ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న కంగువకు ఘనస్వాగతం చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్ తీసుకుని సూర్య విపరీతంగా కష్టపడిన ఈ ప్యాన్ ఇండియా మూవీ కోలీవుడ్ కు బాహుబలి రేంజ్ మైలురాయిగా నిలిచిపోతుందని తమిళనాడులో భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు వెర్షన్ సైతం భారీ రేట్లు పలుకుతోంది. తెల్లవారుఝాము నాలుగు గంటలకు ప్రీమియర్ షోలకు సిద్ధ పడ్డారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్, కల్కి స్థాయి వైబ్ లేదనే కామెంట్స్ నేపథ్యంలో నిన్న వదిలిన కొత్త థియేట్రికల్ ట్రైలర్ హైప్ ని అమాంతం పెంచేసింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రెండో వారంలో ఉన్న అమరన్ వల్ల కంగువకు ఖంగారు తప్పడం లేదని ట్రేడ్ టాక్. ఎందుకంటే ఇప్పటికే రెండు వందల కోట్లు దాటిన గ్రాస్ తో అద్భుతంగా రన్నవుతున్న ఈ ఎమోషనల్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ తగ్గడం లేదు. హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ డిస్ట్రిబ్యూటర్లు థర్డ్ వీక్ కూడా అధిక శాతం స్క్రీన్లలో దీన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంగువకు యునానిమస్ గా ఎక్కువ స్క్రీన్లు దక్కకపోవచ్చనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అదే జరిగితే కనక ఆల్ టైం రికార్డుల కోసం చూస్తున్న వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం తగ్గిపోతుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలే డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్నాయట. తెలుగులో సమస్య లేదు. ఇక్కడ రన్ కొంచెం నెమ్మదించింది. రెండో వీకెండ్ తిరిగి దూకుడు చూపించినప్పటికీ ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడీ అమరన్ సమస్య వల్లే తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టలేదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా వీలైనంత పెద్ద ఎత్తున స్క్రీన్ కౌంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. అయితే అమరన్ పంపిణీదారులు నుంచే స్పీడ్ బ్రేకర్ ఎదురవుతోందని వినికిడి. సో కంగువకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావడం తప్ప దీనికి పరిష్కారం ఉండదు.
This post was last modified on November 11, 2024 10:13 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…