అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా పాటించాడు తేజ సజ్జ. ఇటీవలే అబూ దాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో రానా దగ్గుబాటితో పాటు యాంకర్ గా వ్యవహరించిన తేజ కొన్ని ఫ్లాప్ సినిమాల మీద వేసిన సెటైర్లు ఆయా హీరోల అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వ్యవహారం పట్ల గుర్రుగా ఉన్నారు. నిన్న రానాని అడిగితే ఇకపై ఇది జోకని సబ్ టైటిల్స్ వేయాల్సిన పరిస్థితి వస్తోందని, హాస్యాన్ని అర్థం చేసుకోలేకపోయారని వ్యంగ్యంగా పంచులు వేశాడు.
సరే రానా అంటే సీనియర్ మోస్ట్ కాబట్టి ఎలా అన్నా ఇబ్బందేం లేదు కానీ తేజ సజ్జ మాత్రం ఈ విషయంలో మెచ్యూర్ గా ఆలోచించాడు. ఒక ఈవెంట్ లో దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు బదులు చెబుతూ చిన్నప్పటి నుంచి ఎవరితో అయితే నటిస్తూ పెరిగానో వాళ్ళ మీద ఎలా కామెడీ చేస్తానని వివరణ ఇచ్చాడు. ఐఫా లాంటి ఇంటర్నేషనల్ వేడుకలో స్క్రిప్ట్ పలు దశలను దాటుకుని సిద్ధమవుతుందని, దాన్నే స్టేజి మీద చేస్తాం తప్పించి ఎలాంటి దురుద్దేశం లేదని అన్నాడు. నిజానికి రానా తన మీద వేసిన జోకులను పూర్తి వీడియో చూడకుండా వేరొకరికి ఆపాదించారని చెప్పుకొచ్చాడు.
ఇది ఫ్యాన్స్ ని ఎంతమేర సంతృప్తి పరుస్తుందనేది పక్కనపెడితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకుండా ఇలా స్పష్టంగా సమాధానం చెప్పడం మంచిదే. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ పడ్డాక తేజ తొందరపడి సినిమాలు చేయడం లేదు. ఆలస్యమైనా సరే క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే మిరాయ్ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెడుతున్నాడు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18 విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.
This post was last modified on November 16, 2024 5:29 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…