Movie News

ది రాజా సాబ్ పోటీగా ధనుష్ ఇడ్లీ

ప్రభాస్ ఏదైనా ప్యాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడంటే దానికి ముందు వెనుకా పోటీ పడేందుకు నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్స్ దెబ్బ తింటాయనే ఉద్దేశంతో సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తారు. బాహుబలి నుంచి కల్కి 2898 ఏడి దాకా చూసుకుంటే డార్లింగ్ కి ఏనాడూ కాంపిటీషన్ రాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 రిలీజ్ కానున్న ది రాజా సాబ్ కు అలాంటి సీనే ఆశించడం సహజం. కానీ ఈసారి అలా జరిగేలా లేదు. పోటీతో సవాల్ విసిరేందుకు ఇతర హీరోలు రెడీ అవుతున్నారు. వాళ్లలో ముందువరసలో ఉన్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్.

తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఇడ్లీ కడాయ్ ని ఏప్రిల్ 10 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఇది రాజా సాబ్ డేట్. అయినా సరే ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడో. నిత్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఇడ్లి కడాయ్ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఒక రాత్రి, తెల్లవారుఝామున జరిగే సంఘటనలతో ధనుష్ దీన్ని మొత్తం సింగల్ లొకేషన్ లో షూట్ చేశాడట. కొన్ని ఇతర ప్రాంతాలు ఉంటాయి కానీ స్టోరీ మొత్తం ఒకే చోట జరిగేలా డిఫరెంట్ గా ఉంటుందట. టైటిల్ ని బట్టి చూస్తే ఇదేదో హోటల్ చుట్టూ జరిగే కథలా అనిపిస్తోంది. టీజర్ చూశాక క్లారిటీ రావొచ్చు.

ధనుష్ రావడం వల్ల ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందేం లేదు కానీ తమిళనాడు, కేరళ ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. ఆ మధ్య రాయన్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కమర్షియల్ గా డీసెంట్ సక్సెస్ అందుకుంది. డైరెక్టర్ గా ధనుష్ ఫెయిలవ్వలేదనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడీ ఇడ్లి కడాయ్ లో అలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకుంటున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాలో భావోద్వేగాలు బలంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలు తక్కువగా ఉండే ఇలాంటి సినిమాలు రాజా సాబ్ లాంటి గ్రాండియర్ హారర్ తో తలపడటం విచిత్రమే.

This post was last modified on November 8, 2024 12:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

50 minutes ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

2 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

2 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

4 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

4 hours ago

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…

4 hours ago