అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా పాటించాడు తేజ సజ్జ. ఇటీవలే అబూ దాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో రానా దగ్గుబాటితో పాటు యాంకర్ గా వ్యవహరించిన తేజ కొన్ని ఫ్లాప్ సినిమాల మీద వేసిన సెటైర్లు ఆయా హీరోల అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వ్యవహారం పట్ల గుర్రుగా ఉన్నారు. నిన్న రానాని అడిగితే ఇకపై ఇది జోకని సబ్ టైటిల్స్ వేయాల్సిన పరిస్థితి వస్తోందని, హాస్యాన్ని అర్థం చేసుకోలేకపోయారని వ్యంగ్యంగా పంచులు వేశాడు.
సరే రానా అంటే సీనియర్ మోస్ట్ కాబట్టి ఎలా అన్నా ఇబ్బందేం లేదు కానీ తేజ సజ్జ మాత్రం ఈ విషయంలో మెచ్యూర్ గా ఆలోచించాడు. ఒక ఈవెంట్ లో దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు బదులు చెబుతూ చిన్నప్పటి నుంచి ఎవరితో అయితే నటిస్తూ పెరిగానో వాళ్ళ మీద ఎలా కామెడీ చేస్తానని వివరణ ఇచ్చాడు. ఐఫా లాంటి ఇంటర్నేషనల్ వేడుకలో స్క్రిప్ట్ పలు దశలను దాటుకుని సిద్ధమవుతుందని, దాన్నే స్టేజి మీద చేస్తాం తప్పించి ఎలాంటి దురుద్దేశం లేదని అన్నాడు. నిజానికి రానా తన మీద వేసిన జోకులను పూర్తి వీడియో చూడకుండా వేరొకరికి ఆపాదించారని చెప్పుకొచ్చాడు.
ఇది ఫ్యాన్స్ ని ఎంతమేర సంతృప్తి పరుస్తుందనేది పక్కనపెడితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకుండా ఇలా స్పష్టంగా సమాధానం చెప్పడం మంచిదే. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ పడ్డాక తేజ తొందరపడి సినిమాలు చేయడం లేదు. ఆలస్యమైనా సరే క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే మిరాయ్ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెడుతున్నాడు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18 విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.
This post was last modified on November 16, 2024 5:29 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…