హీరోయిన్లను పెళ్లి గురించి అడిగితే.. ఇప్పుడే కాదు, ప్రస్తుతం కెరీర్ మీదే నా దృష్టి, సరైన సమయం వచ్చినపుడు చేసుకుంటా అని చెప్పడం కామన్. ఐతే ఇప్పుడో స్టార్ హీరోయిన్ తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ముందు పెళ్లి చేసుకుందాం అనుకుని కూడా ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాను అంటున్న ఆ కథానాయికే.. ఐశ్వర్యా లక్ష్మి. ఈ మలయాళ భామ తమిళంతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లి గురించి ఆమె తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అభిమానులను షాక్కు గురి చేసింది.
తన కొత్త చిత్రం ‘హలో మమ్మీ’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. నా ప్రొఫైల్ కూడా మ్యాట్రిమోనీలో పెట్టాను. కానీ కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నారు అనిపించింది. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నా. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా” అని ఐశ్వర్య స్పష్టం చేసింది.
సత్యదేవ్ ‘గాడ్సే’ మూవీతో ఐశ్వర్య తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అనువాద చిత్రం ‘మట్టి కుస్తీ’ ఆమెకు ఇక్కడ ఫాలోయిగ్ తెచ్చి పెట్టింది. అంతకంటే ముందు ఆమె తన సొంత భాష మలయాళంలో చాలా సినిమాలు చేసింది. తమిళంలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో నటించింది. ‘పొన్నియన్ సెల్వన్’, ‘జగమే తంత్రం’ లాంటి క్రేజీ సినిమాల్లో చేసింది. ప్రస్తుతం తెలుగులో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో ఐశ్వర్య హీరోయిన్గా నటిస్తోంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…