హీరోయిన్లను పెళ్లి గురించి అడిగితే.. ఇప్పుడే కాదు, ప్రస్తుతం కెరీర్ మీదే నా దృష్టి, సరైన సమయం వచ్చినపుడు చేసుకుంటా అని చెప్పడం కామన్. ఐతే ఇప్పుడో స్టార్ హీరోయిన్ తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ముందు పెళ్లి చేసుకుందాం అనుకుని కూడా ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాను అంటున్న ఆ కథానాయికే.. ఐశ్వర్యా లక్ష్మి. ఈ మలయాళ భామ తమిళంతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లి గురించి ఆమె తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అభిమానులను షాక్కు గురి చేసింది.
తన కొత్త చిత్రం ‘హలో మమ్మీ’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. నా ప్రొఫైల్ కూడా మ్యాట్రిమోనీలో పెట్టాను. కానీ కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నారు అనిపించింది. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నా. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా” అని ఐశ్వర్య స్పష్టం చేసింది.
సత్యదేవ్ ‘గాడ్సే’ మూవీతో ఐశ్వర్య తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అనువాద చిత్రం ‘మట్టి కుస్తీ’ ఆమెకు ఇక్కడ ఫాలోయిగ్ తెచ్చి పెట్టింది. అంతకంటే ముందు ఆమె తన సొంత భాష మలయాళంలో చాలా సినిమాలు చేసింది. తమిళంలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో నటించింది. ‘పొన్నియన్ సెల్వన్’, ‘జగమే తంత్రం’ లాంటి క్రేజీ సినిమాల్లో చేసింది. ప్రస్తుతం తెలుగులో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో ఐశ్వర్య హీరోయిన్గా నటిస్తోంది.
This post was last modified on November 20, 2024 5:12 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…