దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆస్వాదించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 కోసం ముంబైలో ఉన్నాడు. వచ్చే జనవరిలోగా తన భాగం మొత్తం పూర్తి చేసేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ప్యాన్ ఇండియా మూవీని త్వరలోనే సెట్స్ కి తీసుకెళ్లాల్సిన నేపథ్యంలో తన 33వ సినిమా దర్శకుడిని తారక్ లాక్ చేసుకున్నాడనే వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఇద్దరు ఇతర బాషల డైరెక్టర్ల (కన్నడ, హిందీ) తో పని చేస్తున్న యంగ్ టైగర్ తాజాగా ఒక తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అతను నెల్సన్ దిలీప్ కుమార్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇద్దరి మధ్య పలుదఫాల చర్చలు జరిగి కథ విషయంలో దాదాపు ఏకాభిప్రాయంకు వచ్చారట. ఎన్టీఆర్ స్వంత నిర్మాణ సంస్థతో పాటు మరో భాగస్వామి ఎవరు ఉండాలనే దాన్ని బట్టి ప్రకటన ఉండొచ్చు. అయితే షూటింగ్ గట్రా వివరాలు తెలియడానికి టైం పట్టొచ్చు. ఎందుకంటే తారక్ వార్ 2 తర్వాత నీల్ మూవీ పూర్తి చేయడానికి ఏడెనిమిది నెలలు పడుతుంది. ఆలోగా నెల్సన్ రజనీకాంత్ తో జైలర్ 2 పూర్తి చేసుకుని రావొచ్చు. దానికి ఎక్కువ టైం పట్టదు. సూపర్ స్టార్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం చెన్నైలోనే తీసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఈ కాంబో కనక నిజమైతే మాస్ ర్యాంపేజ్ చూడొచ్చు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత నార్త్ లో తన మార్కెట్ మరింత పెరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు. హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఫైట్లు, డాన్సుల్లో మ్యాచ్ చేసే విధంగా గొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చాడని అంటున్నారు. అయితే దేవర 2 ఎప్పుడు ఉండొచ్చనే దాని గురించి ఇంకా క్లారిటీ రావడం లేదు. కొరటాల శివ కొంచెం బ్రేక్ తీసుకుని స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తాడనే టాక్ ఉంది కానీ ఖచ్చితంగా ఎప్పుడనేది తెలియడానికి టైం పడుతుంది.
This post was last modified on November 9, 2024 2:52 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…