Movie News

రాశిఖన్నా ఆశలన్నీ సబర్మతి మీదే

మొన్నటిదాకా టాలీవుడ్ అగ్ర హీరోలతో నటించిన రాశిఖన్నా తెలుగు స్ట్రెయిట్ సినిమా చేసి రెండు సంవత్సరాలు దాటిపోయింది. నాగ చైతన్య థాంక్ యు, దానికి ముందు గోపీచంద్ పక్కా కమర్షియల్ రెండూ తీవ్రంగా నిరాశపరచడంతో ఇతర బాషల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. హిందీలో హిట్లు పడకపోయినా ఆఫర్లు వస్తున్నాయి. ఎల్లుండి ది సబర్మతి రిపోర్ట్ విడుదల కానుంది. 2002లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన గోద్రా రైలు దుర్ఘటన ఆధారంగా ధీరజ్ సమా దర్శకత్వంలో రూపొందించారు. ట్రైలర్ చూస్తే రాశి ఖన్నాది ప్రాధాన్యం ఉన్న పాత్రగా కనిపిస్తోంది. హిట్టయితే బ్రేక్ దక్కినట్టే.

విక్రాంత్ మాసే హీరోగా నటించిన సబర్మతి రిపోర్ట్ కాంట్రావర్సికి దారి తీస్తుందనే అంచనాలున్న నేపథ్యంలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. రాశిఖన్నా ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో తెలుసు కదాలో నటిస్తోంది. ఇందులో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తోంది. నీరజ కోన దర్శకత్వంలో మంచి రామ్ కామ్ గా రూపొందిస్తున్నారు. ఇది కాకుండా హిందీ, తమిళంలో రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. బాక్ అరణ్మయి 4 కోలీవుడ్ లో తనకు మంచి సక్సెస్ ఇచ్చింది. అంతకు ముందు కార్తీ సర్దార్, ధనుష్ తిరు రెండూ విజయవంతం కావడంతో అక్కడ కెరీర్ బాగానే ఉంది.

ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ రాశిఖన్నాను మిస్ అవుతున్నారు. సబర్మతి రిపోర్ట్ కూడా కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతోంది. 2013లో కెరీర్ ని బాలీవుడ్ మూవీ మద్రాస్ కేఫ్ తో మొదలుపెట్టిన రాశిఖన్నా గత ఏడాది యోధా లాంటి భారీ చిత్రంలో నటించినా అది డిజాస్టర్ కావడం చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఒకవేళ తెలుసు కదా కనక బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ ఇక్కడ అవకాశాలు పుంజుకోవచ్చు. రవితేజ, రామ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, నాగచైతన్యలతో మంచి ఫామ్ ఎంజాయ్ చేసి ఇప్పుడు కొంచెం నెమ్మదించినా సబర్మతి, తెలుసు కదాలు అంచనాలు అందుకుంటే మాత్రం తిరిగి వేగం పెంచొచ్చు.

This post was last modified on November 13, 2024 6:03 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

4 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

22 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

26 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago