బాహుబలి స్థాయి సినిమాగా కోలీవుడ్లో ప్రచారం జరిగిన కంగువ సినిమాకు రిలీజ్ ముంగిట తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటు తమిళనాట, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్ల సమస్యతో సతమతం అయింది. థియేటర్లతో ఆదాయం పంపకాల విషయంలో అంగీకారం కుదరకపోవడం ఓ సమస్య కాగా.. మంచి రన్తో సాగుతున్న అమరన్ను చాలా థియేటర్లు కొనసాగించడానికి నిర్ణయించడం మరో సమస్య.
ఐతే తమిళనాట రిలీజ్ ముందు రోజు సమస్య పరిష్కారమై మెజారిటీ స్క్రీన్లు దక్కాయి కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందులు తప్పలేదు. మల్టీప్లెక్సులతో రెవెన్యూ షేరింగ్ దగ్గర మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు పీటముడి పడడంతో పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ స్క్రీన్లలో ఎంతకీ బుకింగ్స్ మొదలు కాలేదు.
రాత్రి పది గంటల ప్రాంతంలో కూడా చాలా తక్కువ స్క్రీన్లలో మాత్రమే షోలు పెట్టారు. ఇంత పెద్ద సినిమా రిలీజవుతుంటే.. హైదరాబాద్ లాంటి సిటీల్లో మేజర్ మల్టీప్లెక్సులు కంగువ షోలు పెట్టకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇక ఈ స్క్రీన్లలో కంగువ షోలు ఉండవని అంతా ఫిక్సయిపోయిన సమయంలో రాత్రి పదిన్నర ప్రాంతంలో సస్పెన్సుకు తెరపడింది. పీవీఆర్ సహా అన్ని ప్రధాన మల్టీప్లెక్సులూ కంగువ షోలు ఓపెన్ చేశాయి. మరి రెవెన్యూ షేరింగ్ విషయంలో ఏం ఒప్పందం జరిగిందో ఏమో కానీ.. రిలీజ్కు కొన్ని గంటల ముందు సమస్య పరిష్కారం అయింది.
కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారం కనీసం నాలుగు రోజుల ముందు బుకింగ్స్ మొదలు కావాల్సింది. కంగువకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పెద్ద ఎత్తున ఉదయం షోలు వేసుకోవడానికి అవకాముంది. టికెట్లు కూడా బాగా తెగేవి.
కానీ రిలీజ్కు కొన్ని గంటల ముందు వరకు బుకింగ్స్ లేకపోవడంతో తొలి రోజు ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడనుంది. తెలుగులో ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప కంగువ బ్రేక్ ఈవెన్ కాదు. కానీ లేట్ బుకింగ్స్ వల్ల తొలి రోజు కలెక్షన్లలో బాగానే గండి పడబోతోంది. సినిమాకు టాక్ బాగుంటే తర్వాత కలెక్షన్లు పుంజుకోవచ్చు కానీ.. ముందేతే పెద్ద గండి పడినట్లే.
This post was last modified on November 14, 2024 11:17 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…