నిన్న విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడోకి యునానిమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చేసింది. రివ్యూల రేటింగ్ ఏకంగా రెండు లోపలే ఇవ్వడం గత కొన్నేళ్లలో ఇలాంటి పెద్ద బ్యానర్ సినిమాకు ఎప్పుడూ జరగలేదు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే 18 పేజెస్ యావరేజ్ ఉన్నా దాని కంటెంట్ స్థాయి కన్నా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆడింది. కానీ స్పైకి అలా జరగలేదు. ఫలితం ముందే గ్రహించడంతో పాటు దర్శక నిర్మాతలతో ఉన్న ఇష్యూ వల్ల రిలీజ్ పట్ల అంత ఆసక్తి చూపించకపోయినా థియేటర్లకు తీసుకొచ్చారు. ఊహించినట్టే బొమ్మ బాక్సాఫీస్ వద్ద తిరగబడింది.
ఫ్లాపులు అందరు హీరోలకు వచ్చేవే కానీ నిఖిల్ ఇకపై ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తన చేతిలో ప్యాన్ ఇండియా సినిమాలున్నాయి. కథలు ఒప్పుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు అలోచించి అడుగులు వేయాలి. స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లాంటివి ఆడవని ముందే గుర్తిస్తే స్టోరీ మార్చుకోవడమో దర్శకుడిని ఛేంజ్ చేయడమో ఏదోకటి చేయొచ్చు. అలా కాకుండా చివరి దశలో తప్పెక్కడ జరిగిందో గుర్తించడం వల్ల లాభం లేదు. ఓటిటి డీల్ అవ్వొచ్చు. నిర్మాతలు సేఫ్ అవ్వొచ్చు. కానీ మార్కెట్ పరంగా రెండు ఫ్లాపులు ఒక్కసారిగా ఇమేజ్ ని కిందపడేయకపోయినా బిజినెస్ మీద ప్రభావం చూపిస్తుంది.
స్వయంభు కోసం విపరీతంగా కష్టపడుతున్న నిఖిల్ దాంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. రామ్ చరణ్ సమర్పణలో రూపొందుతున్న ది ఇండియా హౌస్ సైతం అంతే అంచనాలు మోస్తోంది. ఎంతలేదన్నా ఒక్కోదాని మీద వంద కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. బడ్జెట్ అంత కన్నా ఎక్కువే అవుతోంది. అయినా నిర్మాతలు రిస్క్ చేస్తున్నారంటే కార్తికేయ 2 రూపంలో నిఖిల్ పొందిన గుర్తింపు వల్లే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ప్రమోషన్లు ఏదో మొక్కుబడిగా చేశారు కానీ ఫైనల్ గా రిజల్ట్ మాత్రం ఒక వారమైనా ఆడుతుందా అనిపించేలా నీరసమైన ఓపెనింగ్ తెచ్చుకుంది.
This post was last modified on November 9, 2024 10:45 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…