిక మందన్నా.. తన తొలి చిత్ర కథానాయకుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంది. కానీ గీత గోవిందం పూర్తయ్యే సమయానికి ఆమె అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక అప్పట్నుంచి విజయ్తోనే ఆమె రిలేషన్షిప్లో ఉన్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్-రష్మిక కెమిస్ట్రీ చూసినా.. బయట వీళ్లిద్దరూ తరచుగా కలవడాన్ని గమనించినా వీరి మధ్య ప్రేమ ఉన్నట్లే భావిస్తారు ఎవరైనా.
ఈ ఇద్దరూ తమ రిలేషన్షిప్ను ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఇన్డైరెక్ట్ హింట్స్ ఇస్తూ అభిమానులను టీజ్ చేస్తూనే ఉంటారు. విజయ్, రష్మిక వేర్వేరుగా ఫొటోలు పెడతారు. కానీ ఆ ఫొటోలు ఒకే చోట తీసినవని.. ఇద్దరూ కలిసే ఉన్నారని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే కానీ అర్థం కాదు. ఇలా గతంలో ఎన్నోసార్లు చేసిందీ జంట. తాజాగా మరోసారి విజయ్, రష్మిక అభిమానులను ఇలాగే టీజర్ చేశారు. రష్మిక తాజాగా ఒక రెస్టారెంట్లో ఫుడ్ తింటున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ‘‘గుడ్ ఫుడ్’’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. ఐతే తర్వాత ఎవరో ఆమె ఎదురుగా విజయ్ కూర్చున్న ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మరోసారి ఈ జంట బంధం గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. కోస్టార్తో ఎప్పుడైనా డేటింగ్ చేశారా అని అడిగితే విజయ్ ఔనని సమాధానం చెప్పడం తెలిసిందే. కానీ వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇలా విజయ్, రష్మిక అభిమానులతో దోబూచులాడుతూ ఎన్నాళ్లు గడుపుతారో చూడాలి. వీళ్లిద్దరూ ఏదో ఒక రోజు పెళ్లి కబురు చెబుతారనే అందరి అంచనా. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తుండగా, రష్మిక ‘పుష్ప-2’తో పలకరించబోతోంది.
This post was last modified on November 24, 2024 2:23 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…