ఎదురీదుతున్న సత్యదేవ్ సినిమా‘పుష్ప-2’ రావడానికి ముందు టాలీవుడ్లో చిన్న సినిమాల జాతర కొనసాగుతోంది. ఈ శుక్రవారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలంటే.. మెకానిక్ రాకీ, జీబ్రా, దేవకీ నందన వాసుదేవనే. ఐతే ఈ మూడు చిత్రాల్లో దేనికీ పాజిటివ్ టాక్ రాలేదు. ఉన్నంతలో ‘మెకానిక్ రాకీ’ టాక్ మెరుగ్గా కనిపించింది. దానికి ముందు నుంచే బజ్ కనిపించింది. పెయిడ్ ప్రిమియర్స్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. షోలన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఐతే ప్రథమార్ధం మరీ రొటీన్గా ఉండడం సినిమాకు మైనస్ అయింది. సెకండాఫ్ బెటర్గా ఉన్నా.. ఓవరాల్ సినిమా ఎంపాక్ట్ మెరుగుపడలేదు.
శుక్రవారం ఫస్ట్ ఛాయిస్ ఈ సినిమానే కానీ.. తర్వాత వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. శనివారం ‘మెకానిక్ రాకీ’ ఓ మోస్తరుగా ఆడిందంతే. విశేషం ఏంటంటే.. దీంతో పోలిస్తే ఎక్కువ నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘జీబ్రా’ సినిమాకు వసూళ్లు పర్వాలేదనిపించేలా ఉన్నాయి.‘జీబ్రా’కు ‘మెకానిక్ రాకీ’ కంటే తక్కువ రేటింగ్స్ పడ్డాయి. టాక్ కూడా నెగెటివ్గానే వచ్చింది. కానీ శనివారం మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ కావడం దీనికి కలిసొచ్చిన అంశంలా కనిపిస్తోంది. కన్నడ, తమిళ భాషల్లో కూడా ‘జీబ్రా’కు స్పందన పర్వాలేదు. ఆదివారం ‘మెకానిక్ రాకీ’ మీద ‘జీబ్రా’ ఆధిపత్యం చలాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ పరిస్థితి దయనీయంగా ఉంది. రిలీజ్ ముందు ఈ సినిమాకు బజ్ లేదు. పైగా టాక్ మరీ బ్యాడ్గా ఉంది. ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథ గురించి హడావుడి చేశారు కానీ.. అందులో అంత విశేషమేమీ కనిపించలేదు. అసలే బజ్ లేదు, పైగా బ్యాడ్ టాక్.. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వాషౌట్ అయినట్లే కనిపిస్తోంది.
This post was last modified on November 24, 2024 11:51 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…