మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ ట్రెండ్ కి మినహాయింపుగా నిలుస్తోంది. మొన్న విడుదలైన కంగువ బుక్ మై షోలో సగటున 5 వేల లోపే టికెట్లు అమ్ముతుంటే మూడో వారంలో ఉన్న అమరన్ ఏకంగా 8 వేల టికెట్లతో ముందంజలో ఉండటం ట్రేడ్ ని నివ్వెరపరుస్తోంది. తమిళనాడు కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కంగువ కన్నా ముందు అమరన్ షోలు ఫుల్ కావడం ఊహించని పరిణామం. కంగువ మూడో రోజు కలెక్షన్ ఎంత వచ్చినా అమరన్ సైతం అయిదారు లక్షల తేడాతో అంతే మొత్తం సాధించే దిశగా వెళ్తోంది.
ఇది సూర్య అభిమానులు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ కంగువకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే సీన్ వేరుగా ఉండేది. అమరన్, లక్కీ భాస్కర్ లకు ఇచ్చిన షోలలో కోత వేసి కంగువకు ఇచ్చే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడా సూచనలు దరిదాపుల్లో లేవు. పైగా రివర్స్ జరిగే ప్రమాదం ఉండటం కలవరపరిచే విషయం. తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీలు తీవ్రంగా పడిపోయాయి. సూర్యని బాగా ఇష్టపడే టాలీవుడ్ ప్రేక్షకులను సైతం కంగువ కనీస స్థాయిలో మెప్పించలేకపోయిందని వసూళ్లు చెబుతున్నాయి. కుటుంబాలకు వీకెండ్ ఛాయస్ మళ్ళీ అమరన్ కాగా తర్వాత లక్కీ భాస్కర్ నిలుస్తున్నాడు.
ఈ ట్రెండ్ రేపు ఆదివారం కొనసాగనుంది. రెండు వేల కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదని కంగువ నిర్మాత చెప్పిన మాటలకు భిన్నంగా అందులో కనీసం పావు వంతు అయిదు వందల కోట్లు కలెక్ట్ చేయడం అసాధ్యమనేలా సీన్ మారిపోయింది. అలాని తమిళనాడులో భీభత్సమైన బుకింగ్స్ లేవు. కాకపోతే ఉన్నంత సూర్య ఇమేజ్ కవచంలా నిలబడి డీసెంట్ గా లాగుతోంది. కానీ సోమవారం నుంచి నమోదయ్యే డ్రాప్ ని ఊహించుకుని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. టాక్ తో సంబంధం లేకుండా విజయ్ గోట్ లా పెర్ఫార్మ్ చేసి ఉంటే టెన్షన్ లేదు కానీ అలా జరిగకపోవడమే ట్రాజెడీ .
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…
ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…
సుప్రీంకోర్టు హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…