తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న ఆయన.. ఇప్పటికీ ట్రెండీ డైరెక్టర్గా, ఇప్పటి యూత్కూ ఫేవరెట్గా ఉన్నారు. రాశి కంటే వాసి గొప్పదని చాటుతాయి ఆయన సినిమాలు. తాను తీసిన ఫ్లాప్ సినిమాలతో కూడా ప్రశంసలు అందుకున్న దర్శకుడాయన. ఐతే అంతా బాగుంది కానీ.. సుకుమార్ ఒక పట్టాన సినిమాను పూర్తి చేయడని.. రైటింగ్, షూటింగ్ విషయంలో బాగా ఆలస్యం చేస్తాడని.. ఏదీ ఒక పట్టాన ఓకే చేసి క్లియర్ చేయడనే విమర్శలు ఉన్నాయి.
ఆయన ప్రతి సినిమాకూ షెడ్యూళ్లు ఆలస్యం అవుతుంటాయి. అనుకున్న ప్రకారం సినిమాలు పూర్తి కావు. మొదట అనుకున్న రిలీజ్ డేట్కు సినిమా థియేటర్లలోకి రాదు. ‘పుష్ప-2’ విషయంలోనూ ఇదే జరిగింది. ఆగస్టు 15కే రావాల్సిన ఈ చిత్రం డిసెంబరు 5కు వాయిదా పడింది. ఒక దశలో ఆ డేట్ను అందుకోవడం కూడా కష్టమే అన్న సందేహాలు కలిగాయి.
సుకుమార్ ఎప్పట్లాగే షూట్ ఆలస్యం చేయడం.. షెడ్యూళ్లకు మధ్య మధ్యలో బ్రేకులు పడడం.. సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు రావడంతో ‘పుష్ప-2’ షూటింగ్ మీద అనేక సందేహాలు ఏర్పడ్డాయి. డిసెంబరు 5న కూడా సినిమా రావడం చాలా కష్టమే అనే సందేహాలు కలిగాయి. కానీ గత నెల రోజుల్లో మాత్రం ‘పుష్ప-2’ షూటింగ్ ఎక్స్ప్రెస్ వేగాన్ని అందుకుంది.
సుకుమార్ మునుపెన్నడూ లేని వేగంతో నెల రోజులుగా షూటింగ్ చేస్తున్నాడు. రెండు మూడు యూనిట్లతో షూటింగ్స్ చేయిస్తూ ఒక చోట్ల తనే ఛార్జ్ తీసుకోవడం, ఇంకో చోట తన పర్యవేక్షణలో అసిస్టెంట్లతో సన్నివేశాలు తీయడం.. మరోవైపు ఎడిటింగ్ వ్యవహారాలూ చూసుకోవడం.. ఇలా ఆయన రేయింబవళ్లు సినిమా కోసం కష్టపడుతున్నారు. నిజానికి సుకుమార్ స్పీడు ప్రకారం చూస్తే నెలాఖరు వరకు షూటింగ్ కొనసాగుతుందని, ‘పుష్ప-1’ తరహాలోనే చివరి నిమిషంలో హడావుడి తప్పదని అనుకున్నారు. కానీ గత కొన్ని రోజుల్లో సూపర్ స్పీడులో షూట్ చేయడం వల్ల ఇంకో మూణ్నాలుగు రోజుల్లో షూట్ పూర్తి కాబోతోందని సమాచారం. అంతే కాక విడుదలకు పది రోజుల ముందే సెన్సార్ కూడా పూర్తి చేయబోతున్నారట. సెన్సార్ స్లాట్ కూడా బుక్ అయిపోయిందని తెలిసింది. ఈ ఆదివారం ‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ కానున్న సంగతి తెలిసిందే.
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…
నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…
ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…