Movie News

500 కోట్ల ఇండియన్ టీవీ సిరీస్ గురించి తెలుసా?

ఇండియన్ సినిమా బడ్జెట్లను, వసూళ్లను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. పదేళ్ల కిందటే ఈ సినిమా మీద రూ.250 కోట్లు పెట్టింది చిత్ర బృందం. పార్ట్-2 కోసం ఇంకా ఎక్కువే ఖర్చయింది. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర, ఆదిపురుష్, కల్కి లాంటి సినిమాలు ఆ చిత్ర బడ్జెట్‌ను అధిగమించాయి.

ఇప్పుడు ఇండియన్ సినిమాల మీద ఐదొందల కోట్లు ఖర్చు పెట్టినా వర్కవుట్ అవుతోంది. దర్శకుల్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ.. హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు తిరుగులేని మార్కెట్ సంపాదించుకుని ఎంత బడ్జెట్ పెట్టినా రికవర్ చేయగల స్థితిలో ఉన్నారు.

ఐతే వీళ్లకున్న ఫేమ్, మార్కెట్ వేరు. కానీ ఒక టీవీ షోలో పెద్దగా పేరు లేని ఆర్టిస్టులను పెట్టి, ఎలాంటి ఇమేజ్ లేని దర్శకుడితో సిరీస్ చేసి రూ.500 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు సాహసం కాదు. ఈ సాహసాన్ని ఆరేడళ్ల కిందటే చేశారంటే ఆశ్చర్యపోక తప్పదు.

‘పోరస్’ అనే హిందీ టీవీ సిరీస్ కోసం 2017-18 ప్రాంతంలోనే ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేయడం విశేషం. గ్రీకు రాజు అలెగ్జాండర్‌తో పోరాడిన పౌరవ రాజు కథతో ‘పోరస్’ను భారీగా రూపొందించారు. ఇందులో లక్ష్ లల్వాని లీడ్ రోల్ చేశాడు. సిద్దార్థ్ కుమార్ తివారి ఈ సిరీస్‌ను క్రియేట్ చేశాడు.

ఏడాది పాటు ఈ షో రన్ అయింది. కలర్స్ టీవీ ప్రసారం చేసిన ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా సుమారు రూ.2 కోట్లు ఖర్చు కావడం విశేషం. బాహుబలి లాంటి సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో అంతర్జాతీయ నిపుణులతో ఈ సిరీస్‌కు విజువల్ ఎఫెక్ట్స్ చేయించారు.

299 ఎపిసోడ్ల పాటు ఈ సిరీస్ ప్రసాదరమైంది. ఈ షోకు ప్రేక్షకుల నుంచి రివార్డులే కాదు.. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తివారి ఏషియా టెలివిజన్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్‌గా పురస్కారం కూడా అందుకున్నాడు. మన ప్రేక్షకులకు ఈ సిరీస్ గురించి పెద్దగా తెలియదు కానీ.. హిందీలో మాత్రం ఇది బాగానే పాపులర్.

This post was last modified on November 19, 2024 5:25 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

1 hour ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

1 hour ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

1 hour ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

8 hours ago