దర్శక ధీరుడు రాజమౌళి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలతో అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘కల్కి’ మూవీలో ఆయన చేసిన క్యామియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తన సినిమాల చివర్లో మెరవడం ఆయనకు అలవాటే. గతంలో ‘అమృతం’ సీరియల్లోనూ ఆయన క్యామియో చేశారు.
ఐతే రాజమౌళి వేరే ఓ సినిమాలో కొంచెం లెంగ్త్ ఉన్న క్యామియో చేసిన విషయం జనం మరిచిపోయి ఉంటారు. ఆ చిత్రమే.. మజ్ను. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమా ఆరంభంలో, చివర్లో రాజమౌళి తళుక్కున మెరిశారు. ఈ సినిమా చేసే సమయానికి జక్కన్న ‘బాహుబలి’ షూట్ నడుస్తోంది. ఆయన ఇందులో ఆ సినిమా తీస్తున్న దర్శకుడు రాజమౌళిగానే కనిపించడం విశేషం. నాని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కనిపిస్తాడు.
ఐతే ఈ చిత్రంలో రాజమౌళితో క్యామియో చేయించాలన్న ఆలోచన దర్శకుడిది కాదట. నానిదేనట. ముందు నాని పాత్రను ఒక సినిమా రైటర్గా అనుకున్నామని.. కానీ నానీనే అసిస్టెంట్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పాడని.. అంతే కాక రాజమౌళి దగ్గర ఏడీగా పెడితే బాగుంటుందని కూడా సూచించాడని విరించి వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
తర్వాత నానీనే రాజమౌళితో మాట్లాడి క్యామియో పాత్ర చేయడానికి ఒప్పించినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో రామోజీ ఫిలిం సిటీలో ‘బాహుబలి’ షూట్ జరుగుతోందని.. అక్కడికే తాము వెళ్లి సన్నివేశాలు చిత్రీకరించామని.. ఐతే సినిమాలో వాడిన రథాన్ని తమ కోసం ఇవ్వలేని పరిస్థితుల్లో తామే వేరుగా ఓ రథం చేయించి దాంతో ఆ సన్నివేశం చిత్రీకరించామని విరించి వెల్లడించాడు. ఆ సీన్ షూట్ చేస్తున్నపుడు టేక్ ఓకేనా అని రాజమౌళి మళ్లీ మళ్లీ అడిగేవాడని.. కానీ అంత గొప్ప దర్శకుడికి తాను చెప్పడం ఏంటి అని ఆయన చేసింది ఓకే చేసేవాడినని వివరించి తెలిపాడు.
This post was last modified on November 7, 2024 9:48 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…