ఒకప్పుడు అదిరిపోయే పాటలు, నేపథ్య సంగీతంతో భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అతడి చేతికి సంగీతం బాధ్యతలు అప్పగిస్తే దర్శకులు, నిర్మాతలు గుండెల మీద చేయి వేసుకుని ఉండొచ్చని, ప్రశాంతంగా మిగతా పనులు చూసుకోవచ్చని పేరుండేది. కానీ గత కొన్నేళ్లలో దేవి సంగీతంలో క్వాలిటీ తగ్గిన మాట వాస్తవం. అందుకు ఉదాహరణగా చాలా సినిమాలు కనిపిస్తాయి.
ఐతే మధ్య మధ్యలో ‘పుష్ప’ లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడతను. కానీ ‘పుష్ప-2’ చిత్రానికి తన బదులు వేరే వాళ్లలో సుకుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేయిస్తున్నాడనే సమాచారం బయటికి రావడం కలకలం రేపింది. ఇది దేవి పతనానికి సూచికగా పేర్కొన్నారు చాలామంది. ఇలాంటి టైంలో దేవి సంగీతం అందించిన భారీ చిత్రం ‘కంగువ’ రిలీజైంది. ప్రోమోలు, పాటల్లో మ్యూజిక్ బాగుండడంతో రిలీజ్ తర్వాత దేవి పేరు మార్మోగుతుందని అభిమానులు ఆశించారు.
కానీ ‘కంగువ’ బ్యాడ్ టాక్తో మొదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో దర్శకుడు శివ తర్వాత ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నది దేవినే కావడం గమనార్హం. సినిమా అంతా అరుపులు కేకలతో నిండిపోయిందని.. ఆర్టిస్టుల అరుపులు చాలవని దేవి తన లౌడ్ బ్యాగ్రౌండ్ స్కోర్తో చెవుల తుప్పు వదలగొట్టేశాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. శబ్దాల హోరు పెంచేసి సౌండ్ బాక్సులు దద్దరిల్లేలా చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందని.. దేవి కూడా అదే చేశాడని అతణ్ని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
ఐతే ఇలా విమర్శలు ఎదుర్కొన్న ఒక్క రోజులోనే దేవికి ప్రశంసలూ దక్కుతుండడం విశేషం. అతను సంగీతం అందించిన ‘కుబేర’ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. టీజర్తో కమ్ముల పెద్ద షాకే ఇచ్చాడు. తన శైలికి భిన్నంగా ఇంటెన్స్ థ్రిల్లర్ తీసినట్లున్నాడతను. ఈ టీజర్లో విజువల్స్ను మించి బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయింది. అందరూ స్కోర్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఓవైపు దేవి ఒకే సమయంలో ‘కంగువ’ విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే మరోవైపు ‘కుబేర’ విషయంలో ప్రశంసలు అందుకుంటుండడం చిత్రమే.
This post was last modified on November 16, 2024 9:43 pm
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…