ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. 29 ఏళ్ల వైవాహిక బంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన రెహమాన్ ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణాలను వెల్లడించలేదు. అయితే, ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే సమయంలో రెహమాన్ మ్యూజిక్ టీమ్లో మోహిని దే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం, ఈ రెండు సంఘటనల మధ్య సంబంధం ఉందని పుకార్లు చెలరేగాయి. దీంతో రెహమాన్ కుటుంబంపై వస్తున్న రూమర్స్ పట్ల అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, రెహమాన్ కొడుకు అమీన్ ఈ పుకార్లపై సోషల్ మీడియాలో స్పందించారు.
తన తండ్రి గురించి కొన్ని తప్పుడు వార్తలు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పిన అమీన్, రెహమాన్ ఒక లెజెండ్ అని, ఆయన అందించిన మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేమను అందుకుందని తెలిపారు. “అసలు ఆధారాలు లేకుండా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం చాలా దురదృష్టకరం. దయచేసి మా కుటుంబాన్ని గౌరవించండి,” అని అమీన్ పేర్కొన్నారు.
అదే సమయంలో, రెహమాన్ కూతురు రహీమా కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, “రూమర్స్ ఎప్పుడూ ద్వేషించే వారు క్రియేట్ చేస్తారు, తెలివితక్కువవారు వ్యాప్తి చేస్తారు” అంటూ కౌంటర్ ఇచ్చారు. 1995లో వివాహం చేసుకున్న రెహమాన్-సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు ఖతీజా, అమీన్, రహీమా ఉన్నారు. ఇక పుకార్లపై వారసులు ఈ విధంగా సమాధానం ఇవ్వడం, మరింత చర్చకు దారితీస్తోంది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవరికి లేదని మరికొందరు నెటిజన్లు వారికి మద్దతు ఇస్తున్నారు.
This post was last modified on November 22, 2024 6:38 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…