ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ ఈమధ్య ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. మిర్చి సినిమాతో మొదలైన వీరి ప్రయాణంలో ఆ తరువాత మిడ్ రేంజ్ హీరోలతోనే మంచి విజయాలు అందుకున్నారు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతీరోజు పండగే.. లాంటి సినిమాలు టాప్ ప్రాఫిట్స్ అందించాయి. కానీ సాహో, రాధే శ్యామ్ లాంటి పెద్ద సినిమాలు ఆర్థికంగా గట్టి దెబ్బ కొట్టాయి.
ఆదిపురుష్ ను తెలుగులో రిలీజ్ చేసి మరో దెబ్బ తిన్నారు. ఇక ఆమధ్య కాస్త ఆచితూచి రిస్కులు చేశారు. అవేమి పెద్దగా లాభాలు ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా కంగువా నిర్మాణంలో భాగం కాగా మరో గట్టి దెబ్బ తగిలింది. దీంతో స్పీడ్ తగ్గించిన మేకర్స్ ‘విశ్వంభర’ పైనే భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగి రిలీజ్ అయ్యే వరకు మరో రిస్క్ చేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన రెండు సినిమాలను పక్కన పెట్టేశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీచంద్తో ఓ సినిమా చేయడానికి యూవీ క్రియేషన్స్ చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. గోపీచంద్కు ఉన్న మాస్ ఇమేజ్, రాధాకృష్ణకు ఉన్న టెక్నికల్ టాలెంట్ వల్ల ఈ ప్రాజెక్ట్ విజయం సాధించగలదని సంస్థ భావించింది. అయితే, ఇటీవల గోపీచంద్ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడం, ‘విశ్వం’ వంటి సినిమాలు డిజాస్టర్ కావడం యూవీ క్రియేషన్స్ను ఆలోచనలో పడేసింది. అందులోనూ కంగువా కారణంగా వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 70 MM అనే మరో సంస్థ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక అఖిల్ తో కూడా 100కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా అనుకున్నారు. కొత్త దర్శకుడు అనిల్ తో కాస్త ప్రీ ప్రొడక్షన్ కూడా చేశారు. ఇక సడన్ గా ఈ ప్రాజెక్టుతో కూడా రిస్క్ వద్దని హోల్డ్ లో పెట్టారు. అయితే లైన్ లో ఉన్న వరుణ్ తేజ్ – మెర్లపాక గాంధీ సినిమాను సేఫ్ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. అది కూడా సోలోగా కాకుండా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో కలిసి నిర్మిస్తున్నారు. ముందుగా నాన్ థియేట్రికల్ బిజినెస్ తో ఈ సినిమా సేఫ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి నిర్మిస్తున్నారట. ఏది ఏమైనా యూవీ వాళ్ళు ఇప్పుడు రిస్క్ లకు భయంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి ‘విశ్వంభర’ ప్రాజెక్ట్పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే సంస్థ తిరిగి తన పాత వైభవాన్ని అందుకోగలదనే నమ్మకంతో ఉంది.
This post was last modified on November 23, 2024 12:15 pm
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…