పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యంగా సినిమాల విషయంలో ఈ ట్రెండ్ ఎప్పట్నుంచో ఉంది. వేరే భాషల చిత్రాలను నెత్తిన పెట్టుకునే మన ప్రేక్షకులు మన సినిమాల్లోని గొప్పదనాన్ని.. మన వాళ్ల ప్రతిభను గుర్తించరు అనే చర్చ జరుగుతుంటుంది.
తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్కు తెలుగులో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. అతడి కొత్త పాట ఏది వచ్చినా.. దాన్ని మనవాళ్లే ఎక్కువ ట్రెండ్ చేస్తుంటారు. అనిరుధ్కు ఎక్కడ లేని ఎలివేషన్లు ఇస్తుంటారు. ‘దేవర’ సినిమా కోసం అనిరుధ్నే సంగీత దర్శకుడిగా ఎంచుకోవాలంటూ తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి మరీ అనుకున్నది సాధించిన సంగతి తెలిసిందే. ఐతే అనిరుధ్కు ఇంతగా ఎలివేషన్ ఇచ్చే తెలుగు ఫ్యాన్స్.. మన స్టార్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పనితనాన్ని గుర్తించలేకపోతున్నారంటూ అతడి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
దేవిలో ఒకప్పటితో పోలిస్తే జోరు తగ్గినా.. అప్పుడప్పుడూ మెరుపులు మెరిపిస్తూనే ఉంటాడు. తాజాగా అతను సూర్య సినిమా ‘కంగువ’కు మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లలో బ్యాగ్రౌైండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేస్తుండగా.. అన్నీ బాగానే అనిపిస్తున్నాయి. ఇటీవల మన్నింపు అనే పాట రిలీజ్ చేయగా.. ట్యూన్ చాలా ప్రత్యేకంగా అనిపించింది.
తాజాగా వార్ సాంగ్ ఒకటి లాంచ్ చేశారు. అది వేరే లెవెల్ అన్నట్లే ఉంది. కానీ ఈ పాటల గురించి తెలుగు ఫ్యాన్స్ పెద్దగా మాట్లాడట్లేదు. కానీ ఇలాంటి పాటలే అనిరుధ్ కంపోజ్ చేస్తే ఆహా ఓహో అంటూ అతణ్ని కొనియాడేస్తుంటారని.. ‘బాహుబలి’ తరహాలో తమిళంలో భారీగా తెరకెక్కిన ‘కంగువ’ సినిమాకు మన సంగీత దర్శకుడు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తే తనను మాత్రం పట్టించుకోడం లేదని.. పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత మనవాళ్లకు వంద శాతం కరెక్ట్ అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on November 12, 2024 6:23 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…