ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న కంగువకు ఘనస్వాగతం చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్ తీసుకుని సూర్య విపరీతంగా కష్టపడిన ఈ ప్యాన్ ఇండియా మూవీ కోలీవుడ్ కు బాహుబలి రేంజ్ మైలురాయిగా నిలిచిపోతుందని తమిళనాడులో భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు వెర్షన్ సైతం భారీ రేట్లు పలుకుతోంది. తెల్లవారుఝాము నాలుగు గంటలకు ప్రీమియర్ షోలకు సిద్ధ పడ్డారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్, కల్కి స్థాయి వైబ్ లేదనే కామెంట్స్ నేపథ్యంలో నిన్న వదిలిన కొత్త థియేట్రికల్ ట్రైలర్ హైప్ ని అమాంతం పెంచేసింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రెండో వారంలో ఉన్న అమరన్ వల్ల కంగువకు ఖంగారు తప్పడం లేదని ట్రేడ్ టాక్. ఎందుకంటే ఇప్పటికే రెండు వందల కోట్లు దాటిన గ్రాస్ తో అద్భుతంగా రన్నవుతున్న ఈ ఎమోషనల్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ తగ్గడం లేదు. హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ డిస్ట్రిబ్యూటర్లు థర్డ్ వీక్ కూడా అధిక శాతం స్క్రీన్లలో దీన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంగువకు యునానిమస్ గా ఎక్కువ స్క్రీన్లు దక్కకపోవచ్చనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అదే జరిగితే కనక ఆల్ టైం రికార్డుల కోసం చూస్తున్న వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం తగ్గిపోతుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలే డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్నాయట. తెలుగులో సమస్య లేదు. ఇక్కడ రన్ కొంచెం నెమ్మదించింది. రెండో వీకెండ్ తిరిగి దూకుడు చూపించినప్పటికీ ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడీ అమరన్ సమస్య వల్లే తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టలేదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా వీలైనంత పెద్ద ఎత్తున స్క్రీన్ కౌంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. అయితే అమరన్ పంపిణీదారులు నుంచే స్పీడ్ బ్రేకర్ ఎదురవుతోందని వినికిడి. సో కంగువకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావడం తప్ప దీనికి పరిష్కారం ఉండదు.
This post was last modified on November 11, 2024 10:13 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…