ప్రభాస్ ఏదైనా ప్యాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడంటే దానికి ముందు వెనుకా పోటీ పడేందుకు నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్స్ దెబ్బ తింటాయనే ఉద్దేశంతో సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తారు. బాహుబలి నుంచి కల్కి 2898 ఏడి దాకా చూసుకుంటే డార్లింగ్ కి ఏనాడూ కాంపిటీషన్ రాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 రిలీజ్ కానున్న ది రాజా సాబ్ కు అలాంటి సీనే ఆశించడం సహజం. కానీ ఈసారి అలా జరిగేలా లేదు. పోటీతో సవాల్ విసిరేందుకు ఇతర హీరోలు రెడీ అవుతున్నారు. వాళ్లలో ముందువరసలో ఉన్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్.
తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఇడ్లీ కడాయ్ ని ఏప్రిల్ 10 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఇది రాజా సాబ్ డేట్. అయినా సరే ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడో. నిత్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఇడ్లి కడాయ్ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఒక రాత్రి, తెల్లవారుఝామున జరిగే సంఘటనలతో ధనుష్ దీన్ని మొత్తం సింగల్ లొకేషన్ లో షూట్ చేశాడట. కొన్ని ఇతర ప్రాంతాలు ఉంటాయి కానీ స్టోరీ మొత్తం ఒకే చోట జరిగేలా డిఫరెంట్ గా ఉంటుందట. టైటిల్ ని బట్టి చూస్తే ఇదేదో హోటల్ చుట్టూ జరిగే కథలా అనిపిస్తోంది. టీజర్ చూశాక క్లారిటీ రావొచ్చు.
ధనుష్ రావడం వల్ల ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందేం లేదు కానీ తమిళనాడు, కేరళ ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. ఆ మధ్య రాయన్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కమర్షియల్ గా డీసెంట్ సక్సెస్ అందుకుంది. డైరెక్టర్ గా ధనుష్ ఫెయిలవ్వలేదనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడీ ఇడ్లి కడాయ్ లో అలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకుంటున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాలో భావోద్వేగాలు బలంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలు తక్కువగా ఉండే ఇలాంటి సినిమాలు రాజా సాబ్ లాంటి గ్రాండియర్ హారర్ తో తలపడటం విచిత్రమే.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…