మొన్నటి ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కి మన ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. సినిమా గొప్ప విజయం సాధించకపోయినా అందులో తన హోమ్లీ లుక్స్ తో పాటు క్యూట్ నటన ఆడియన్స్ కి నచ్చింది. అందుకే తను నటించే చిత్రాల మీద సహజంగానే ఆసక్తి కలిగింది. అయితే సరైన కథల ఎంపిక, ప్లానింగ్ లేకపోతే చేదు ఫలితాలు తప్పవని అమ్మడికి క్రమంగా అర్థమవుతోంది. ప్రశాంత్ నీల్ కథతో రూపొంది ఇటీవలే విడుదలైన ‘బఘీరా’ కన్నడలో ఓ మోస్తరుగా ఆడింది తప్ప మిగిలిన భాషల్లో దారుణంగా బోల్తా కొట్టింది. అసలు ట్రాజెడీ అది కాదు.
సినిమాలో తన పాత్రను ఫస్ట్ హాఫ్ ప్రేమకథకు పరిమితం చేసి రెండో సగంలో మొక్కుబడిగా చూపించి క్లైమాక్స్ లో విలన్ చేతిలో చంపించేశారు. దీంతో ఎలాంటి ప్రభావం లేకుండా క్యారెక్టర్ చప్పగా మిగిలిపోయింది. తాజాగా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’లో దర్శనమిచ్చింది. బాగా ఆలస్యమైన ప్రాజెక్టు అయినప్పటికి ఎంతో కొంత మ్యాటర్ ఉంటే రుక్మిణికి ఉపయోగపడుతుందని అభిమానులు భావించారు. తీరా చూస్తే ఇది కూడా నిరాశపరిచే రివ్యూలు, టాక్ తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసింది. నిఖిల్ హీరో అయినప్పటికీ అసలే మాత్రం బజ్ లేకుండా బలహీనమైన వసూళ్లతో సోసో ఓపెనింగ్ తెచ్చుకుంది.
తర్వాత రుక్మిణి వసంత్ చేయబోయే సినిమా ఏదో కానీ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీలో ఎంపికయ్యిందనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. నిజమా కాదాని మీడియా నేరుగా అడిగితే అటు కాదని చెప్పక ఔననీ చెప్పక మధ్యలో ఊరిస్తోంది. టీమ్ అధికారికంగా ప్రకటించే దాకా తానుగా చెప్పకూడదు కాబట్టి ఇలా తప్పించుకుందేమో. రుక్మిణి వసంత్ మరో సినిమా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘భైరతి రణగల్’. కన్నడతో పాటు తెలుగు తమిళంలో నవంబర్ 15 రిలీజ్ చేయబోతున్నారు. కనీసం ఇదైనా బ్లాక్ బస్టర్ కొట్టి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on November 8, 2024 3:44 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…