పుష్ప 2 స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పరుగులు పెట్టుకుంటూ జరుగుతోంది. అల్లు అర్జున్, శ్రీలీల మీద ప్రత్యేకంగా వేసిన సెట్లో తీసిన పాట తాలూకు ఫోటో లీక్ రెండు రోజుల క్రితమే బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న అఫీషియల్ గా టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే పుష్ప 1లో సమంతా ఊ అంటావా ఊహు అంటావాని మరిపించేలా ఈ ప్రత్యేక గీతం ఉంటుందా లేదానే అనుమానాలు అభిమానుల్లో రావడం సహజం. అయితే చిత్రీకరణలో లైవ్ గా ఉంటున్న వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం సామ్ డాన్సుకి రెండు మూడింతలు ఎక్కువే శ్రీలీల చేస్తోందని సమాచారం.
అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో దర్శకుడు సుకుమార్ కు బాగా తెలుసు కాబట్టే దానికి అనుగుణంగానే డిజైన్ చేయించారట. కిసిక్ అనే ఊతపదంతో దేవిశ్రీ ప్రసాద్ మంచి మాస్ ట్యూన్ కంపోజ్ చేశారని తెలిసింది. ట్రైలర్ తర్వాత దీన్నే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మైత్రి మేకర్స్. విడుదలకు ఇంకో 25 రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నారు. గుమ్మడికాయ ఈ వారంలోనే కొట్టేసి ప్యాన్ ఇండియా టూర్లు ప్లాన్ చేస్తున్నారు. ఏడు ప్రధాన నగరాలతో పాటు వీలైనన్ని ఎక్కువ ఇంటర్వ్యూలు, నేషనల్ మీడియా కవరేజ్ వచ్చేలా మొత్తం సెట్ చేసి పెట్టారు.
వెయ్యి కోట్ల బిజినెస్ టార్గెట్ గా పెట్టుకున్న పుష్ప 2 ది రూల్ కు అందులో సగంపైగా మొదటి వారంలోనే వచ్చే అంచనాలు ట్రేడ్ లో బలంగా ఉన్నాయి. హైప్ కూడా దానికి తగ్గట్టే ఉంది. డిసెంబర్ 5 జరగబోయే అరాచకం మాములుగా ఉండేలా లేదు. తమన్ రీ రికార్డింగ్ పనులు మొదలుపెట్టేశాడు. కొంత భాగం అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ కంపోజ్ చేస్తున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణగా తెలియాల్సి ఉంది. పుష్ప 2 దెబ్బకే పోటీగా రావాలనుకున్న బాలీవుడ్ చావా ఏకంగా నెలకు పైగానే వాయిదా వేసుకుంది. ఇతర భాషల్లోనూ ఎవరూ బన్నీతో కాంపిటీషన్ చేసే రిస్కుకు సిద్ధంగా లేరు.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…