భూషణ్ కుమార్ అంటే మన ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాకపోవచ్చు కానీ ఆదిపురుష్, యానిమల్, స్పిరిట్ లాంటి భారీ ప్యాన్ ఇండియా సినిమాల నిర్మాత అంటే ఠక్కున గుర్తొస్తారు. నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన టి సిరీస్ అధినేతగా బాలీవుడ్ లో ఆయనకున్న పట్టు గురించి మూవీ లవర్స్ లో తెలియని వారు ఉండరు. ఇంత ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తికి పోటీ వల్ల చుక్కలు కనిపించాయంటే నమ్మడం కష్టమైనా నిజం. ఇటీవలే ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాలు స్వయంగా పంచుకున్నాడు. ఇటీవలే తమ ప్రొడక్షన్లో విడుదలైన భూల్ భులయ్యా 3 వాటిలో ముఖ్యమైంది.
ముందు దీపావళి విడుదల తేదీని తాము ప్రకటిస్తే సింగం అగైన్ చాలా ఆలస్యంగా అదే రిలీజ్ డేట్ నవంబర్ 1 అనౌన్స్ చేశారని, ఇది చాలా అన్యాయమంటూ పలు మార్లు వాళ్లతో సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందని చెప్పుకొచ్చారు. కాంపిటీషన్ కమీషన్ ని ఫిర్యాదు చేసినా సమానంగా థియేటర్ల కేటాయింపు జరగలేదని, ఎక్కువ స్క్రీన్లు సింగం అగైన్ కే వెళ్లాయని వివరించారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో భూల్ భులయ్యా 3 ముందంజలో ఉండటం చూసి అప్పుడు పెంచారట. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనే తమ సినిమా మొదటి రోజే 36 కోట్ల గ్రాస్ సాధించడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
సరే ఇదంతా పక్కనపెడితే అంత బడా ప్రొడ్యూసర్ కే పోటీ వల్ల ఇంతటి ఇబ్బంది తలెత్తితే మరి చిన్న మధ్య తరగతి నిర్మాతల వెతలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సరైన థియేటర్లు దొరక్క, డిస్ట్రిబ్యూటర్ల నుంచి సహకారం లేక, స్టార్ హీరోల సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, పంపిణిలో పెద్దలు చూపించే ఆధిపత్యం, ఇలా ఎన్నో కారణాలతో నలిగిపోతున్న ప్రొడ్యూసర్లు లెక్కలేనంత మంది ఉన్నారు. స్పిరిట్, యానిమల్ పార్క్ లాంటి వందల కోట్ల పెట్టుబడితో డీల్ చేస్తున్న భూషణ్ కుమార్ మాటలను బట్టి చూస్తే పోటీ ఎవరికైనా కఠినమైన సవాళ్లను తీసుకొస్తుందని అర్థమయ్యిందిగా.
This post was last modified on November 13, 2024 3:29 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…