దర్శక ధీరుడు రాజమౌళి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలతో అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘కల్కి’ మూవీలో ఆయన చేసిన క్యామియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తన సినిమాల చివర్లో మెరవడం ఆయనకు అలవాటే. గతంలో ‘అమృతం’ సీరియల్లోనూ ఆయన క్యామియో చేశారు.
ఐతే రాజమౌళి వేరే ఓ సినిమాలో కొంచెం లెంగ్త్ ఉన్న క్యామియో చేసిన విషయం జనం మరిచిపోయి ఉంటారు. ఆ చిత్రమే.. మజ్ను. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమా ఆరంభంలో, చివర్లో రాజమౌళి తళుక్కున మెరిశారు. ఈ సినిమా చేసే సమయానికి జక్కన్న ‘బాహుబలి’ షూట్ నడుస్తోంది. ఆయన ఇందులో ఆ సినిమా తీస్తున్న దర్శకుడు రాజమౌళిగానే కనిపించడం విశేషం. నాని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కనిపిస్తాడు.
ఐతే ఈ చిత్రంలో రాజమౌళితో క్యామియో చేయించాలన్న ఆలోచన దర్శకుడిది కాదట. నానిదేనట. ముందు నాని పాత్రను ఒక సినిమా రైటర్గా అనుకున్నామని.. కానీ నానీనే అసిస్టెంట్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పాడని.. అంతే కాక రాజమౌళి దగ్గర ఏడీగా పెడితే బాగుంటుందని కూడా సూచించాడని విరించి వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
తర్వాత నానీనే రాజమౌళితో మాట్లాడి క్యామియో పాత్ర చేయడానికి ఒప్పించినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో రామోజీ ఫిలిం సిటీలో ‘బాహుబలి’ షూట్ జరుగుతోందని.. అక్కడికే తాము వెళ్లి సన్నివేశాలు చిత్రీకరించామని.. ఐతే సినిమాలో వాడిన రథాన్ని తమ కోసం ఇవ్వలేని పరిస్థితుల్లో తామే వేరుగా ఓ రథం చేయించి దాంతో ఆ సన్నివేశం చిత్రీకరించామని విరించి వెల్లడించాడు. ఆ సీన్ షూట్ చేస్తున్నపుడు టేక్ ఓకేనా అని రాజమౌళి మళ్లీ మళ్లీ అడిగేవాడని.. కానీ అంత గొప్ప దర్శకుడికి తాను చెప్పడం ఏంటి అని ఆయన చేసింది ఓకే చేసేవాడినని వివరించి తెలిపాడు.
This post was last modified on November 7, 2024 9:48 pm
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…