నాగచైతన్యతో విడిపోయిన దగ్గర్నుంచి తనతో బంధం గురించి సమంత ఎప్పుడూ నెగెటివ్గానే మాట్లాడడాన్ని గమనించవచ్చు. నేరుగా చైతూ పేరు ఎత్తి ఏమీ అనదు కానీ.. తన గత బంధం విషయంలో రిగ్రెట్ ఫీలవుతున్నట్లే మాట్లాడుతుంది సామ్.విడాకుల సమయంలో కొన్ని కోట్స్ పెడుతూ ఇన్డైరెక్ట్గా చైతూను ఎటాక్ చేస్తున్నట్లు కనిపించింది సామ్. ఐతే ఈ మధ్య విడాకుల బాధ నుంచి బయటికి వచ్చేసి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది సామ్. అయినా చైతూ మీద ఇన్ డైరెక్ట్ పంచ్2లు మాత్రం ఆపట్లేదామె.
తాజాగా ‘సిటాడెల్’లో తనతో కలిసి నటించిన వరుణ్ ధావన్తో కలిసి ఒక ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న సామ్.. వరుణ్ తనను అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. చాన్నాళ్ల ముందే జరిగిన ఈ ఇంటర్వ్యూ తాలూకు వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది.అందులో వరుణ్.. మీరు వృథాగా ఖర్చు పెట్టిన డబ్బు గురించి చెబుతారా అని అడిగాడు. దానికి సామ్ బదులిస్తూ.. ‘‘నా ఎక్స్కు ఇచ్చిన ఖరీదైన బహుమతుల విషయంలో అలా ఫీలవుతుంటా’’ అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చైతూ నుంచి విడిపోయిన తర్వాత తన పట్ల సామ్ ఎంత వ్యతిరేకతతో ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ. సామ్తో విడాకులు తీసుకున్నాక చైతూ ఎప్పుడు మాట్లాడినా నోరు జారింది లేదు. కానీ సామ్ మాత్రం.. ఇన్డైరెక్ట్గా చైతూనే ఎటాక్ చేస్తూనే ఉంది. ఈ విషయంలో అక్కినేని అభిమానులు సమంత తీరును తప్పుబడుతూ ఉంటారు. కానీ ఆమె గుండెలో ఎంత బాధ ఉందో.. విడాకులు ఆమెనెంత ఇబ్బంది పెట్టాయో అని ఆమెకు మద్దతుగా మాట్లాడేవాళ్లూ ఉన్నారు.
This post was last modified on November 24, 2024 2:18 pm
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు మాత్రమే వచ్చిన వైసీపీ సభ్యులు.. తర్వాత పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సభకు…