నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ డిసెంబర్ విడుదలకు రెడీ అవుతోంది. తొలుత 20 డేట్ ప్రకటించారు కానీ ఇప్పుడది 25కి మారొచ్చని ఫిలిం నగర్ టాక్. ఓవర్సీస్ లో ముఫాసా లాంటి హాలీవుడ్ మూవీ నుంచి వస్తున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు కానీ గురువారం రిలీజ్ కాబోయే టీజర్ ద్వారా స్పష్టత వస్తుంది. భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత రిపీట్ అవుతున్న కలయికగా రాబిన్ హుడ్ మీద పెద్ద అంచనాలున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనికి ఒకప్పటి చిరంజీవి సూపర్ హిట్ కొండవీటి దొంగకు పోలికలు ఉన్నాయట.
ఎలా అంటే రాబిన్ హుడ్ కథాంశం హీరో దొంగతనాలు చేయడం మీద నడుస్తుంది. ఉన్నవాడిని దోచిపెట్టి లేనివాడికి పంచిపెట్టమనేది హీరో సిద్ధాంతం. కాకపోతే ఆ చోరీలు సరికొత్తగా, వినూత్నంగా గతంలో చూడని రీతిలో ఉంటాయి. కొండవీటి దొంగలో చిరంజీవి ముఖానికి నల్లని ముసుగు వేసుకుని విలన్లను దోచుకుంటూ ఉంటాడు. ఇప్పుడీ నితిన్ పోషిస్తున్న రాబిన్ హుడ్ ఫేసుకు అదే తరహాలో మాస్క్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ కొంచెం సీరియస్ గా అనిపిస్తున్నా ఫుల్ ఎంటర్ టైనర్ గా వెంకీ కుడుముల దీన్ని రూపొందిస్తున్నారట. హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నితిన్ కి జోడి కట్టడం మరో అట్రాక్షన్.
సో నితిన్ అభిమానులు బోలెడు ఆశించేలా వెంకీ కుడుముల అన్ని జాగ్రత్తలు తీసుకున్నారన్న మాట. మైత్రి మూవీ మేకర్స్ దీని మీద పెద్ద బడ్జెట్ పెట్టింది. విదేశాల్లో షూటింగ్ చేశారు. ఒకే నెలలో ఈ సంస్థ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. పుష్ప 2 ది రూల్ విధ్వంసం చేసిన రెండు వారాలు లేదా ఇరవై రోజుల్లోనే రాబిన్ హుడ్ దిగిపోతాడు. ఎల్లుండి టీజర్ చూశాక కాన్సెప్ట్ గురించి మరింత క్లారిటీ వస్తుంది. భీష్మ తర్వాత గ్యాప్ వచ్చేసి మెగాస్టార్ మూవీని చేతి దాకా వచ్చి మిస్ చేసుకున్న వెంకీ కుడుముల ఈసారి నితిన్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో పాటు టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్నాడు.
This post was last modified on November 12, 2024 10:58 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…