జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ మీద ఎంత స్థాయి బజ్ ఉందనేది పక్కనపెడితే పోటీ రూపంలో తలెత్తున్న ఇబ్బంది వసూళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సమస్య లేదు కానీ యావరేజ్ లేదా అంతకన్నా భిన్నమైన మాట వినిపిస్తే మాత్రం పోటీదారులు వసూళ్లను ఎగరేసుకుని పోతారు. అసలే రేసులో బాలకృష్ణ, వెంకటేష్ నువ్వా నేనా అంటూ హిట్లు తీసిన డైరెక్టర్లు బాబీ, అనిల్ రావిపూడితో వస్తున్నారు. ఇక్కడేమో చరణ్ కు ఇండియన్ 2 డిజాస్టర్ ముద్ర పడిన శంకర్ కాంబో కుదిరింది. సరే ఇప్పుడు టాపిక్ టాలీవుడ్ గురించి కాదు.
ప్యాన్ ఇండియా స్థాయిలో గేమ్ ఛేంజర్ కు జనవరి 10న విక్కీ కౌశల్ చావా క్లాష్ అవుతుందని కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ వర్గాలు ఉటంకించాయి. కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం చావా మరో నెల వాయిదా వేసుకుని ఫిబ్రవరి 19కి వెళ్లొచ్చట. కారణాలు ఫలానా అని తెలియదు కానీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ గురించి ఎక్కువ వినిపిస్తోంది. ఇది నిజమైతే ఉత్తరాది రాష్ట్రాల్లో చరణ్ మూవీకి పెద్ద రిలీఫ్ దక్కుతుంది. ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ జనవరి 10 వస్తుందా రాదానే అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. సంక్రాంతి రేసులో ఉందనే లీక్ అయితే మైత్రి వాళ్ళు ఇచ్చారు కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.
సో ఎలా చూసుకున్న గేమ్ ఛేంజర్ కు చావా రూపంలో బాలీవుడ్ వైపు నుంచి ఒక పెద్ద ముప్పు తప్పినట్టే. కాకపోతే అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాలి. ఈ వారంలో మూడో ఆడియో సింగల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో బజ్ మరింత పెరగాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవైపు పుష్ప 2 ఫీవర్ కమ్ముకుంటున్న తరుణంలో రామ్ చరణ్ టీమ్ మీద పెద్ద బాధ్యతే ఉంది. ఇంకో యాభై రోజుల్లో విడుదల తేదీ వచ్చేస్తుంది. దిల్ రాజు ఒకపక్క సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ ఛేంజర్ పబ్లిసిటీని చూసుకోవాలి. ట్రైలర్ లాంచ్ ని ఘనంగా జరిపాలన్న ప్లానింగ్ త్వరలో ఒక కొలిక్కి రావొచ్చు.
This post was last modified on November 21, 2024 6:37 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…