ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. అలాంటి స్టేచర్ ఉన్న నటుడు ఒక సాహిత్య పరమైన కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా ఓ టీవీ ఛానెల్లో నిర్వహించే ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి ప్రభాస్ అతిథిగా వచ్చాడు.
ఇప్పటిదాకా చాలామంది దర్శకులు, లిరిసిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రి గారి సాహిత్యంలో ఉన్న గొప్పదనం గురించి చర్చించారు. కానీ ప్రభాస్ లాంటి టాప్ స్టార్ హీరో ఈ కార్యక్రమానికి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ఎపిసోడ్లో సీతారామశాస్త్రి సాహిత్యం తనకెంత ఇష్టమో.. ఆయన పాటల్లో తనకు అత్యంత నచ్చిన పాటలేంటో ప్రభాస్ పంచుకున్నాడు.
శాస్త్రిగారి పాటలన్నింట్లో తనకు ‘జల్సా’ సినిమాలోని ‘ఛలోరే ఛలోరే’ పాట అంటే పిచ్చి అని ప్రభాస్ వెల్లడించాడు. అందులో ఒక్కో లైన్ వింటుంటే మతి పోతుందని ప్రభాస్ చెప్పాడు. ఆ పాటలోని అర్థం గురించి తాను ఎన్నిసార్లు మాట్లాడానో లెక్కే లేదని ప్రభాస్ అన్నాడు. తాను ఎప్పుడూ పార్టీలో పాల్గొన్నా ఆ పాట ప్లే చేయాల్సిందేనని.. చాలాసార్లు తన ఫ్రెండ్స్ వీడు ‘ఛలోరే ఛలోరే’ పాట పెడుతున్నాడ్రోయ్ అంటూ పారిపోయేవారని ప్రభాస్ నవ్వుతూ చెప్పాడు.
ఈ పాటలో వచ్చే ‘రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం’ అనే లైన్ తనకు చాలా చాలా ఇష్టమని ప్రభాస్ చెప్పాడు. ఆయన సినిమా కోసం ఈ లైన్ రాసినా.. అది మన జీవితాల గురించే రాసినట్లు అనిపిస్తుందని ప్రభాస్ అభిప్రాయపడ్డాడు. ‘ఆట’ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటుందన్నాడు ప్రభాస్.
ఇక ‘మనీ’ సినిమాలోని భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ పాట గురించి మాట్లాడుతూ.. ఇంతకీ తానిప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా అంటూ ప్రభాస్ చమత్కరించాడు. ‘చక్రం’ సినిమాలోని జగమంత కుటుంబం పాట.. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యద్భుతమైన పాటల జాబితాలో ఒకటి అని.. తన సినిమా కోసం అలాంటి పాట రాయడం తన అదృష్టం అని.. ఈ పాట స్ఫూర్తితోనే కృష్ణవంశీ ‘చక్రం’ కథ రాశారని.. ఆ పాట సాహిత్యం వెనుక ఉన్న అర్థం తెలిసి తనకు మతి పోయిందని ప్రభాస్ తెలిపాడు.
This post was last modified on November 11, 2024 2:17 pm
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…