ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో పలకరించిన ఈ అందాల సుందరి.. సెప్టెంబరులో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ లాంటి మరో పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళికి ‘లక్కీ భాస్కర్’తో ఆకట్టుకున్న ఆమె.. లేటెస్ట్ రిలీజ్ ‘మట్కా’లోనూ నటించింది. వచ్చే శుక్రవారం రాబోతున్న ‘మెకానిక్ రాకీ’లోనూ ఆమె ఒక హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇలా వరుస రిలీజ్లతో సోషల్ మీడియాలో మీనాక్షి పేరు మార్మోగిపోతోంది.
తాజాగా ఆమె వరంగల్లో జరిగిన ‘మెకానిక్ రాకీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తళుక్కుమంది. ఈ సందర్భంగా తాను పని చేసిన హీరోల గురించి ఒక్కో మాటలో ఆమె అందంగా తన అభిప్రాయం చెప్పింది.
ముందుగా ‘గుంటూరు కారం’లో తాను స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు గురించి ఒక్క మాటలో వర్ణించమంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పింది మీనాక్షి. ఇక ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’లో తాను కలిసి నటించిన విజయ్ గురించి చెబుతూ.. ‘నిలకడ’కు కేరాఫ్ అడ్రస్ అని పేర్కొంది. ‘లక్కీ భాస్కర్’ హీరో దుల్కర్ సల్మాన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడని చెప్పింది. ‘మట్కా’ హీరో వరుణ్ తేజ్ అసలు సిసలైన జెంటిల్మ్యాన్ అని మీనాక్షి అభివర్ణించింది.
చివరగా ‘మెకానిక్ రాకీ’ కథానాయకుడు విశ్వక్సేన్ గురించి మాట్లాడుతూ.. కొంచెం లెంగ్తీగానే పొగిడింది మీనాక్షి. అతను ఫన్, చిల్ పర్సన్ అని.. మంచి ఎనర్జీతో ఉంటాడని.. తనలో యూత్ఫుల్నెస్ ఉంటుందని కొనియాడింది మీనాక్షి. ఈ ఏడాది మీనాక్షి నటించిన చిత్రాల్లో ‘లక్కీ భాస్కర్’ మాత్రమే సంతృప్తికర ఫలితాన్ని అందుకోగా.. మిగతావి నిరాశపరిచాయి. మరి ‘మెకానిక్ రాకీ’ ఏమవుతుందో చూడాలి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…