ప్రసిద్ధ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధం గురించి చేసిన కామెంట్స్ వివాదస్పదమైన విషయం తెలిసిందే. 2027లో వారు విడిపోతారంటూ వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణ సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర విమర్శలకు గురైంది. ఈ వ్యాఖ్యలు పలువురిని ఆగ్రహానికి గురిచేయడంతో, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా రంగంలోకి దిగింది.
అలాగే పలువురు మహిళా హక్కుల సంఘాలు తెలంగాణ మహిళా కమిషన్ను వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలో, మహిళా కమిషన్ గత ఆగస్టులోనే వేణుస్వామిని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే, వేణుస్వామి ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకూడకుండా కోర్టును ఆశ్రయించి తాత్కాలిక స్టే పొందారు.
కానీ ఇటీవల కోర్టు ఈ స్టేను ఎత్తివేస్తూ వేణుస్వామిని మహిళా కమిషన్ ముందు హాజరుకావాల్సిందిగా తీర్మానించింది. దీంతో తాజాగా మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 14న వేణుస్వామిని విచారణకు రావాలని ఆదేశించింది. మరి ఇప్పుడు వేణుస్వామి విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. వేణుస్వామి నాగచైతన్య, శోభితల భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.
ప్రత్యేకించి వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణలో “అతను, ఆమె కలిసి ఎక్కువకాలం ఉండరు” అనే విధంగా, విడాకుల అంశాన్ని ప్రస్తావించడం కొందరిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో వేణుస్వామిపై తీవ్రమైన విమర్శలు, తిట్లు కొనసాగాయి. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విచారణకు రావాలని నోటీసులు పంపినా, ఆయన హాజరు కాకుండా కోర్టు మార్గం ఎంచుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింతగా జనంలో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on November 8, 2024 1:56 pm
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ ఖైదు విధిస్తూ.. గుంటూరు జిల్లా…
ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కడ బ్రేక్ ఎలా రాసి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఒక బ్లాక్ బస్టర్ జాతకాలనే మార్చేస్తుంది. ఖాళీగా…
పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…