Movie News

500 కోట్ల ఇండియన్ టీవీ సిరీస్ గురించి తెలుసా?

ఇండియన్ సినిమా బడ్జెట్లను, వసూళ్లను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. పదేళ్ల కిందటే ఈ సినిమా మీద రూ.250 కోట్లు పెట్టింది చిత్ర బృందం. పార్ట్-2 కోసం ఇంకా ఎక్కువే ఖర్చయింది. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర, ఆదిపురుష్, కల్కి లాంటి సినిమాలు ఆ చిత్ర బడ్జెట్‌ను అధిగమించాయి.

ఇప్పుడు ఇండియన్ సినిమాల మీద ఐదొందల కోట్లు ఖర్చు పెట్టినా వర్కవుట్ అవుతోంది. దర్శకుల్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ.. హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు తిరుగులేని మార్కెట్ సంపాదించుకుని ఎంత బడ్జెట్ పెట్టినా రికవర్ చేయగల స్థితిలో ఉన్నారు.

ఐతే వీళ్లకున్న ఫేమ్, మార్కెట్ వేరు. కానీ ఒక టీవీ షోలో పెద్దగా పేరు లేని ఆర్టిస్టులను పెట్టి, ఎలాంటి ఇమేజ్ లేని దర్శకుడితో సిరీస్ చేసి రూ.500 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు సాహసం కాదు. ఈ సాహసాన్ని ఆరేడళ్ల కిందటే చేశారంటే ఆశ్చర్యపోక తప్పదు.

‘పోరస్’ అనే హిందీ టీవీ సిరీస్ కోసం 2017-18 ప్రాంతంలోనే ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేయడం విశేషం. గ్రీకు రాజు అలెగ్జాండర్‌తో పోరాడిన పౌరవ రాజు కథతో ‘పోరస్’ను భారీగా రూపొందించారు. ఇందులో లక్ష్ లల్వాని లీడ్ రోల్ చేశాడు. సిద్దార్థ్ కుమార్ తివారి ఈ సిరీస్‌ను క్రియేట్ చేశాడు.

ఏడాది పాటు ఈ షో రన్ అయింది. కలర్స్ టీవీ ప్రసారం చేసిన ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా సుమారు రూ.2 కోట్లు ఖర్చు కావడం విశేషం. బాహుబలి లాంటి సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో అంతర్జాతీయ నిపుణులతో ఈ సిరీస్‌కు విజువల్ ఎఫెక్ట్స్ చేయించారు.

299 ఎపిసోడ్ల పాటు ఈ సిరీస్ ప్రసాదరమైంది. ఈ షోకు ప్రేక్షకుల నుంచి రివార్డులే కాదు.. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తివారి ఏషియా టెలివిజన్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్‌గా పురస్కారం కూడా అందుకున్నాడు. మన ప్రేక్షకులకు ఈ సిరీస్ గురించి పెద్దగా తెలియదు కానీ.. హిందీలో మాత్రం ఇది బాగానే పాపులర్.

This post was last modified on November 19, 2024 5:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

27 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago