ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. 29 ఏళ్ల వైవాహిక బంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన రెహమాన్ ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణాలను వెల్లడించలేదు. అయితే, ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే సమయంలో రెహమాన్ మ్యూజిక్ టీమ్లో మోహిని దే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం, ఈ రెండు సంఘటనల మధ్య సంబంధం ఉందని పుకార్లు చెలరేగాయి. దీంతో రెహమాన్ కుటుంబంపై వస్తున్న రూమర్స్ పట్ల అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, రెహమాన్ కొడుకు అమీన్ ఈ పుకార్లపై సోషల్ మీడియాలో స్పందించారు.
తన తండ్రి గురించి కొన్ని తప్పుడు వార్తలు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పిన అమీన్, రెహమాన్ ఒక లెజెండ్ అని, ఆయన అందించిన మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేమను అందుకుందని తెలిపారు. “అసలు ఆధారాలు లేకుండా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం చాలా దురదృష్టకరం. దయచేసి మా కుటుంబాన్ని గౌరవించండి,” అని అమీన్ పేర్కొన్నారు.
అదే సమయంలో, రెహమాన్ కూతురు రహీమా కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, “రూమర్స్ ఎప్పుడూ ద్వేషించే వారు క్రియేట్ చేస్తారు, తెలివితక్కువవారు వ్యాప్తి చేస్తారు” అంటూ కౌంటర్ ఇచ్చారు. 1995లో వివాహం చేసుకున్న రెహమాన్-సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు ఖతీజా, అమీన్, రహీమా ఉన్నారు. ఇక పుకార్లపై వారసులు ఈ విధంగా సమాధానం ఇవ్వడం, మరింత చర్చకు దారితీస్తోంది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవరికి లేదని మరికొందరు నెటిజన్లు వారికి మద్దతు ఇస్తున్నారు.
This post was last modified on November 22, 2024 6:38 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…