ఇటీవలే విడుదలైన ‘పుష్ప-2’ ట్రైలర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ నిండా ఎలివేషన్ షాట్స్, మాస్ అంశాలు, పంచ్ డైలాగులతో నింపేసిన సుకుమార్ ప్రేక్షకుల్లో సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఇంకా పెంచేశాడు. ట్రైలర్లోని హిడెన్ థింగ్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. ట్రైలర్ చివర్లో ఈ సినిమా త్రీడీలో కూడా రిలీజ్ కాబోతోందని చెప్పడం ప్రేక్షకులకు షాకే.
పుష్ప-2 త్రీడీలో వస్తుందనే సమాచారం ఇప్పటిదాకా బయటికి రాలేదు. ‘పుష్ప-1’కు త్రీడీ వెర్షన్ లేదు. కానీ పుష్ప-2ను మాత్రం త్రీడీలో రిలీజ్ చేస్తారట. అసలు ఇలాంటి మాస్ సినిమాకు త్రీడీ వెర్షన్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెద్ద పెద్ద ఈవెంట్ ఫిలిమ్స్కే త్రీడీ మైనస్ అయింది. 2డీ వెర్షన్నే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. కల్కి సినిమా సైతం 2డీలోనే బెటర్గా అనిపించిందని రెండు వెర్షన్లూ చూసిన వాళ్లు చెప్పారు. ఇటీవలే విడుదలైన సూర్య సినిమా ‘కంగువ’ సైతం 3డీలో కంటే రెగ్యులర్ వెర్షన్లోనే బెటర్ అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండి.. న్యూ వరల్డ్ క్రియేట్ చేసిన సినిమాలను త్రీడీలో చూస్తే బాగుంటుంది.
‘పుష్ప-2’ లాంటి సినిమాలకు రెగ్యులర్ వెర్షనే బెటర్. అసలు ఇలాంటి మాస్ మూవీని త్రీడీలో తీయాలని సుకుమార్కు ఎందుకు అనిపించిందన్నది అర్థం కాని విషయం. 3డీలో తీస్తుంటే ముందు నుంచే దాని గురించి ప్రచారం చేయడం, ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం అవసరం. కానీ ఉన్నట్లుండి ట్రైలర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. దీని పట్ల సోషల్ మీడియాలో సానుకూల స్పందనేమీ కనిపించడం లేదు. చూస్తుంటే మేకర్స్ కూడా మొక్కుబడిగానే త్రీడీ వెర్షన్ రిలీజ్ చేసేలా ఉన్నారు. ఇది అనవసర ప్రయాస తప్ప.. ప్రత్యేక ప్రయోజనం చేకూర్చే ఆలోచనేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘పుష్ప-2’ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…