టాలీవుడ్లో మరోసారి చిన్న సినిమాల జాతరకు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమాలు తక్కువే. ఉన్న వాటిలో కొంచెం స్థాయి ఉన్న సినిమా అంటే.. నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’నే. నిఖిల్కు ‘స్వామి రారా’ లాంటి కెరీర్ను మలుపు తిప్పే సినిమాను అందించిన సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
ఎప్పుడో కొవిడ్ టైంలో మొదలైన ఈ సినిమా పూర్తి కావడం, రిలీజ్ అవ్వడంలో ఆలస్యం అయింది. సడెన్గా ఇప్పుడీ చిత్రాన్ని విడుదలక సిద్ధం చేయడంతో అనుకున్న హైప్ రాలేదు. ప్రమోషన్ల పరంగా కూడా పెద్దగా హడావుడి కనిపించలేదు. ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదీ చిత్రానికి. నిఖిల్, సుధీర్ వర్మలతో పాటు ఇందులో కథానాయికగా నటించిన ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ సినిమాను కొంతమేర ప్రమోట్ చేశారు.
లో బజ్తో రిలీజవుతున్న ఈ సినిమా ట్రైలర్తో కొంత ఆకట్టుకుంది. మరి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సర్ప్రైజ్ హిట్ అవుతుందేమో చూడాలి. దీంతో పాటుగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె నటించిన ‘జితేందర్ రెడ్డి’ కొంత ప్రామిసింగ్గా కనిపిస్తోంది. దివంగత తెలంగాణ స్టూడెంట్ లీడర్ జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీని ప్రోమోలు ప్రామిసింగ్గా కనిపించాయి.
‘ధూమ్ ధామ్’ అనే కామెడీ ఎంటర్టైనర్ కూడా ఈ వారం రేసులో నిలిచింది. చేతన్ మద్దినేని-హెబ్బా పటేల్ ఇందులో జంటగా నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు హైలైట్గా చెబుతున్నారు. మంచు లక్ష్మి ప్రత్యేక పాత్ర పోషించిన ఫాంటసీ మూవీ ‘ఆదిపర్వం’తో పాటు తమిళ అనువాదం ‘బ్లడీ బెగ్గర్’ ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్లు.
ఇవి కాక జాతర, రహస్యం ఇదం జగత్, ఈసారైనా, వంచన, జువెల్ థీఫ్ అంటూ ఏవో చిన్నా చితకా సినిమాలు కూడా ఈ వారం రేసులో ఉన్నాయి. మరి రాశిలో ఘనంగా కనిపిస్తున్న ఈ సినిమాల్లో వాసి ఏమాత్రమో చూడాలి.
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…