జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్రమంగా ఇక్కడి మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఫ్యాన్స్ ప్రేమగా శివన్న అని పిలుచుకునే ఈయన రామ్ చరణ్ 16లో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ 69లోనూ ఆఫర్ వచ్చిందన్నారు కానీ అంత ప్రాధాన్యం లేకపోవడంతో దర్శకుడే వద్దన్నారని బెంగళూరు టాక్. ఇదిలా ఉండగా కంగువతో పోటీ ఎందుకని మిగిలిన నిర్మాతలు సైడ్ అయిపోతే ఈయన మాత్రం భైరతి రణగల్ తో మొన్న నవంబర్ 15 వచ్చేశాడు. థియేటర్ల కొరత కారణంగా కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజయ్యింది.
చూస్తే శివన్న నమ్మకమే నిజమయ్యింది. భైరతి రణగల్ హిట్ టాక్ తో సింగల్ లాంగ్వేజ్ లోనే మంచి వసూళ్లు రాబడుతోంది. దీనికి దర్శకుడు నర్తన్. ఇదే శివరాజ్ కుమార్ తో మఫ్టీ అనే బ్లాక్ బస్టర్ తీశాడు. ఆ సినిమాలో గెటప్ చూసే వీరసింహారెడ్డికి కాస్ట్యూమ్ డిజైన్ చేయించామని బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మఫ్టీకు ముందు ఏం జరిగిందనే పాయింట్ తో ఇప్పుడీ ప్రీక్వెల్ తీస్తే ఇది కూడా విజయం సాధించే దిశగా వెళ్తోంది. అలాని ఇదేమి కొత్త కథ కాదు. రెగ్యులర్ కమర్షియల్ డ్రామా. కాకపోతే ప్రెజెంట్ చేసిన విధానం, ఎలివేషన్లు, స్టోరీ ట్రీట్ మెంట్ మాస్ వర్గాలకు నచ్చేలా బాగా కుదిరాయి.
నీటి కొరతతో అల్లాడిపోయే రోణాపుర అనే ఊరిలో బాలనేరస్థుడిగా ఇరవై ఏళ్ళు జైల్లో ఉండి లాయర్ చదువుతాడు రణగల్. అయితే కార్పొరేట్ సంస్థల ధన దాహం తన నల్ల కోటుని న్యాయం చేయనివ్వకపోవడమే కాక అమాయకుల ప్రాణాలు తీస్తోందని గుర్తించి నల్ల దుస్తులు ధరించి కత్తి పడతాడు. తప్పు చేసిన వాళ్ళను తెగ నరకడం మొదలుపెడతాడు. ఆపై జరిగేది స్క్రీన్ మీద చూడాలి. మరో విశేషం ఏంటంటే ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ కాగా రవి బస్రూర్ బీజీఎమ్ చెవులు హోరెత్తిపోయేలా కాకుండా డీసెంట్ గా సాగింది. త్వరలో తెలుగులో అనువదించి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
This post was last modified on November 18, 2024 8:47 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…