ఇండియన్ సినిమా బడ్జెట్లను, వసూళ్లను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. పదేళ్ల కిందటే ఈ సినిమా మీద రూ.250 కోట్లు పెట్టింది చిత్ర బృందం. పార్ట్-2 కోసం ఇంకా ఎక్కువే ఖర్చయింది. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర, ఆదిపురుష్, కల్కి లాంటి సినిమాలు ఆ చిత్ర బడ్జెట్ను అధిగమించాయి.
ఇప్పుడు ఇండియన్ సినిమాల మీద ఐదొందల కోట్లు ఖర్చు పెట్టినా వర్కవుట్ అవుతోంది. దర్శకుల్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ.. హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు తిరుగులేని మార్కెట్ సంపాదించుకుని ఎంత బడ్జెట్ పెట్టినా రికవర్ చేయగల స్థితిలో ఉన్నారు.
ఐతే వీళ్లకున్న ఫేమ్, మార్కెట్ వేరు. కానీ ఒక టీవీ షోలో పెద్దగా పేరు లేని ఆర్టిస్టులను పెట్టి, ఎలాంటి ఇమేజ్ లేని దర్శకుడితో సిరీస్ చేసి రూ.500 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు సాహసం కాదు. ఈ సాహసాన్ని ఆరేడళ్ల కిందటే చేశారంటే ఆశ్చర్యపోక తప్పదు.
‘పోరస్’ అనే హిందీ టీవీ సిరీస్ కోసం 2017-18 ప్రాంతంలోనే ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేయడం విశేషం. గ్రీకు రాజు అలెగ్జాండర్తో పోరాడిన పౌరవ రాజు కథతో ‘పోరస్’ను భారీగా రూపొందించారు. ఇందులో లక్ష్ లల్వాని లీడ్ రోల్ చేశాడు. సిద్దార్థ్ కుమార్ తివారి ఈ సిరీస్ను క్రియేట్ చేశాడు.
ఏడాది పాటు ఈ షో రన్ అయింది. కలర్స్ టీవీ ప్రసారం చేసిన ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్కు ఏకంగా సుమారు రూ.2 కోట్లు ఖర్చు కావడం విశేషం. బాహుబలి లాంటి సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో అంతర్జాతీయ నిపుణులతో ఈ సిరీస్కు విజువల్ ఎఫెక్ట్స్ చేయించారు.
299 ఎపిసోడ్ల పాటు ఈ సిరీస్ ప్రసాదరమైంది. ఈ షోకు ప్రేక్షకుల నుంచి రివార్డులే కాదు.. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తివారి ఏషియా టెలివిజన్ అవార్డ్స్లో బెస్ట్ డైరెక్టర్గా పురస్కారం కూడా అందుకున్నాడు. మన ప్రేక్షకులకు ఈ సిరీస్ గురించి పెద్దగా తెలియదు కానీ.. హిందీలో మాత్రం ఇది బాగానే పాపులర్.
This post was last modified on November 19, 2024 5:25 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…