తమిళ నటుడు మాధవన్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమా ‘సఖి’లోనే అతను మైమరిపించాడు. మణిరత్నం లాంటి దర్శకుడి చిత్రంలో ఆయన స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో నటించి మెప్పించాడు. ఇక అక్కడి నుంచి గత రెండు దశాబ్దాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరిస్తూ వస్తున్నాడు.
హిందీలో సైతం రంగ్దె బసంతి, గురు లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. గత కొన్నేళ్లలో విక్రమ్ వేద, ఇరుదు సుట్రు (గురు ఒరిజినల్) లాంటి చిత్రాల్లో మాధవన్ అదరగొట్టాడు. ఐతే ఇంత మంచి నటుణ్ని తెలుగు సినీ పరిశ్రమ మాత్రం సరిగా వాడుకోలేకపోతోంది. అనువాద చిత్రాలతో మాధవన్కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ను ఉపయోగించుకుని అతణ్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో నటింపజేద్దామని గతంలోనే ప్రయత్నాలు జరిగాయి.
కానీ తనకు తెలుగు మీద పట్టు లేకపోవడం వల్ల ఇక్కడ నటించలేనని చెప్పేశాడు. కానీ ఈ మధ్య అతడి మనసు మారింది. ‘సవ్యసాచి’లో విలన్ పాత్ర నచ్చి ఆ సినిమా చేయడానికి అంగీకరించాడు. అన్నేళ్ల సెలబ్రేటెడ్ కెరీర్ తర్వాత తెలుగులో మాధవన్ అరంగేట్ర చిత్రం మీద అందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా తుస్సుమంది. మాధవన్ పాత్ర కూడా అంచనాలకు తగ్గట్లు లేదందులో.
దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ‘నిశ్శబ్దం’లో నటించాడు మాధవన్. ఈ క్యారెక్టర్లో ఏదో విశేషం ఉన్నట్లే కనిపించింది. కానీ సినిమాలో ఆ పాత్ర కూడా తేలిపోయింది. ఆ పాత్రకు మాధవన్ మిస్ ఫిట్ అన్నట్లుగా కనిపించాడు. మాధవన్ను అలాంటి పాత్రలో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఆ పాత్రను కన్విన్సింగ్గా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇటు తమిళంలో, అటు హిందీలో అదిరిపోయే రోల్స్ చేసిన మాధవన్ను తెలుగు దర్శకులు సరిగా ఉపయోగించుకోలేక వేస్ట్ చేసేయడం విచారించాల్సిన విషయం. వరుసగా రెండు సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న మాధవన్.. ఇంకోసారి తెలుగులో నటిస్తాడా అన్నది సందేహమే.
This post was last modified on October 12, 2020 9:44 am
కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది, రెండు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్ బస్టర్ గా…
సరిగ్గా వచ్చే వారం ఇదే రోజు ది ప్యారడైజ్ ప్రీమియర్లు పడబోతున్నాయి. సాయంత్రం రాత్రి కలిపి రెండు షోలు ప్లాన్…
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా బుధవారం…
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్ల తర్వాత.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గం పరిధి లో…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దేశంలోని కాంగ్రెస్ పార్టీ హామీలను కాపీ కొడుతున్నాడా అంటే ఔననే చెబుతున్నాడు కర్ణాటక…
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అప్రతిహాత విజయాలతో దూసుకొని వెళుతున్న నేపథ్యంలో ఈ సారి ఆయన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా…