ఒకప్పుడు ‘జబర్దస్త్’ కామెడీ షోలో భాగమైన వాళ్లందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ నామమాత్రంగా నడుస్తోంది. ఆ షోలోని వాళ్లంతా ఎవరికి వాళ్లు అయిపోయారు. ఒకరి మీద ఒకరు ఘాటు విమర్శలు కూడా గుప్పించుకునే పరిస్థితి వచ్చింది. చాన్నాళ్ల పాటు జడ్జీలుగా వ్యవహరించిన రోజా, నాగబాబు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అలాగే జనసేనకు మద్దతిచ్చే జబర్దస్త్ కమెడియన్ల పట్ల రోజా గతంలో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీవాయి. ఆ తర్వాత కమెడియన్ కిరాక్ ఆర్పీ.. రోజా మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో తెలిసిందే.
ఐతే జనసేన మద్దతుదారు అయిన మరో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సైతం రోజా మీద విమర్శలు గుప్పించినట్లు యూట్యూబ్లో చాలా థంబ్ నైల్స్ కనిపిస్తుంటాయి. కానీ తాను ఎప్పుడూ రోజాను ఏమీ అనలేదని హైపర్ ఆది స్పష్టం చేశాడు.
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన ‘కేశవ చంద్ర రమావత్’ అనే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు ఆదితో పాటు రోజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైపర్ ఆది తన ప్రసంగంలో రోజా ప్రస్తావన తెచ్చాడు. రోజా ఈ వేడుకకు వచ్చి రాకేష్కు సపోర్ట్ చేయడం గొప్ప విషయం అని కొనియాడని ఆది.. “రోజాను హైపర్ ఆది ఏమని తిట్టాడో తెలుసా” అంటూ థంబ్ నైల్స్ పెట్టి యూట్యూబ్ వాళ్లు వైరల్ చేస్తుంటారని.. వ్యూస్ కోసం వాళ్లు అలా చేస్తుంటారే తప్ప తాను ఇప్పటిదాకా ఎన్నడూ రోజాను ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశాడు ఆది.
మరోవైపు ‘జబర్దస్త్’ను విమర్శించే వారిని ఆది తప్పుబట్టాడు. ఇందులో అడల్ట్ కామెడీ గురించి చాలామంది ఏడుస్తుంటారని.. మరి అలాంటపుడు ఎవరు చూస్తే ‘యానిమల్’ లాంటి అడల్ట్ రేటెడ్ సినిమాకు 800 కోట్ల వసూళ్లు వచ్చాయని ఆది ప్రశ్నించాడు.
This post was last modified on November 19, 2024 2:23 pm
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…