ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా ఎవరు చేస్తారనే ప్రచారానికి ముగింపు పలికారు. విలక్షణ నటుడిగా పేరొందిన స్వర్గీయ ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ ని ఎంచుకున్నట్టు బాలీవుడ్ అప్డేట్. తెలుగులో ఆనంద్ దేవరకొండ పోషించిన ఆటో డ్రైవర్ పాత్రను అతనితో చేయించబోతున్నారు. కెరీర్ మొదట్లోనే ఇంత ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం అదృష్టమే. కాకపోతే తండ్రిని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటారు కాబట్టి నటన పరంగా వాటిని అందుకోవడం తనకు సవాల్ కాబోతోంది.
బాలీవుడ్ వెర్షన్ కు సాయి రాజేషే దర్శకత్వం వహించబోతున్నాడు. నిర్మాత ఎస్కెఎన్ కొన్ని నెలల క్రితమే ఈ విషయం చెప్పినప్పటికీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పుల కోసం సమయం తీసుకోవడం ప్రకటన ఆలస్యమవుతోంది. హీరోయిన్ గా ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. కృతి శెట్టి పేరు పరిశీలనలో ఉందనే టాక్ వచ్చినప్పటికీ అది నిజం కాదని తెలిసింది. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాన్వీ కపూర్ చెల్లి ఖుషిని అనుకున్నారు కానీ ఎందుకనో కార్యరూపం దాల్చకపోవచ్చు. మధు మంతెన ప్రధాన నిర్మాతగా వ్యవహరించబోతున్నారట.
బాబిల్ ఖాన్ కు ఇది డెబ్యూ కాదు. 2022 అన్విత దత్ తీసిన ఖలాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫ్రైడే నైట్ ప్లాన్ గుర్తింపు తీసుకురాగా యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన వెబ్ సిరీస్ ది రైల్వే మెన్ లో మెరిశాడు. షూజిత్ సిర్కార్ తో వేరే సినిమా చేస్తున్నాడు. వీటి సరసన బేబీ రీమేక్ చేరనుంది. వంద కోట్లకు దగ్గరగా వెళ్లిన బేబీ ఇప్పటిదాకా బోలెడు అవార్డులు సొంతం చేసుకుంది. హిందీలోనూ సోల్ తగ్గకుండా ఉండటం కోసం సాయిరాజేష్ కు బాధ్యతలు అప్పజెప్పారు. కాకపోతే రీమేక్ తో నార్త్ ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభం కాదు. అందుకే ఎక్కువ సమయం తీసుకుంటున్నారట.
This post was last modified on November 23, 2024 10:05 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…