బాహుబలి స్థాయి సినిమాగా కోలీవుడ్లో ప్రచారం జరిగిన కంగువ సినిమాకు రిలీజ్ ముంగిట తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటు తమిళనాట, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్ల సమస్యతో సతమతం అయింది. థియేటర్లతో ఆదాయం పంపకాల విషయంలో అంగీకారం కుదరకపోవడం ఓ సమస్య కాగా.. మంచి రన్తో సాగుతున్న అమరన్ను చాలా థియేటర్లు కొనసాగించడానికి నిర్ణయించడం మరో సమస్య.
ఐతే తమిళనాట రిలీజ్ ముందు రోజు సమస్య పరిష్కారమై మెజారిటీ స్క్రీన్లు దక్కాయి కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందులు తప్పలేదు. మల్టీప్లెక్సులతో రెవెన్యూ షేరింగ్ దగ్గర మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు పీటముడి పడడంతో పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ స్క్రీన్లలో ఎంతకీ బుకింగ్స్ మొదలు కాలేదు.
రాత్రి పది గంటల ప్రాంతంలో కూడా చాలా తక్కువ స్క్రీన్లలో మాత్రమే షోలు పెట్టారు. ఇంత పెద్ద సినిమా రిలీజవుతుంటే.. హైదరాబాద్ లాంటి సిటీల్లో మేజర్ మల్టీప్లెక్సులు కంగువ షోలు పెట్టకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇక ఈ స్క్రీన్లలో కంగువ షోలు ఉండవని అంతా ఫిక్సయిపోయిన సమయంలో రాత్రి పదిన్నర ప్రాంతంలో సస్పెన్సుకు తెరపడింది. పీవీఆర్ సహా అన్ని ప్రధాన మల్టీప్లెక్సులూ కంగువ షోలు ఓపెన్ చేశాయి. మరి రెవెన్యూ షేరింగ్ విషయంలో ఏం ఒప్పందం జరిగిందో ఏమో కానీ.. రిలీజ్కు కొన్ని గంటల ముందు సమస్య పరిష్కారం అయింది.
కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారం కనీసం నాలుగు రోజుల ముందు బుకింగ్స్ మొదలు కావాల్సింది. కంగువకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పెద్ద ఎత్తున ఉదయం షోలు వేసుకోవడానికి అవకాముంది. టికెట్లు కూడా బాగా తెగేవి.
కానీ రిలీజ్కు కొన్ని గంటల ముందు వరకు బుకింగ్స్ లేకపోవడంతో తొలి రోజు ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడనుంది. తెలుగులో ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప కంగువ బ్రేక్ ఈవెన్ కాదు. కానీ లేట్ బుకింగ్స్ వల్ల తొలి రోజు కలెక్షన్లలో బాగానే గండి పడబోతోంది. సినిమాకు టాక్ బాగుంటే తర్వాత కలెక్షన్లు పుంజుకోవచ్చు కానీ.. ముందేతే పెద్ద గండి పడినట్లే.
This post was last modified on November 14, 2024 11:17 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…