పవన్ కళ్యాణ్ను ఇప్పుడు సినిమా హీరోగా కంటే రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారు జనం. సినిమాలకు ఆయన ఎప్పుడో ప్రాధాన్యం తగ్గించేశారు. కానీ ఆల్రెడీ కమిటైన సినిమాలను పూర్తి చేయక తప్పని పరిస్థితుల్లో కొంచెం వీలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు వివిధ దశల్లో ఆగిపోగా.. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయడానికి పవన్ చూస్తున్నారు.
ఐతే వీటితో పాటు పవన్ కమిటైన మరో సినిమా కూడా ఉంది. వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించాల్సిన సినిమా అది. నాలుగేళ్ల కిందటే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. తర్వాత కొన్నాళ్లు ఆ సినిమా చర్చల్లో ఉంది. కానీ మూడేళ్ల నుంచి ఈ సినిమా గురించి ఏ ఊసూ లేదు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక అయినా పవన్ ఈ సినిమాను టేకప్ చేస్తాడేమో అని అభిమానులు భావిస్తున్నారు.
కానీ పవన్కు వ్యక్తిగతంగానూ మంచి మిత్రుడైన రామ్ తాళ్లూరి.. తాము అనుకున్న సినిమాను ముందుకు తీసుకెళ్లే అవకాశాలు లేవని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పేశారు. పవన్తో చేయాల్సిన సినిమాకు ఐదేళ్ల ముందు అడ్వాన్స్ ఇచ్చామని.. సురేందర్-వంశీ కలిసి మంచి కథ తయారు చేశారని.. ఆ కథ పవన్కు కూడా చాలా నచ్చిందని రామ్ వెల్లడించారు.
ఈ కలయికలో ‘కిక్’ మూవీ రావాల్సిందని.. ఆ సినిమా మిస్ అయినప్పటికీ, ఆ కథ చాలా బాగుందని, దాన్ని మార్చకుండా అలాగే చేద్దామని సురేందర్-వంశీలకు పవన్ చెప్పాడని రామ్ తెలిపారు. కానీ పవన్కు ఉన్న వేరే కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదని.. పవన్ ఈ కథను ఓకే చేసిన సమయంలోనే సురేందర్ రెడ్డి అఖిల్ సినిమా మీదికి వెళ్లాడని.. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం వల్ల తనకు ఈ సినిమా మీద ఆశలు లేవని రామ్ తెలిపారు.
తన చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేయడానికే పవన్కు చాలా సమయం పట్టేలా ఉండడం, వాటి తర్వాత కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసే అవకాశాలు లేకపోవడంతో ఈ చిత్రంపై రామ్ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. సురేందర్ దర్శకత్వంలోనే వేరే హీరోతో మరో కథ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు రామ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘మట్కా’ ఈ నెల 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 9, 2024 6:57 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…