ప్రసిద్ధ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధం గురించి చేసిన కామెంట్స్ వివాదస్పదమైన విషయం తెలిసిందే. 2027లో వారు విడిపోతారంటూ వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణ సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర విమర్శలకు గురైంది. ఈ వ్యాఖ్యలు పలువురిని ఆగ్రహానికి గురిచేయడంతో, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా రంగంలోకి దిగింది.
అలాగే పలువురు మహిళా హక్కుల సంఘాలు తెలంగాణ మహిళా కమిషన్ను వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలో, మహిళా కమిషన్ గత ఆగస్టులోనే వేణుస్వామిని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే, వేణుస్వామి ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకూడకుండా కోర్టును ఆశ్రయించి తాత్కాలిక స్టే పొందారు.
కానీ ఇటీవల కోర్టు ఈ స్టేను ఎత్తివేస్తూ వేణుస్వామిని మహిళా కమిషన్ ముందు హాజరుకావాల్సిందిగా తీర్మానించింది. దీంతో తాజాగా మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 14న వేణుస్వామిని విచారణకు రావాలని ఆదేశించింది. మరి ఇప్పుడు వేణుస్వామి విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. వేణుస్వామి నాగచైతన్య, శోభితల భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.
ప్రత్యేకించి వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణలో “అతను, ఆమె కలిసి ఎక్కువకాలం ఉండరు” అనే విధంగా, విడాకుల అంశాన్ని ప్రస్తావించడం కొందరిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో వేణుస్వామిపై తీవ్రమైన విమర్శలు, తిట్లు కొనసాగాయి. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విచారణకు రావాలని నోటీసులు పంపినా, ఆయన హాజరు కాకుండా కోర్టు మార్గం ఎంచుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింతగా జనంలో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on November 8, 2024 1:56 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…