పుష్ప 2 స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పరుగులు పెట్టుకుంటూ జరుగుతోంది. అల్లు అర్జున్, శ్రీలీల మీద ప్రత్యేకంగా వేసిన సెట్లో తీసిన పాట తాలూకు ఫోటో లీక్ రెండు రోజుల క్రితమే బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న అఫీషియల్ గా టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే పుష్ప 1లో సమంతా ఊ అంటావా ఊహు అంటావాని మరిపించేలా ఈ ప్రత్యేక గీతం ఉంటుందా లేదానే అనుమానాలు అభిమానుల్లో రావడం సహజం. అయితే చిత్రీకరణలో లైవ్ గా ఉంటున్న వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం సామ్ డాన్సుకి రెండు మూడింతలు ఎక్కువే శ్రీలీల చేస్తోందని సమాచారం.
అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో దర్శకుడు సుకుమార్ కు బాగా తెలుసు కాబట్టే దానికి అనుగుణంగానే డిజైన్ చేయించారట. కిసిక్ అనే ఊతపదంతో దేవిశ్రీ ప్రసాద్ మంచి మాస్ ట్యూన్ కంపోజ్ చేశారని తెలిసింది. ట్రైలర్ తర్వాత దీన్నే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మైత్రి మేకర్స్. విడుదలకు ఇంకో 25 రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నారు. గుమ్మడికాయ ఈ వారంలోనే కొట్టేసి ప్యాన్ ఇండియా టూర్లు ప్లాన్ చేస్తున్నారు. ఏడు ప్రధాన నగరాలతో పాటు వీలైనన్ని ఎక్కువ ఇంటర్వ్యూలు, నేషనల్ మీడియా కవరేజ్ వచ్చేలా మొత్తం సెట్ చేసి పెట్టారు.
వెయ్యి కోట్ల బిజినెస్ టార్గెట్ గా పెట్టుకున్న పుష్ప 2 ది రూల్ కు అందులో సగంపైగా మొదటి వారంలోనే వచ్చే అంచనాలు ట్రేడ్ లో బలంగా ఉన్నాయి. హైప్ కూడా దానికి తగ్గట్టే ఉంది. డిసెంబర్ 5 జరగబోయే అరాచకం మాములుగా ఉండేలా లేదు. తమన్ రీ రికార్డింగ్ పనులు మొదలుపెట్టేశాడు. కొంత భాగం అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ కంపోజ్ చేస్తున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణగా తెలియాల్సి ఉంది. పుష్ప 2 దెబ్బకే పోటీగా రావాలనుకున్న బాలీవుడ్ చావా ఏకంగా నెలకు పైగానే వాయిదా వేసుకుంది. ఇతర భాషల్లోనూ ఎవరూ బన్నీతో కాంపిటీషన్ చేసే రిస్కుకు సిద్ధంగా లేరు.
This post was last modified on November 11, 2024 2:17 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…