మొన్నటి ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కి మన ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. సినిమా గొప్ప విజయం సాధించకపోయినా అందులో తన హోమ్లీ లుక్స్ తో పాటు క్యూట్ నటన ఆడియన్స్ కి నచ్చింది. అందుకే తను నటించే చిత్రాల మీద సహజంగానే ఆసక్తి కలిగింది. అయితే సరైన కథల ఎంపిక, ప్లానింగ్ లేకపోతే చేదు ఫలితాలు తప్పవని అమ్మడికి క్రమంగా అర్థమవుతోంది. ప్రశాంత్ నీల్ కథతో రూపొంది ఇటీవలే విడుదలైన ‘బఘీరా’ కన్నడలో ఓ మోస్తరుగా ఆడింది తప్ప మిగిలిన భాషల్లో దారుణంగా బోల్తా కొట్టింది. అసలు ట్రాజెడీ అది కాదు.
సినిమాలో తన పాత్రను ఫస్ట్ హాఫ్ ప్రేమకథకు పరిమితం చేసి రెండో సగంలో మొక్కుబడిగా చూపించి క్లైమాక్స్ లో విలన్ చేతిలో చంపించేశారు. దీంతో ఎలాంటి ప్రభావం లేకుండా క్యారెక్టర్ చప్పగా మిగిలిపోయింది. తాజాగా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’లో దర్శనమిచ్చింది. బాగా ఆలస్యమైన ప్రాజెక్టు అయినప్పటికి ఎంతో కొంత మ్యాటర్ ఉంటే రుక్మిణికి ఉపయోగపడుతుందని అభిమానులు భావించారు. తీరా చూస్తే ఇది కూడా నిరాశపరిచే రివ్యూలు, టాక్ తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసింది. నిఖిల్ హీరో అయినప్పటికీ అసలే మాత్రం బజ్ లేకుండా బలహీనమైన వసూళ్లతో సోసో ఓపెనింగ్ తెచ్చుకుంది.
తర్వాత రుక్మిణి వసంత్ చేయబోయే సినిమా ఏదో కానీ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీలో ఎంపికయ్యిందనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. నిజమా కాదాని మీడియా నేరుగా అడిగితే అటు కాదని చెప్పక ఔననీ చెప్పక మధ్యలో ఊరిస్తోంది. టీమ్ అధికారికంగా ప్రకటించే దాకా తానుగా చెప్పకూడదు కాబట్టి ఇలా తప్పించుకుందేమో. రుక్మిణి వసంత్ మరో సినిమా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘భైరతి రణగల్’. కన్నడతో పాటు తెలుగు తమిళంలో నవంబర్ 15 రిలీజ్ చేయబోతున్నారు. కనీసం ఇదైనా బ్లాక్ బస్టర్ కొట్టి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on November 8, 2024 3:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…