రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు ఇదే తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన తలపతి 69 షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. 2025 దీపావళి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ తేదీ అధికారికంగా ప్రకటించలేదు. కాంతారా చాప్టర్ 1తో క్లాష్ కావొచ్చనే ప్రచారం డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో బలంగా ఉంది. ఇదిలా ఉండగా హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామా బాలకృష్ణ భగవంత్ కేసరి ఆధారంగా రూపొందుతోందనే ప్రచారం జోరుగా ఉంది. ఇది షూటింగ్ టైంలోనే బయటికి వచ్చినప్పటికీ క్రమంగా ఈ వాదనకు బలం చేకూరే ఆధారాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
భగవంత్ కేసరిలో బాలకృష్ణ స్నేహితుడిగా నటించిన శరత్ కుమార్ పాత్రకు తొలుత శివరాజ్ కుమార్ ని అడిగారట. కానీ ప్రాధాన్యం తక్కువగా ఉండటంతో పాటు చనిపోయే క్యారెక్టర్ కావడం వల్ల దర్శకుడే తిరిగి వద్దనుకున్నారనే టాక్ చెన్నై వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలే ఆర్మీ క్యాంప్ లో ఒక షెడ్యూల్ చేశారు. శ్రీలీలను పోలిన పాత్ర చేస్తున్న మమిత బైజుకు సంబంధించిన ట్రైనింగ్ ఎపిసోడ్స్ అక్కడే చిత్రీకరించి ఉండొచ్చు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్థానంలో తమిళంలో పూజా హెగ్డే కనిపిస్తుంది. ఇక విలన్ గా అర్జున్ రాంపాల్ బదులుగా ఆ బాధ్యతను బాబీ డియోల్ తీసుకున్నాడు.
సో ఏ కోణంలో చూసుకున్నా ఇది భగవంత్ కేసరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ప్రస్తుతానికి గాసిప్ గానే తీసుకోవాలి. హెచ్ వినోత్ గతంలో పింక్ కోలీవుడ్ రీమేక్ ని చాలా మార్పులతో కమర్షియల్ కోటింగ్ ఇచ్చి మెప్పించాడు. వకీల్ సాబ్ కి దాన్నే ఫాలో అయ్యాడు వేణు శ్రీరామ్. భగవంత్ కేసరి ముందే రెడీ మేడ్ కమర్షియల్ ప్యాకేజ్. ఇక విజయ్ చివరి చిత్రంగా చేయబోయే మార్పులు ఖచ్చితంగా బెస్ట్ ఉంటాయి. ఒకవేళ ఈ టాక్ కనక నిజమైతే తెలుగు డబ్బింగ్ తో మన ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి. ట్రైలర్ వచ్చేదాకా క్లారిటీ రావడం కష్టమే.
This post was last modified on November 19, 2024 2:15 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…