కొన్నిసార్లు పెద్ద సినిమాల లీకుల వల్ల ఏదో జరిగిపోతోందని భయపడతాం కానీ మేలు జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. నిన్న రాత్రి నుంచి పుష్ప 2 ది రైజ్ లో స్పెషల్ సాంగ్ కు సంబంధించిన అల్లు అర్జున్, శ్రీలీల పిక్ ఒకటి ఆన్ లైన్ లో విపరీతంగా వైరలయ్యింది. ఎవరు చేశారు, ఎలా బయటికి వచ్చిందని పట్టించుకునే తీరికలో దర్శకుడు సుకుమార్ లేరు కానీ ఆ ఫోటోని చూశాక అభిమానుల ఉత్సాహం పదింతలు పెరిగినట్టు అయ్యింది. పుష్ప 1లో ఊ అంటావా ఊహు అంటావాకు ఏ మాత్రం తగ్గని రీతిలో సమంతాని మరిపించే స్థాయిలో శ్రీలీల స్టెప్పులు వేసి ఉంటుందనే నమ్మకం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఈ సాంగ్ కు సంబంధించిన హుక్ లైన్ గా ‘దెబ్బలు పడతాయి’ అని చెబుతున్నారు కానీ ఎంతవరకు నిజమో విన్నాకే తెలుస్తుంది. త్వరలోనే దీన్ని వదలబోతున్నారు. కాకపోతే ట్రైలర్ లాంచ్ తర్వాత ఈ పాట వస్తుంది. ఏది ఏమైనా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాగా ఇలాంటి లీకులు చేసే డ్యామేజ్ కన్నా ఒక్కోసారి హైప్ పెరిగేందుకు ఉపయోగపడతాయి. కాకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం అప్డేట్స్ ఇవ్వడానికి సమాయత్తమైన నిర్మాణ సంస్థ వీటి వల్ల కొంచెం అప్సెట్ అయ్యే మాటా వాస్తవమే. ఇంకో మూడు రోజుల పాటు పాట చిత్రీకరణ ఉంటుందని మరో బాలీవుడ్ హీరోయిన్ మెరవొచ్చని వినిపిస్తోంది.
రిలీజ్ డేట్ ముంచుకొస్తుండటంతో పుష్ప 2 టీమ్ ఉరుకులు పరుగుల మీద పనులు పూర్తి చేస్తోంది. ఈ నెల 17 నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. అయిదు నగరాల్లో భారీ ఈవెంట్లు ఉంటాయి. బన్నీ, రష్మిక మందన్నతో పాటు ఇతర కీలక తారాగణం ఇంటర్వ్యూలు చివరి వారంలో ప్లాన్ చేస్తున్నారు. హైప్ ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేకపోయినా బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు పబ్లిసిటీని భారీ ఎత్తున డిజైన్ చేస్తున్నారు. కేరళలో బెనెఫిట్ షో టికెట్లు ఇప్పటికే అమ్మడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ చివరి వారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి.
This post was last modified on November 9, 2024 11:12 am
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…