నిన్న మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ ఇచ్చిన స్పీచ్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఎవరైతే తమ ఎదుగుదలకు కారణమైన వాళ్ళను మర్చిపోతారో అప్పుడు ఎంత సక్సెస్ సాధించినా వృథా అనే తరహాలో మెగా ప్రిన్స్ అన్న మాటలు ప్రత్యేకంగా ఒకరిని టార్గెట్ చేస్తున్నాయనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. నంద్యాల పర్యటన తర్వాత అల్లు అర్జున్ మీద మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఏకంగా ఆన్ లైన్ వార్స్ కి దారి తీసి పుష్ప 2, గేమ్ ఛేంజర్ గురించి పరస్పరం బురద జల్లుకునే దాకా వెళ్ళింది. ఇలాంటి వేడి రాజుకున్న టైంలో వరుణ్ ప్రసంగం ఆజ్యం పోసింది.
నిజానికి తన మనసులో ఏ ఉద్దేశం ఉందో కానీ అర్థం మాత్రం వేరే కోణంలో వెళ్ళిపోయింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరుచుకునే క్రమంలో వరుణ్ చాలా విషయాలే చెప్పాడు. టెన్షన్ లో ఉన్నప్పుడు తెల్లవారుఝామునే చరణ్ ఫోన్ చేయడం, వరస ఫ్లాపుల్లో ఉన్న తనకు కుటుంబం అందించిన మద్దతు ఇలా చాలా చెప్పుకొచ్చాడు. ఎంతసేపూ మీ వాళ్ళ గురించే మాట్లాడతావా అనే ప్రశ్న బయట తనకు ఎదురయ్యిందని అందుకే ఇదంతా చెప్పానని వరుణ్ స్పీచ్ మొదట్లోనే అన్నాడు. కాని దాని కన్నా ఎక్కువ సక్సెస్ గురించి చేసిన కామెంట్లే వైరలయ్యాయి.
సున్నితత్వం విపరీతంగా పెరిగిపోయిన వాతావరణంలో ప్రతిదీ శల్యపరీక్షకు గురవుతోంది. వరుణ్ కి నేరుగా బన్నీని టార్గెట్ చేసే ఆలోచన లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చరణ్ లాగా తను గ్లోబల్ స్టార్ కాదు. ఆ మాటకొస్తే వరస డిజాస్టర్లతో డిఫెన్స్ లో ఉన్నాడు. మట్కా బ్లాక్ బస్టర్ అయితేనే మార్కెట్ నిలబడుతుంది. లేదంటే ఇంకా రిస్క్ లో పడుతుంది. ఇలాంటి టైంలో లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోడనేది కొందరు ఫాన్స్ చేస్తున్న అనాలసిస్. ఊరికే భూతద్దంలో చూస్తున్నారు తప్పించి వరుణ్ కేవలం తన ఫ్యామిలీ గురించి మాత్రమే హైలైట్ చేయబోతే ఇంకోలా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
This post was last modified on November 11, 2024 10:09 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…