Movie News

వామ్మో.. ప్రభాస్‌ ఆ పాట పెడుతున్నాడ్రోయ్

ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. అలాంటి స్టేచర్ ఉన్న నటుడు ఒక సాహిత్య పరమైన కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా ఓ టీవీ ఛానెల్లో నిర్వహించే ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి ప్రభాస్ అతిథిగా వచ్చాడు.

ఇప్పటిదాకా చాలామంది దర్శకులు, లిరిసిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రి గారి సాహిత్యంలో ఉన్న గొప్పదనం గురించి చర్చించారు. కానీ ప్రభాస్ లాంటి టాప్ స్టార్ హీరో ఈ కార్యక్రమానికి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ఎపిసోడ్లో సీతారామశాస్త్రి సాహిత్యం తనకెంత ఇష్టమో.. ఆయన పాటల్లో తనకు అత్యంత నచ్చిన పాటలేంటో ప్రభాస్ పంచుకున్నాడు.

శాస్త్రిగారి పాటలన్నింట్లో తనకు ‘జల్సా’ సినిమాలోని ‘ఛలోరే ఛలోరే’ పాట అంటే పిచ్చి అని ప్రభాస్ వెల్లడించాడు. అందులో ఒక్కో లైన్ వింటుంటే మతి పోతుందని ప్రభాస్ చెప్పాడు. ఆ పాటలోని అర్థం గురించి తాను ఎన్నిసార్లు మాట్లాడానో లెక్కే లేదని ప్రభాస్ అన్నాడు. తాను ఎప్పుడూ పార్టీలో పాల్గొన్నా ఆ పాట ప్లే చేయాల్సిందేనని.. చాలాసార్లు తన ఫ్రెండ్స్ వీడు ‘ఛలోరే ఛలోరే’ పాట పెడుతున్నాడ్రోయ్ అంటూ పారిపోయేవారని ప్రభాస్ నవ్వుతూ చెప్పాడు.

ఈ పాటలో వచ్చే ‘రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం’ అనే లైన్ తనకు చాలా చాలా ఇష్టమని ప్రభాస్ చెప్పాడు. ఆయన సినిమా కోసం ఈ లైన్ రాసినా.. అది మన జీవితాల గురించే రాసినట్లు అనిపిస్తుందని ప్రభాస్ అభిప్రాయపడ్డాడు. ‘ఆట’ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటుందన్నాడు ప్రభాస్.

ఇక ‘మనీ’ సినిమాలోని భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ పాట గురించి మాట్లాడుతూ.. ఇంతకీ తానిప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా అంటూ ప్రభాస్ చమత్కరించాడు. ‘చక్రం’ సినిమాలోని జగమంత కుటుంబం పాట.. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యద్భుతమైన పాటల జాబితాలో ఒకటి అని.. తన సినిమా కోసం అలాంటి పాట రాయడం తన అదృష్టం అని.. ఈ పాట స్ఫూర్తితోనే కృష్ణవంశీ ‘చక్రం’ కథ రాశారని.. ఆ పాట సాహిత్యం వెనుక ఉన్న అర్థం తెలిసి తనకు మతి పోయిందని ప్రభాస్ తెలిపాడు.

This post was last modified on November 11, 2024 2:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago