ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప 2 ది రూల్ ట్రైలర్ లాంచ్ సందడి పాట్నాలో ఓ రేంజ్ లో జరుగుతోంది. పుష్ప బ్రాండ్ ఎంత బలంగా జాతీయ స్థాయిలో నాటుకుపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మామూలుగా సినిమాల మీద తక్కువ దృష్టితో ఉండే బీహార్ లో ఈ స్థాయి జనసందోహం ఎప్పుడూ చూడనిది. అందుకే అందరి కళ్ళు పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉండబోతున్నాడనే దాని మీదే ఉంది. దానికి తగ్గట్టు రెండున్నర నిమిషాల ప్యూర్ ఫైర్ నిండిన కంటెంట్ తో అల్లు అర్జున్ వచ్చేశాడు. శాంపిల్ అరాచకం ఏంటో చూపించాడు.
కథను చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ పుష్ప 2 ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉండబోతోందో దర్శకుడు సుకుమార్ ఇందులో ఆవిష్కరించారు. డబ్బంటే లెక్కలేదనే పుష్ప వ్యక్తిత్వాన్ని జగపతిబాబు ద్వారా పరిచయం చేసి మొత్తం యాక్షన్ ఎపిసోడ్లతో నింపేశాడు. హెలికాఫ్టర్లు, పోర్ట్ హార్బర్, అడవులు, వందల కొద్దీ లారీలు, వేలాదిగా పేర్చబడిన ఎర్రచందనం దుంగలు, స్క్రీన్ మొత్తం నిండిపోయిన ఆర్టిస్టులు ఒకటా రెండా ఫుల్ కమర్షియల్ మసాలాతో నింపేశారు. పుష్ప 1 చూశాక ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో వాటికి పదింతలు ఊహించుకోమనేలా క్లూస్ ఇచ్చారు సుకుమార్. ఇక హైప్ ఎక్కడికి వెళ్తుందో చెప్పడం కష్టం.
హెయిర్ స్టైల్ ఎడమ వైపున కాస్త తెల్ల రంగు తగిలించి కొత్తగా కనిపిస్తున్న అల్లు అర్జున్ చివర్లో అన్న డైలాగ్ ప్రకారం వైల్డ్ ఫైర్ అన్నట్టే ఉన్నాడు. ఫహద్ ఫాసిల్ కి ఈసారి ఎక్కువ స్కోప్ తో పాటు బన్నీతో నువ్వా నేనా అని తలపడేలా భారీ పోరాటాలు పెట్టేశాడు సుకుమార్. శ్రీలీల ఐటెం సాంగ్, సునీల్ అనసూయ తదితరాల షాట్లను వేగంగా చూపించారు. శ్రీవల్లి రష్మిక మందన్నతో పుష్ప రాజ్ రొమాన్స్ కన్నా ఎక్కువ ఎమోషన్ ని చూపించబోతున్నారులా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తనదైన సిగ్నేచర్ స్టైల్ లో సాగింది. డిసెంబర్ 5 దాకా ఆగడం కష్టమనేలా ఉన్న పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ రూల్ చేయడం ఖాయమే.
This post was last modified on November 17, 2024 7:45 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…