దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆస్వాదించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 కోసం ముంబైలో ఉన్నాడు. వచ్చే జనవరిలోగా తన భాగం మొత్తం పూర్తి చేసేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ప్యాన్ ఇండియా మూవీని త్వరలోనే సెట్స్ కి తీసుకెళ్లాల్సిన నేపథ్యంలో తన 33వ సినిమా దర్శకుడిని తారక్ లాక్ చేసుకున్నాడనే వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఇద్దరు ఇతర బాషల డైరెక్టర్ల (కన్నడ, హిందీ) తో పని చేస్తున్న యంగ్ టైగర్ తాజాగా ఒక తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అతను నెల్సన్ దిలీప్ కుమార్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇద్దరి మధ్య పలుదఫాల చర్చలు జరిగి కథ విషయంలో దాదాపు ఏకాభిప్రాయంకు వచ్చారట. ఎన్టీఆర్ స్వంత నిర్మాణ సంస్థతో పాటు మరో భాగస్వామి ఎవరు ఉండాలనే దాన్ని బట్టి ప్రకటన ఉండొచ్చు. అయితే షూటింగ్ గట్రా వివరాలు తెలియడానికి టైం పట్టొచ్చు. ఎందుకంటే తారక్ వార్ 2 తర్వాత నీల్ మూవీ పూర్తి చేయడానికి ఏడెనిమిది నెలలు పడుతుంది. ఆలోగా నెల్సన్ రజనీకాంత్ తో జైలర్ 2 పూర్తి చేసుకుని రావొచ్చు. దానికి ఎక్కువ టైం పట్టదు. సూపర్ స్టార్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం చెన్నైలోనే తీసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఈ కాంబో కనక నిజమైతే మాస్ ర్యాంపేజ్ చూడొచ్చు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత నార్త్ లో తన మార్కెట్ మరింత పెరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు. హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఫైట్లు, డాన్సుల్లో మ్యాచ్ చేసే విధంగా గొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చాడని అంటున్నారు. అయితే దేవర 2 ఎప్పుడు ఉండొచ్చనే దాని గురించి ఇంకా క్లారిటీ రావడం లేదు. కొరటాల శివ కొంచెం బ్రేక్ తీసుకుని స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తాడనే టాక్ ఉంది కానీ ఖచ్చితంగా ఎప్పుడనేది తెలియడానికి టైం పడుతుంది.
This post was last modified on November 9, 2024 2:52 pm
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…