నిన్న మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ ఇచ్చిన స్పీచ్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఎవరైతే తమ ఎదుగుదలకు కారణమైన వాళ్ళను మర్చిపోతారో అప్పుడు ఎంత సక్సెస్ సాధించినా వృథా అనే తరహాలో మెగా ప్రిన్స్ అన్న మాటలు ప్రత్యేకంగా ఒకరిని టార్గెట్ చేస్తున్నాయనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. నంద్యాల పర్యటన తర్వాత అల్లు అర్జున్ మీద మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఏకంగా ఆన్ లైన్ వార్స్ కి దారి తీసి పుష్ప 2, గేమ్ ఛేంజర్ గురించి పరస్పరం బురద జల్లుకునే దాకా వెళ్ళింది. ఇలాంటి వేడి రాజుకున్న టైంలో వరుణ్ ప్రసంగం ఆజ్యం పోసింది.
నిజానికి తన మనసులో ఏ ఉద్దేశం ఉందో కానీ అర్థం మాత్రం వేరే కోణంలో వెళ్ళిపోయింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరుచుకునే క్రమంలో వరుణ్ చాలా విషయాలే చెప్పాడు. టెన్షన్ లో ఉన్నప్పుడు తెల్లవారుఝామునే చరణ్ ఫోన్ చేయడం, వరస ఫ్లాపుల్లో ఉన్న తనకు కుటుంబం అందించిన మద్దతు ఇలా చాలా చెప్పుకొచ్చాడు. ఎంతసేపూ మీ వాళ్ళ గురించే మాట్లాడతావా అనే ప్రశ్న బయట తనకు ఎదురయ్యిందని అందుకే ఇదంతా చెప్పానని వరుణ్ స్పీచ్ మొదట్లోనే అన్నాడు. కాని దాని కన్నా ఎక్కువ సక్సెస్ గురించి చేసిన కామెంట్లే వైరలయ్యాయి.
సున్నితత్వం విపరీతంగా పెరిగిపోయిన వాతావరణంలో ప్రతిదీ శల్యపరీక్షకు గురవుతోంది. వరుణ్ కి నేరుగా బన్నీని టార్గెట్ చేసే ఆలోచన లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చరణ్ లాగా తను గ్లోబల్ స్టార్ కాదు. ఆ మాటకొస్తే వరస డిజాస్టర్లతో డిఫెన్స్ లో ఉన్నాడు. మట్కా బ్లాక్ బస్టర్ అయితేనే మార్కెట్ నిలబడుతుంది. లేదంటే ఇంకా రిస్క్ లో పడుతుంది. ఇలాంటి టైంలో లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోడనేది కొందరు ఫాన్స్ చేస్తున్న అనాలసిస్. ఊరికే భూతద్దంలో చూస్తున్నారు తప్పించి వరుణ్ కేవలం తన ఫ్యామిలీ గురించి మాత్రమే హైలైట్ చేయబోతే ఇంకోలా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
This post was last modified on November 11, 2024 10:09 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…