ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. 29 ఏళ్ల వైవాహిక బంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన రెహమాన్ ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణాలను వెల్లడించలేదు. అయితే, ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే సమయంలో రెహమాన్ మ్యూజిక్ టీమ్లో మోహిని దే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం, ఈ రెండు సంఘటనల మధ్య సంబంధం ఉందని పుకార్లు చెలరేగాయి. దీంతో రెహమాన్ కుటుంబంపై వస్తున్న రూమర్స్ పట్ల అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, రెహమాన్ కొడుకు అమీన్ ఈ పుకార్లపై సోషల్ మీడియాలో స్పందించారు.
తన తండ్రి గురించి కొన్ని తప్పుడు వార్తలు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పిన అమీన్, రెహమాన్ ఒక లెజెండ్ అని, ఆయన అందించిన మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేమను అందుకుందని తెలిపారు. “అసలు ఆధారాలు లేకుండా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం చాలా దురదృష్టకరం. దయచేసి మా కుటుంబాన్ని గౌరవించండి,” అని అమీన్ పేర్కొన్నారు.
అదే సమయంలో, రెహమాన్ కూతురు రహీమా కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, “రూమర్స్ ఎప్పుడూ ద్వేషించే వారు క్రియేట్ చేస్తారు, తెలివితక్కువవారు వ్యాప్తి చేస్తారు” అంటూ కౌంటర్ ఇచ్చారు. 1995లో వివాహం చేసుకున్న రెహమాన్-సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు ఖతీజా, అమీన్, రహీమా ఉన్నారు. ఇక పుకార్లపై వారసులు ఈ విధంగా సమాధానం ఇవ్వడం, మరింత చర్చకు దారితీస్తోంది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవరికి లేదని మరికొందరు నెటిజన్లు వారికి మద్దతు ఇస్తున్నారు.
This post was last modified on November 22, 2024 6:38 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…