Movie News

‘నిశ్శబ్దం’కు సీక్వెల్ కూడా అట

ఒక కొత్త సినిమా రిలీజ్ కాబోతుండగా.. దాని గురించి కబుర్లు చాలానే చెబుతారు ఆ చిత్రానికి సంబంధించిన వ్యక్తులు. తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘నిశ్శబ్దం’ గురించి చిత్ర బృందం ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. వాళ్లు చెప్పడం కాదు కానీ.. అనుష్క, మాధవన్‌లతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించడానికి ముందుకొచ్చాడంటేనే ఇది చాలా స్పెషల్ మూవీ అయ్యుంటుందని అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

దీనికి తోడు రిలీజ్ ముంగిట దర్శకుడు హేమంత్ మధుకర్ తన చిత్రం గురించి ఓ రేంజిలో చెప్పుకున్నాడు. తీరా చూస్తే సినిమాలో అంత విషయం లేదని తేలిపోయింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని కూడా అనుకున్నాడట హేమంత్.

ప్రతి దర్శకుడికీ తన సినిమా గొప్పగానే అనిపిస్తుంది. అందులోనూ పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నమ్మి తన సినిమా చేసినపుడు ఆ నమ్మకం ఇంకా పెరుగుతుంది. అందులోనూ ఇంతకుముందు హేమంత్ తీసిన రెండు సినిమాలూ ఏమాత్రం మంచి ఫలితాన్నివ్వలేదు. అయినా సరే.. ఇంతమంది నమ్మి అతడితో సినిమా చేశారు. నిర్మాతలు మంచి బడ్జెట్ పెట్టి మొత్తం అమెరికాలో చిత్రీకరణ చేయించారు.

ఈ నేపథ్యంలో తన సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుందని గట్టిగా నమ్మినట్లున్నాడు హేమంత్. అందుకే ఈ కథకు కొనసాగింపుగా సీక్వెల్ తీసేందుకు కూడా లైన్ రెడీ చేసుకుని ఆ దిశగా సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. కానీ ఈ సినిమాకు పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

మామూలుగా చూస్తే ఓ మోస్తరుగా అనిపించేదేమో కానీ.. దీని కాస్టింగ్, బడ్జెట్, ప్రోమోలు, చిత్ర బృందం చెప్పిన మాటలు.. ఇవన్నీ చూసి ప్రేక్షకులు అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగా సినిమా లేకపోవడంతో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ చూశాక ‘నిశ్శబ్దం’కు సీక్వెల్ తీయడానికి ఇప్పుడున్న నిర్మాతలు కానీ, వేరే వాళ్లు కానీ ముందుకొస్తారా అన్నది సందేహమే.

This post was last modified on October 4, 2020 6:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయన్ తో సతీషన్.. మనకా భాగ్యం లేదంతే!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…

3 hours ago

హమ్మయ్యా… పెద్ద బరువు తీరినట్టేనా

తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…

4 hours ago

శ్రీరాములు రినోవేషన్… ఎగ్జిబిటర్ల సమాధానమా

హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…

4 hours ago

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…

4 hours ago

పెద్దికి తొలగిన అడ్డంకులు

టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…

4 hours ago

నీట్ పరీక్షపై సంచలన నిర్ణయం!

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…

4 hours ago