స్వీయ దర్శకత్వంలో ఇటీవలే రాయన్ తో చెప్పుకోదగ్గ హిట్టు ఖాతాలో వేసుకున్నాడు ధనుష్. తమిళ వెర్షన్ బాగానే ఆడింది మిగిలిన భాషల్లో ఆ స్థాయి స్పందన తెచ్చుకోకపోయినా ఒక టెక్నీషీయన్ గా మంచి ప్రశంసలే దక్కాయి. వచ్చే ఏడాది నిత్య మీనన్ తో కలిసి ఇడ్లీ కడాయ్ తో పలకరించబోతున్నాడు. ఇదిలా ఉండగా ధనుష్ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కు మరో అవకాశం ఇచ్చాడు. ట్విస్ట్ ఏంటంటే ఈయన వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. అక్షయ్ కుమార్ తో చేసిన గత చిత్రం రక్షా బంధన్ దారుణంగా బోల్తా కొట్టింది. అంతకు ముందు అత్ రంగీరే సైతం ఓటిటిలో యావరేజ్ ఫలితాన్ని దక్కించుకుంది.
ధనుష్ ఆనంద్ రాయ్ ని ఇంతగా నమ్మడానికి కారణం లేకపోలేదు. బాలీవుడ్ డెబ్యూ రంఝానా తీసి మంచి హిట్టుతో పాటు గుర్తుండిపోయే తెరంగేట్రం చేయించాడు కాబట్టి ఆ కృతజ్ఞతతోనే అత్ రంగీరేలో అక్షయ్ తో కలిసి నటించాడు. అయినా ఋణం తీరలేదని భావించాడు కాబోలు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ ఇచ్సిన జీరో లాంటి బ్రహ్మాండమైన అవకాశాన్ని ఆనంద్ చేతులారా వృధా చేసుకున్నారు. కెజిఎఫ్ 1తో తలపడి దారుణమైన ఫలితం చూసిందా మూవీ. తను వెడ్స్ మను లాంటి క్లాసిక్ ఇచ్చిన డైరెక్టర్ ఆ స్థాయి కంటెంట్ మళ్ళీ ఇవ్వకపోయినా నిర్మాతగా హిట్లు కొడుతున్నారు.
ఇప్పుడీ ధనుష్ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. తేరి ఇష్క్ మే టైటిల్ తో రూపొందబోయే ఈ రామ్ కామ్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనుండటం విశేషం. ప్యాన్ ఇండియా భాషలు కాబట్టి తెలుగులోనూ సమాంతరంగా రాబోతోంది. క్రమంగా మార్కెట్ ని విస్తరించుకునే పనిలో ఉన్న ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ యుగానికి ఒక్కడు 2లో కూడా నటించబోతున్నాడు. ప్రకటన ఎప్పుడో ఇచ్చారు బడ్జెట్ కారణాలో ఏమో కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈలోగా ధనుష్ డైరెక్షన్ లోనే నిలవుకు ఎన్మేల్ ఎన్నది కోబమ్ శరవేగంగా పూర్తవుతోంది.
This post was last modified on November 12, 2024 11:14 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…