అన్లాక్లో భాగంగా వివిధ రంగాలకు ఊరటనిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. థియేటర్లకు ఉపశమనాన్నిచ్చే విషయంలో మాత్రం చాలా ఆలస్యం చేసింది. ఏడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు తెరుచుకోబోతున్నాయి థియేటర్లు. ఇది థియేటర్లు నడిపించే వాళ్లకు.. థియేటర్ల కోసం సినిమాలు ఇచ్చేవాళ్లకు.. థియేటర్లలో సినిమాలు చూసేవాళ్లకు అమితానందాన్నిచ్చిన విషయమే. మొత్తానికి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి కానీ.. వాట్ నెక్స్ట్ అని చూస్తే మాత్రం శూన్యమే కనిపిస్తోంది.
థియేటర్లు తెరుచుకుంటాయి సరే.. అవి అనుకున్న స్థాయిలో నడుస్తాయా అన్నది యాజమాన్యాల భయం. తమ సినిమాలను రిలీజ్ చేస్తే ఆశించిన రెవెన్యూ రాదేమో అన్నది నిర్మాతల భయం. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అవసరమా.. ధైర్యం చేసి వెళ్దామన్నా సరైన సినిమా థియేటర్లలో ఉంటుందా అన్నది ప్రేక్షకుల ఆందోళన.
కరోనా గురించి ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లాలంటే ప్రేక్షకులను ఆకర్షించే సినిమా ఆడుతుండాలి. కానీ రాబోయే కొన్ని నెలల్లో అలాంటి సినిమాలేవైనా వస్తాయా అన్నది సందేహంగా ఉంది. అసలు అక్టోబరు 15న థియేటర్లు ఓపెన్ చేసే ఎగ్జిబిటర్లు వాటిలో ఏ సినిమాలు వేస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. చిన్న సినిమాలైనా సరే.. కొత్తవి ఏవైనా విడుదల అవుతాయా అన్నది అనుమానమే. థియేటర్లు తెరుచుకోబోతున్న నేపథ్యంలో తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ కాస్త పేరున్న ఏ సినిమా నిర్మాత కూడా ముందుకు రాలేదు.
ఈ పరిస్థితుల్లో పాత సినిమాలు వేస్తే ప్రేక్షకులు అసలే థియేటర్లకు రారు. ప్రస్తుతం ఓటీటీల్లో నడుస్తున్న కొత్త సినిమాలను ప్రదర్శించినా ప్రేక్షకులు రావడం సందేహమే. ఆ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉందనుకున్నా సరే.. ఎక్స్క్లూజివ్ ఓటీటీ రిలీజ్ కోసం పెద్ద మొత్తం సమర్పించున్న ఫ్లాట్ ఫామ్స్ థియేట్రికల్ రిలీజ్కు అంగీకరించకపోవచ్చు. ఒప్పందాలు ఎలా జరిగాయో తెలియదు మరి. ఈ నేపథ్యంలో థియేటర్లు నామమాత్రంగా తెరుచుకోవడం తప్పితే సినిమాలు నడవడం అన్నది ఆచరణ సాధ్యంగా అనిపించడం లేదు. పరిస్థితి చూస్తుంటే క్రిస్మస్కో, సంక్రాంతికో పేరున్న సినిమాలు రిలీజైతే తప్ప.. అప్పటిదాకా థియేటర్లు నడవడం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది.
This post was last modified on October 5, 2020 10:20 am
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా…
పెద్ద బడ్జెట్లు ముడిపడిన సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ముందు వెనుక పోటీ…
AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…
భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ…