అన్లాక్లో భాగంగా వివిధ రంగాలకు ఊరటనిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. థియేటర్లకు ఉపశమనాన్నిచ్చే విషయంలో మాత్రం చాలా ఆలస్యం చేసింది. ఏడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు తెరుచుకోబోతున్నాయి థియేటర్లు. ఇది థియేటర్లు నడిపించే వాళ్లకు.. థియేటర్ల కోసం సినిమాలు ఇచ్చేవాళ్లకు.. థియేటర్లలో సినిమాలు చూసేవాళ్లకు అమితానందాన్నిచ్చిన విషయమే. మొత్తానికి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి కానీ.. వాట్ నెక్స్ట్ అని చూస్తే మాత్రం శూన్యమే కనిపిస్తోంది.
థియేటర్లు తెరుచుకుంటాయి సరే.. అవి అనుకున్న స్థాయిలో నడుస్తాయా అన్నది యాజమాన్యాల భయం. తమ సినిమాలను రిలీజ్ చేస్తే ఆశించిన రెవెన్యూ రాదేమో అన్నది నిర్మాతల భయం. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అవసరమా.. ధైర్యం చేసి వెళ్దామన్నా సరైన సినిమా థియేటర్లలో ఉంటుందా అన్నది ప్రేక్షకుల ఆందోళన.
కరోనా గురించి ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లాలంటే ప్రేక్షకులను ఆకర్షించే సినిమా ఆడుతుండాలి. కానీ రాబోయే కొన్ని నెలల్లో అలాంటి సినిమాలేవైనా వస్తాయా అన్నది సందేహంగా ఉంది. అసలు అక్టోబరు 15న థియేటర్లు ఓపెన్ చేసే ఎగ్జిబిటర్లు వాటిలో ఏ సినిమాలు వేస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. చిన్న సినిమాలైనా సరే.. కొత్తవి ఏవైనా విడుదల అవుతాయా అన్నది అనుమానమే. థియేటర్లు తెరుచుకోబోతున్న నేపథ్యంలో తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ కాస్త పేరున్న ఏ సినిమా నిర్మాత కూడా ముందుకు రాలేదు.
ఈ పరిస్థితుల్లో పాత సినిమాలు వేస్తే ప్రేక్షకులు అసలే థియేటర్లకు రారు. ప్రస్తుతం ఓటీటీల్లో నడుస్తున్న కొత్త సినిమాలను ప్రదర్శించినా ప్రేక్షకులు రావడం సందేహమే. ఆ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉందనుకున్నా సరే.. ఎక్స్క్లూజివ్ ఓటీటీ రిలీజ్ కోసం పెద్ద మొత్తం సమర్పించున్న ఫ్లాట్ ఫామ్స్ థియేట్రికల్ రిలీజ్కు అంగీకరించకపోవచ్చు. ఒప్పందాలు ఎలా జరిగాయో తెలియదు మరి. ఈ నేపథ్యంలో థియేటర్లు నామమాత్రంగా తెరుచుకోవడం తప్పితే సినిమాలు నడవడం అన్నది ఆచరణ సాధ్యంగా అనిపించడం లేదు. పరిస్థితి చూస్తుంటే క్రిస్మస్కో, సంక్రాంతికో పేరున్న సినిమాలు రిలీజైతే తప్ప.. అప్పటిదాకా థియేటర్లు నడవడం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది.
This post was last modified on October 5, 2020 10:20 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…