ఒక కొత్త సినిమా రిలీజ్ కాబోతుండగా.. దాని గురించి కబుర్లు చాలానే చెబుతారు ఆ చిత్రానికి సంబంధించిన వ్యక్తులు. తాజాగా అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ‘నిశ్శబ్దం’ గురించి చిత్ర బృందం ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. వాళ్లు చెప్పడం కాదు కానీ.. అనుష్క, మాధవన్లతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించడానికి ముందుకొచ్చాడంటేనే ఇది చాలా స్పెషల్ మూవీ అయ్యుంటుందని అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.
దీనికి తోడు రిలీజ్ ముంగిట దర్శకుడు హేమంత్ మధుకర్ తన చిత్రం గురించి ఓ రేంజిలో చెప్పుకున్నాడు. తీరా చూస్తే సినిమాలో అంత విషయం లేదని తేలిపోయింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని కూడా అనుకున్నాడట హేమంత్.
ప్రతి దర్శకుడికీ తన సినిమా గొప్పగానే అనిపిస్తుంది. అందులోనూ పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నమ్మి తన సినిమా చేసినపుడు ఆ నమ్మకం ఇంకా పెరుగుతుంది. అందులోనూ ఇంతకుముందు హేమంత్ తీసిన రెండు సినిమాలూ ఏమాత్రం మంచి ఫలితాన్నివ్వలేదు. అయినా సరే.. ఇంతమంది నమ్మి అతడితో సినిమా చేశారు. నిర్మాతలు మంచి బడ్జెట్ పెట్టి మొత్తం అమెరికాలో చిత్రీకరణ చేయించారు.
ఈ నేపథ్యంలో తన సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుందని గట్టిగా నమ్మినట్లున్నాడు హేమంత్. అందుకే ఈ కథకు కొనసాగింపుగా సీక్వెల్ తీసేందుకు కూడా లైన్ రెడీ చేసుకుని ఆ దిశగా సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. కానీ ఈ సినిమాకు పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.
మామూలుగా చూస్తే ఓ మోస్తరుగా అనిపించేదేమో కానీ.. దీని కాస్టింగ్, బడ్జెట్, ప్రోమోలు, చిత్ర బృందం చెప్పిన మాటలు.. ఇవన్నీ చూసి ప్రేక్షకులు అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగా సినిమా లేకపోవడంతో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ చూశాక ‘నిశ్శబ్దం’కు సీక్వెల్ తీయడానికి ఇప్పుడున్న నిర్మాతలు కానీ, వేరే వాళ్లు కానీ ముందుకొస్తారా అన్నది సందేహమే.
This post was last modified on October 4, 2020 6:49 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…