అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్ మైనస్సులు నిశితంగా పరిశీలించి రాబోయే దర్శకులకు పాఠాలుగా చెబుతుంటారు. థియేటర్లో చూసేందుకు సాధ్యపడని వాటిని ఓటిటిలో వచ్చాక వీక్షించి చక్కని రివ్యూలు ఇస్తారు.
గతంలో గుంటూరు కారం గురించి విశ్లేషణ చేసినప్పుడు ఇది కదా అనుభవంతో నేర్పించే లెసన్సని అందరూ భావించారు. ఇప్పుడు దేవర వంతు వచ్చింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ జరుపుకున్న దేవరని చూశాక తనదైన శైలిలో కొన్ని చక్కని విషయాలు చెప్పారు గోపాలకృష్ణ.
ఆయన వివరించిన ముఖ్యమైన పాయింట్లు చూద్దాం. కథ చాలా చిన్నది అయినప్పటికీ కథనం ఆకర్షణీయంగా ఉండటం దేవర సక్సెస్ కు ఒక కారణమైతే, దమ్మున్న హీరోల్లో ఒకడైన చిన్న రామయ్య (జూనియర్ ఎన్టీఆర్) చేశాడు కాబట్టి ఇంత విజయం అందుకుంది.
అధిక భాగం సముద్రంలో నడిపించినప్పటికీ కొరటాల శివ స్క్రీన్ ప్లే మాస్టర్ అనిపించే స్థాయిలో ప్రెజెంట్ చేసిన తీరు భారీ హిట్టుని తెచ్చి పెట్టింది. ఒకవేళ వర, జాన్వీ కపూర్ మధ్య రొమాన్స్, కామెడీని మరింత జొప్పించి ఉంటే మాస్ అండతో ఇంకా ఎక్కువ అంటే వెయ్యి కోట్ల వసూళ్లు వచ్చేవి. సెకండాఫ్ లో అధిక శాతం చేసిన కంప్లయింట్ ఇదే.
తారక్ నటన సహజంగా ఉందని మెచ్చుకున్న గోపాలకృష్ణ సంగీతం మాత్రం అంత గొప్పగా లేదని చెప్పడం కొసమెరుపు. అంటే అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తాలూకు మేజిక్ ఆస్వాదించాలనంటే థియేటర్ లో డాల్బీ సౌండ్ అయితేనే కరెక్ట్. అలాంటిది ఇంట్లో చూసినప్పుడు కొంత అనుభూతి తగ్గే రిస్క్ లేకపోలేదు.
బహుశా గోపాలకృష్ణ గారికి ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వందల సినిమాలకు రచన చేసి అలనాటి స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ దాకా ఎన్నో బ్లాక్ బస్టర్స్ కు పని చేసిన గోపాలకృష్ణ ఇంత నిశితంగా రివ్యూ చేశాక ఇక చెప్పదేముంటుంది.
This post was last modified on November 14, 2024 11:18 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…