హీరోయిన్లను పెళ్లి గురించి అడిగితే.. ఇప్పుడే కాదు, ప్రస్తుతం కెరీర్ మీదే నా దృష్టి, సరైన సమయం వచ్చినపుడు చేసుకుంటా అని చెప్పడం కామన్. ఐతే ఇప్పుడో స్టార్ హీరోయిన్ తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ముందు పెళ్లి చేసుకుందాం అనుకుని కూడా ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాను అంటున్న ఆ కథానాయికే.. ఐశ్వర్యా లక్ష్మి. ఈ మలయాళ భామ తమిళంతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లి గురించి ఆమె తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అభిమానులను షాక్కు గురి చేసింది.
తన కొత్త చిత్రం ‘హలో మమ్మీ’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. నా ప్రొఫైల్ కూడా మ్యాట్రిమోనీలో పెట్టాను. కానీ కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నారు అనిపించింది. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నా. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా” అని ఐశ్వర్య స్పష్టం చేసింది.
సత్యదేవ్ ‘గాడ్సే’ మూవీతో ఐశ్వర్య తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అనువాద చిత్రం ‘మట్టి కుస్తీ’ ఆమెకు ఇక్కడ ఫాలోయిగ్ తెచ్చి పెట్టింది. అంతకంటే ముందు ఆమె తన సొంత భాష మలయాళంలో చాలా సినిమాలు చేసింది. తమిళంలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో నటించింది. ‘పొన్నియన్ సెల్వన్’, ‘జగమే తంత్రం’ లాంటి క్రేజీ సినిమాల్లో చేసింది. ప్రస్తుతం తెలుగులో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో ఐశ్వర్య హీరోయిన్గా నటిస్తోంది.
This post was last modified on November 20, 2024 5:12 pm
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా…
మంత్రి లోకేష్ చెప్పిన మాటలను ఎమ్మెల్యేలు తు.చ. తప్పకుండా చేస్తున్నారనడానికి శనివారం రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలే ఉదాహరణ. వాస్తవానికి…
గత ఏడాది విడుదలైన 'తెలుసు కదా' అంచనాలు అందుకోలేక సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ వేసిన తెలిసిందే. న్యూ…
బహుశా ఇలాంటి వెరైటీ భారీ బాక్సాఫీస్ క్లాష్ గతంలో చూసి ఉండం. ఒక హిందీ మూవీతో తెలుగు సినిమా కాంపీట్…