లీడర్ తో దగ్గుబాటి రానా హీరోగా పరిచయమైనప్పుడు వెంకటేష్ తర్వాత ఆ కుటుంబం నుంచి మరో ప్రామిసింగ్ స్టార్ వచ్చాడని ఫ్యాన్స్ భావించారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. నేనే రాజు నేనా మంత్రి లాంటి ఒకటి రెండు హిట్లు ఉన్నప్పటికీ పెద్ద రేంజ్ బ్లాక్ బస్టర్ సాధించలేకపోయాడు. బాహుబలిలో విలన్ పాత్ర చేశాక కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరే నెగటివ్ షేడ్స్ ని బ్రహ్మాండంగా మెప్పించాడు. రానా నాయుడు వెబ్ సిరీస్ లోనూ రిస్క్ తీసుకుని ఉత్తరాది ప్రేక్షకుల దృష్టిలో పాసయ్యాడు. కానీ ఇదంతా అభిమానులు పూర్తిగా ఆస్వాదించడం లేదు.
విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఉంటూ నెంబర్ వన్ యారీతో పాటు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కోసం మరో ఇంటర్వ్యూ షో చేస్తూ హీరోగా కెరీర్ ని పక్కనపెట్టడాన్ని వాళ్ళు తప్పుబడుతున్నారు. నిజానికి రానా చేస్తోంది రైటేనని చెప్పడానికి కొన్ని పాయింట్లున్నాయి. రానా నటన పరంగా వంకలు లేకపోయినా, ఆరడుగుల ఎత్తు ఉన్నా తను కంప్లీట్ కమర్షియల్ హీరో మెటీరియల్ కాదు. ఛాలెంజ్ అనిపించే పాత్రలు, రిస్క్ ఇచ్చే సబ్జెక్టులే సూటవుతాయి. దీన్ని ముందు గుర్తించింది రాజమౌళే. దానికి అనుగుణంగానే రానా తన ప్లానింగ్ ని మార్చుకుని హీరోయిజం ఉచ్చులో పడకుండా నటుడిని మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు.
ఇంకో వైపు నిర్మాతగా చిన్న సినిమాలకు అండగా నిలబడేందుకు ఎన్ని చేయాలో అంతా చేస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలెం నుంచి 35 చిన్న కథ కాదు దాకా ఎన్నో అవార్డు విన్నింగ్ సినిమాలకు దన్నుగా నిలబడి వాటి థియేట్రికల్ రిలీజ్ కు మద్దతు ఇచ్చాడు. ఫలితంగా అవి మెజారిటీ ఆడియన్స్ ని చేరుకున్నాయి. సందీప్ కిషన్ మొన్నో ఈవెంట్ లో మాట్లాడుతూ రానా చిన్న నిర్మాతలకు ఒక సపోర్టింగ్ సిస్టంగా మారడాన్ని వివరించాడు. సో రానా వెళ్తున్న రూటు తప్పనడానికి లేదు. ఆర్టిస్టుగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, యాంకర్ ఇలా అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుంటున్న టైంలో హీరోగా కొనసాగకపోతే మునిగేది ఏముంది.
This post was last modified on November 14, 2024 11:37 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…