ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న కంగువకు ఘనస్వాగతం చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్ తీసుకుని సూర్య విపరీతంగా కష్టపడిన ఈ ప్యాన్ ఇండియా మూవీ కోలీవుడ్ కు బాహుబలి రేంజ్ మైలురాయిగా నిలిచిపోతుందని తమిళనాడులో భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు వెర్షన్ సైతం భారీ రేట్లు పలుకుతోంది. తెల్లవారుఝాము నాలుగు గంటలకు ప్రీమియర్ షోలకు సిద్ధ పడ్డారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్, కల్కి స్థాయి వైబ్ లేదనే కామెంట్స్ నేపథ్యంలో నిన్న వదిలిన కొత్త థియేట్రికల్ ట్రైలర్ హైప్ ని అమాంతం పెంచేసింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రెండో వారంలో ఉన్న అమరన్ వల్ల కంగువకు ఖంగారు తప్పడం లేదని ట్రేడ్ టాక్. ఎందుకంటే ఇప్పటికే రెండు వందల కోట్లు దాటిన గ్రాస్ తో అద్భుతంగా రన్నవుతున్న ఈ ఎమోషనల్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ తగ్గడం లేదు. హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ డిస్ట్రిబ్యూటర్లు థర్డ్ వీక్ కూడా అధిక శాతం స్క్రీన్లలో దీన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంగువకు యునానిమస్ గా ఎక్కువ స్క్రీన్లు దక్కకపోవచ్చనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అదే జరిగితే కనక ఆల్ టైం రికార్డుల కోసం చూస్తున్న వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం తగ్గిపోతుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలే డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్నాయట. తెలుగులో సమస్య లేదు. ఇక్కడ రన్ కొంచెం నెమ్మదించింది. రెండో వీకెండ్ తిరిగి దూకుడు చూపించినప్పటికీ ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడీ అమరన్ సమస్య వల్లే తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టలేదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా వీలైనంత పెద్ద ఎత్తున స్క్రీన్ కౌంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. అయితే అమరన్ పంపిణీదారులు నుంచే స్పీడ్ బ్రేకర్ ఎదురవుతోందని వినికిడి. సో కంగువకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావడం తప్ప దీనికి పరిష్కారం ఉండదు.
This post was last modified on November 11, 2024 10:13 am
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…