ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో పలకరించిన ఈ అందాల సుందరి.. సెప్టెంబరులో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ లాంటి మరో పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళికి ‘లక్కీ భాస్కర్’తో ఆకట్టుకున్న ఆమె.. లేటెస్ట్ రిలీజ్ ‘మట్కా’లోనూ నటించింది. వచ్చే శుక్రవారం రాబోతున్న ‘మెకానిక్ రాకీ’లోనూ ఆమె ఒక హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇలా వరుస రిలీజ్లతో సోషల్ మీడియాలో మీనాక్షి పేరు మార్మోగిపోతోంది.
తాజాగా ఆమె వరంగల్లో జరిగిన ‘మెకానిక్ రాకీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తళుక్కుమంది. ఈ సందర్భంగా తాను పని చేసిన హీరోల గురించి ఒక్కో మాటలో ఆమె అందంగా తన అభిప్రాయం చెప్పింది.
ముందుగా ‘గుంటూరు కారం’లో తాను స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు గురించి ఒక్క మాటలో వర్ణించమంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పింది మీనాక్షి. ఇక ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’లో తాను కలిసి నటించిన విజయ్ గురించి చెబుతూ.. ‘నిలకడ’కు కేరాఫ్ అడ్రస్ అని పేర్కొంది. ‘లక్కీ భాస్కర్’ హీరో దుల్కర్ సల్మాన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడని చెప్పింది. ‘మట్కా’ హీరో వరుణ్ తేజ్ అసలు సిసలైన జెంటిల్మ్యాన్ అని మీనాక్షి అభివర్ణించింది.
చివరగా ‘మెకానిక్ రాకీ’ కథానాయకుడు విశ్వక్సేన్ గురించి మాట్లాడుతూ.. కొంచెం లెంగ్తీగానే పొగిడింది మీనాక్షి. అతను ఫన్, చిల్ పర్సన్ అని.. మంచి ఎనర్జీతో ఉంటాడని.. తనలో యూత్ఫుల్నెస్ ఉంటుందని కొనియాడింది మీనాక్షి. ఈ ఏడాది మీనాక్షి నటించిన చిత్రాల్లో ‘లక్కీ భాస్కర్’ మాత్రమే సంతృప్తికర ఫలితాన్ని అందుకోగా.. మిగతావి నిరాశపరిచాయి. మరి ‘మెకానిక్ రాకీ’ ఏమవుతుందో చూడాలి.
This post was last modified on November 18, 2024 12:56 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…