ప్రసిద్ధ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధం గురించి చేసిన కామెంట్స్ వివాదస్పదమైన విషయం తెలిసిందే. 2027లో వారు విడిపోతారంటూ వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణ సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర విమర్శలకు గురైంది. ఈ వ్యాఖ్యలు పలువురిని ఆగ్రహానికి గురిచేయడంతో, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా రంగంలోకి దిగింది.
అలాగే పలువురు మహిళా హక్కుల సంఘాలు తెలంగాణ మహిళా కమిషన్ను వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలో, మహిళా కమిషన్ గత ఆగస్టులోనే వేణుస్వామిని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే, వేణుస్వామి ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకూడకుండా కోర్టును ఆశ్రయించి తాత్కాలిక స్టే పొందారు.
కానీ ఇటీవల కోర్టు ఈ స్టేను ఎత్తివేస్తూ వేణుస్వామిని మహిళా కమిషన్ ముందు హాజరుకావాల్సిందిగా తీర్మానించింది. దీంతో తాజాగా మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 14న వేణుస్వామిని విచారణకు రావాలని ఆదేశించింది. మరి ఇప్పుడు వేణుస్వామి విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. వేణుస్వామి నాగచైతన్య, శోభితల భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.
ప్రత్యేకించి వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణలో “అతను, ఆమె కలిసి ఎక్కువకాలం ఉండరు” అనే విధంగా, విడాకుల అంశాన్ని ప్రస్తావించడం కొందరిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో వేణుస్వామిపై తీవ్రమైన విమర్శలు, తిట్లు కొనసాగాయి. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విచారణకు రావాలని నోటీసులు పంపినా, ఆయన హాజరు కాకుండా కోర్టు మార్గం ఎంచుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింతగా జనంలో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on November 8, 2024 1:56 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…