మొన్నటి ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కి మన ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. సినిమా గొప్ప విజయం సాధించకపోయినా అందులో తన హోమ్లీ లుక్స్ తో పాటు క్యూట్ నటన ఆడియన్స్ కి నచ్చింది. అందుకే తను నటించే చిత్రాల మీద సహజంగానే ఆసక్తి కలిగింది. అయితే సరైన కథల ఎంపిక, ప్లానింగ్ లేకపోతే చేదు ఫలితాలు తప్పవని అమ్మడికి క్రమంగా అర్థమవుతోంది. ప్రశాంత్ నీల్ కథతో రూపొంది ఇటీవలే విడుదలైన ‘బఘీరా’ కన్నడలో ఓ మోస్తరుగా ఆడింది తప్ప మిగిలిన భాషల్లో దారుణంగా బోల్తా కొట్టింది. అసలు ట్రాజెడీ అది కాదు.
సినిమాలో తన పాత్రను ఫస్ట్ హాఫ్ ప్రేమకథకు పరిమితం చేసి రెండో సగంలో మొక్కుబడిగా చూపించి క్లైమాక్స్ లో విలన్ చేతిలో చంపించేశారు. దీంతో ఎలాంటి ప్రభావం లేకుండా క్యారెక్టర్ చప్పగా మిగిలిపోయింది. తాజాగా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’లో దర్శనమిచ్చింది. బాగా ఆలస్యమైన ప్రాజెక్టు అయినప్పటికి ఎంతో కొంత మ్యాటర్ ఉంటే రుక్మిణికి ఉపయోగపడుతుందని అభిమానులు భావించారు. తీరా చూస్తే ఇది కూడా నిరాశపరిచే రివ్యూలు, టాక్ తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసింది. నిఖిల్ హీరో అయినప్పటికీ అసలే మాత్రం బజ్ లేకుండా బలహీనమైన వసూళ్లతో సోసో ఓపెనింగ్ తెచ్చుకుంది.
తర్వాత రుక్మిణి వసంత్ చేయబోయే సినిమా ఏదో కానీ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీలో ఎంపికయ్యిందనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. నిజమా కాదాని మీడియా నేరుగా అడిగితే అటు కాదని చెప్పక ఔననీ చెప్పక మధ్యలో ఊరిస్తోంది. టీమ్ అధికారికంగా ప్రకటించే దాకా తానుగా చెప్పకూడదు కాబట్టి ఇలా తప్పించుకుందేమో. రుక్మిణి వసంత్ మరో సినిమా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘భైరతి రణగల్’. కన్నడతో పాటు తెలుగు తమిళంలో నవంబర్ 15 రిలీజ్ చేయబోతున్నారు. కనీసం ఇదైనా బ్లాక్ బస్టర్ కొట్టి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on November 8, 2024 3:44 pm
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…