బాహుబలి స్థాయి సినిమాగా కోలీవుడ్లో ప్రచారం జరిగిన కంగువ సినిమాకు రిలీజ్ ముంగిట తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటు తమిళనాట, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్ల సమస్యతో సతమతం అయింది. థియేటర్లతో ఆదాయం పంపకాల విషయంలో అంగీకారం కుదరకపోవడం ఓ సమస్య కాగా.. మంచి రన్తో సాగుతున్న అమరన్ను చాలా థియేటర్లు కొనసాగించడానికి నిర్ణయించడం మరో సమస్య.
ఐతే తమిళనాట రిలీజ్ ముందు రోజు సమస్య పరిష్కారమై మెజారిటీ స్క్రీన్లు దక్కాయి కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందులు తప్పలేదు. మల్టీప్లెక్సులతో రెవెన్యూ షేరింగ్ దగ్గర మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు పీటముడి పడడంతో పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ స్క్రీన్లలో ఎంతకీ బుకింగ్స్ మొదలు కాలేదు.
రాత్రి పది గంటల ప్రాంతంలో కూడా చాలా తక్కువ స్క్రీన్లలో మాత్రమే షోలు పెట్టారు. ఇంత పెద్ద సినిమా రిలీజవుతుంటే.. హైదరాబాద్ లాంటి సిటీల్లో మేజర్ మల్టీప్లెక్సులు కంగువ షోలు పెట్టకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇక ఈ స్క్రీన్లలో కంగువ షోలు ఉండవని అంతా ఫిక్సయిపోయిన సమయంలో రాత్రి పదిన్నర ప్రాంతంలో సస్పెన్సుకు తెరపడింది. పీవీఆర్ సహా అన్ని ప్రధాన మల్టీప్లెక్సులూ కంగువ షోలు ఓపెన్ చేశాయి. మరి రెవెన్యూ షేరింగ్ విషయంలో ఏం ఒప్పందం జరిగిందో ఏమో కానీ.. రిలీజ్కు కొన్ని గంటల ముందు సమస్య పరిష్కారం అయింది.
కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారం కనీసం నాలుగు రోజుల ముందు బుకింగ్స్ మొదలు కావాల్సింది. కంగువకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పెద్ద ఎత్తున ఉదయం షోలు వేసుకోవడానికి అవకాముంది. టికెట్లు కూడా బాగా తెగేవి.
కానీ రిలీజ్కు కొన్ని గంటల ముందు వరకు బుకింగ్స్ లేకపోవడంతో తొలి రోజు ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడనుంది. తెలుగులో ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప కంగువ బ్రేక్ ఈవెన్ కాదు. కానీ లేట్ బుకింగ్స్ వల్ల తొలి రోజు కలెక్షన్లలో బాగానే గండి పడబోతోంది. సినిమాకు టాక్ బాగుంటే తర్వాత కలెక్షన్లు పుంజుకోవచ్చు కానీ.. ముందేతే పెద్ద గండి పడినట్లే.
This post was last modified on November 14, 2024 11:17 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…