మొన్నటి ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కి మన ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. సినిమా గొప్ప విజయం సాధించకపోయినా అందులో తన హోమ్లీ లుక్స్ తో పాటు క్యూట్ నటన ఆడియన్స్ కి నచ్చింది. అందుకే తను నటించే చిత్రాల మీద సహజంగానే ఆసక్తి కలిగింది. అయితే సరైన కథల ఎంపిక, ప్లానింగ్ లేకపోతే చేదు ఫలితాలు తప్పవని అమ్మడికి క్రమంగా అర్థమవుతోంది. ప్రశాంత్ నీల్ కథతో రూపొంది ఇటీవలే విడుదలైన ‘బఘీరా’ కన్నడలో ఓ మోస్తరుగా ఆడింది తప్ప మిగిలిన భాషల్లో దారుణంగా బోల్తా కొట్టింది. అసలు ట్రాజెడీ అది కాదు.
సినిమాలో తన పాత్రను ఫస్ట్ హాఫ్ ప్రేమకథకు పరిమితం చేసి రెండో సగంలో మొక్కుబడిగా చూపించి క్లైమాక్స్ లో విలన్ చేతిలో చంపించేశారు. దీంతో ఎలాంటి ప్రభావం లేకుండా క్యారెక్టర్ చప్పగా మిగిలిపోయింది. తాజాగా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’లో దర్శనమిచ్చింది. బాగా ఆలస్యమైన ప్రాజెక్టు అయినప్పటికి ఎంతో కొంత మ్యాటర్ ఉంటే రుక్మిణికి ఉపయోగపడుతుందని అభిమానులు భావించారు. తీరా చూస్తే ఇది కూడా నిరాశపరిచే రివ్యూలు, టాక్ తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసింది. నిఖిల్ హీరో అయినప్పటికీ అసలే మాత్రం బజ్ లేకుండా బలహీనమైన వసూళ్లతో సోసో ఓపెనింగ్ తెచ్చుకుంది.
తర్వాత రుక్మిణి వసంత్ చేయబోయే సినిమా ఏదో కానీ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీలో ఎంపికయ్యిందనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. నిజమా కాదాని మీడియా నేరుగా అడిగితే అటు కాదని చెప్పక ఔననీ చెప్పక మధ్యలో ఊరిస్తోంది. టీమ్ అధికారికంగా ప్రకటించే దాకా తానుగా చెప్పకూడదు కాబట్టి ఇలా తప్పించుకుందేమో. రుక్మిణి వసంత్ మరో సినిమా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘భైరతి రణగల్’. కన్నడతో పాటు తెలుగు తమిళంలో నవంబర్ 15 రిలీజ్ చేయబోతున్నారు. కనీసం ఇదైనా బ్లాక్ బస్టర్ కొట్టి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…