టాలీవుడ్లో మరోసారి చిన్న సినిమాల జాతరకు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమాలు తక్కువే. ఉన్న వాటిలో కొంచెం స్థాయి ఉన్న సినిమా అంటే.. నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’నే. నిఖిల్కు ‘స్వామి రారా’ లాంటి కెరీర్ను మలుపు తిప్పే సినిమాను అందించిన సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
ఎప్పుడో కొవిడ్ టైంలో మొదలైన ఈ సినిమా పూర్తి కావడం, రిలీజ్ అవ్వడంలో ఆలస్యం అయింది. సడెన్గా ఇప్పుడీ చిత్రాన్ని విడుదలక సిద్ధం చేయడంతో అనుకున్న హైప్ రాలేదు. ప్రమోషన్ల పరంగా కూడా పెద్దగా హడావుడి కనిపించలేదు. ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదీ చిత్రానికి. నిఖిల్, సుధీర్ వర్మలతో పాటు ఇందులో కథానాయికగా నటించిన ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ సినిమాను కొంతమేర ప్రమోట్ చేశారు.
లో బజ్తో రిలీజవుతున్న ఈ సినిమా ట్రైలర్తో కొంత ఆకట్టుకుంది. మరి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సర్ప్రైజ్ హిట్ అవుతుందేమో చూడాలి. దీంతో పాటుగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె నటించిన ‘జితేందర్ రెడ్డి’ కొంత ప్రామిసింగ్గా కనిపిస్తోంది. దివంగత తెలంగాణ స్టూడెంట్ లీడర్ జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీని ప్రోమోలు ప్రామిసింగ్గా కనిపించాయి.
‘ధూమ్ ధామ్’ అనే కామెడీ ఎంటర్టైనర్ కూడా ఈ వారం రేసులో నిలిచింది. చేతన్ మద్దినేని-హెబ్బా పటేల్ ఇందులో జంటగా నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు హైలైట్గా చెబుతున్నారు. మంచు లక్ష్మి ప్రత్యేక పాత్ర పోషించిన ఫాంటసీ మూవీ ‘ఆదిపర్వం’తో పాటు తమిళ అనువాదం ‘బ్లడీ బెగ్గర్’ ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్లు.
ఇవి కాక జాతర, రహస్యం ఇదం జగత్, ఈసారైనా, వంచన, జువెల్ థీఫ్ అంటూ ఏవో చిన్నా చితకా సినిమాలు కూడా ఈ వారం రేసులో ఉన్నాయి. మరి రాశిలో ఘనంగా కనిపిస్తున్న ఈ సినిమాల్లో వాసి ఏమాత్రమో చూడాలి.
This post was last modified on November 8, 2024 10:34 am
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…