Movie News

పుష్ప-2.. త్రీడీ ఎందుకు మాస్టారూ?

ఇటీవలే విడుదలైన ‘పుష్ప-2’ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ నిండా ఎలివేషన్ షాట్స్, మాస్ అంశాలు, పంచ్ డైలాగులతో నింపేసిన సుకుమార్ ప్రేక్షకుల్లో సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఇంకా పెంచేశాడు. ట్రైలర్లోని హిడెన్ థింగ్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. ట్రైలర్ చివర్లో ఈ సినిమా త్రీడీలో కూడా రిలీజ్ కాబోతోందని చెప్పడం ప్రేక్షకులకు షాకే.

పుష్ప-2 త్రీడీలో వస్తుందనే సమాచారం ఇప్పటిదాకా బయటికి రాలేదు. ‘పుష్ప-1’కు త్రీడీ వెర్షన్ లేదు. కానీ పుష్ప-2ను మాత్రం త్రీడీలో రిలీజ్ చేస్తారట. అసలు ఇలాంటి మాస్ సినిమాకు త్రీడీ వెర్షన్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెద్ద పెద్ద ఈవెంట్ ఫిలిమ్స్‌కే త్రీడీ మైనస్ అయింది. 2డీ వెర్షన్‌నే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. కల్కి సినిమా సైతం 2డీలోనే బెటర్‌గా అనిపించిందని రెండు వెర్షన్లూ చూసిన వాళ్లు చెప్పారు. ఇటీవలే విడుదలైన సూర్య సినిమా ‘కంగువ’ సైతం 3డీలో కంటే రెగ్యులర్ వెర్షన్‌లోనే బెటర్ అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండి.. న్యూ వరల్డ్ క్రియేట్ చేసిన సినిమాలను త్రీడీలో చూస్తే బాగుంటుంది.

‘పుష్ప-2’ లాంటి సినిమాలకు రెగ్యులర్ వెర్షనే బెటర్. అసలు ఇలాంటి మాస్ మూవీని త్రీడీలో తీయాలని సుకుమార్‌కు ఎందుకు అనిపించిందన్నది అర్థం కాని విషయం. 3డీలో తీస్తుంటే ముందు నుంచే దాని గురించి ప్రచారం చేయడం, ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం అవసరం. కానీ ఉన్నట్లుండి ట్రైలర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. దీని పట్ల సోషల్ మీడియాలో సానుకూల స్పందనేమీ కనిపించడం లేదు. చూస్తుంటే మేకర్స్ కూడా మొక్కుబడిగానే త్రీడీ వెర్షన్ రిలీజ్ చేసేలా ఉన్నారు. ఇది అనవసర ప్రయాస తప్ప.. ప్రత్యేక ప్రయోజనం చేకూర్చే ఆలోచనేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘పుష్ప-2’ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on November 20, 2024 7:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

6 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

7 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

8 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

8 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

11 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

12 hours ago