Movie News

పెళ్లే చేసుకోను.. తేల్చేసిన హీరోయిన్

హీరోయిన్లను పెళ్లి గురించి అడిగితే.. ఇప్పుడే కాదు, ప్రస్తుతం కెరీర్ మీదే నా దృష్టి, సరైన సమయం వచ్చినపుడు చేసుకుంటా అని చెప్పడం కామన్. ఐతే ఇప్పుడో స్టార్ హీరోయిన్ తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ముందు పెళ్లి చేసుకుందాం అనుకుని కూడా ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాను అంటున్న ఆ కథానాయికే.. ఐశ్వర్యా లక్ష్మి. ఈ మలయాళ భామ తమిళంతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లి గురించి ఆమె తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది.

తన కొత్త చిత్రం ‘హలో మమ్మీ’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. నా ప్రొఫైల్ కూడా మ్యాట్రిమోనీలో పెట్టాను. కానీ కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నారు అనిపించింది. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నా. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా” అని ఐశ్వర్య స్పష్టం చేసింది.

సత్యదేవ్ ‘గాడ్సే’ మూవీతో ఐశ్వర్య తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అనువాద చిత్రం ‘మట్టి కుస్తీ’ ఆమెకు ఇక్కడ ఫాలోయిగ్ తెచ్చి పెట్టింది. అంతకంటే ముందు ఆమె తన సొంత భాష మలయాళంలో చాలా సినిమాలు చేసింది. తమిళంలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో నటించింది. ‘పొన్నియన్ సెల్వన్’, ‘జగమే తంత్రం’ లాంటి క్రేజీ సినిమాల్లో చేసింది. ప్రస్తుతం తెలుగులో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో ఐశ్వర్య హీరోయిన్‌గా నటిస్తోంది.

This post was last modified on November 20, 2024 5:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

2 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

5 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

6 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

6 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

6 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

7 hours ago