ప్రసిద్ధ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధం గురించి చేసిన కామెంట్స్ వివాదస్పదమైన విషయం తెలిసిందే. 2027లో వారు విడిపోతారంటూ వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణ సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర విమర్శలకు గురైంది. ఈ వ్యాఖ్యలు పలువురిని ఆగ్రహానికి గురిచేయడంతో, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా రంగంలోకి దిగింది.
అలాగే పలువురు మహిళా హక్కుల సంఘాలు తెలంగాణ మహిళా కమిషన్ను వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలో, మహిళా కమిషన్ గత ఆగస్టులోనే వేణుస్వామిని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే, వేణుస్వామి ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకూడకుండా కోర్టును ఆశ్రయించి తాత్కాలిక స్టే పొందారు.
కానీ ఇటీవల కోర్టు ఈ స్టేను ఎత్తివేస్తూ వేణుస్వామిని మహిళా కమిషన్ ముందు హాజరుకావాల్సిందిగా తీర్మానించింది. దీంతో తాజాగా మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 14న వేణుస్వామిని విచారణకు రావాలని ఆదేశించింది. మరి ఇప్పుడు వేణుస్వామి విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. వేణుస్వామి నాగచైతన్య, శోభితల భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.
ప్రత్యేకించి వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణలో “అతను, ఆమె కలిసి ఎక్కువకాలం ఉండరు” అనే విధంగా, విడాకుల అంశాన్ని ప్రస్తావించడం కొందరిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో వేణుస్వామిపై తీవ్రమైన విమర్శలు, తిట్లు కొనసాగాయి. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విచారణకు రావాలని నోటీసులు పంపినా, ఆయన హాజరు కాకుండా కోర్టు మార్గం ఎంచుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింతగా జనంలో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on November 8, 2024 1:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…