దర్శక ధీరుడు రాజమౌళి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలతో అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘కల్కి’ మూవీలో ఆయన చేసిన క్యామియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తన సినిమాల చివర్లో మెరవడం ఆయనకు అలవాటే. గతంలో ‘అమృతం’ సీరియల్లోనూ ఆయన క్యామియో చేశారు.
ఐతే రాజమౌళి వేరే ఓ సినిమాలో కొంచెం లెంగ్త్ ఉన్న క్యామియో చేసిన విషయం జనం మరిచిపోయి ఉంటారు. ఆ చిత్రమే.. మజ్ను. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమా ఆరంభంలో, చివర్లో రాజమౌళి తళుక్కున మెరిశారు. ఈ సినిమా చేసే సమయానికి జక్కన్న ‘బాహుబలి’ షూట్ నడుస్తోంది. ఆయన ఇందులో ఆ సినిమా తీస్తున్న దర్శకుడు రాజమౌళిగానే కనిపించడం విశేషం. నాని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కనిపిస్తాడు.
ఐతే ఈ చిత్రంలో రాజమౌళితో క్యామియో చేయించాలన్న ఆలోచన దర్శకుడిది కాదట. నానిదేనట. ముందు నాని పాత్రను ఒక సినిమా రైటర్గా అనుకున్నామని.. కానీ నానీనే అసిస్టెంట్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పాడని.. అంతే కాక రాజమౌళి దగ్గర ఏడీగా పెడితే బాగుంటుందని కూడా సూచించాడని విరించి వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
తర్వాత నానీనే రాజమౌళితో మాట్లాడి క్యామియో పాత్ర చేయడానికి ఒప్పించినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో రామోజీ ఫిలిం సిటీలో ‘బాహుబలి’ షూట్ జరుగుతోందని.. అక్కడికే తాము వెళ్లి సన్నివేశాలు చిత్రీకరించామని.. ఐతే సినిమాలో వాడిన రథాన్ని తమ కోసం ఇవ్వలేని పరిస్థితుల్లో తామే వేరుగా ఓ రథం చేయించి దాంతో ఆ సన్నివేశం చిత్రీకరించామని విరించి వెల్లడించాడు. ఆ సీన్ షూట్ చేస్తున్నపుడు టేక్ ఓకేనా అని రాజమౌళి మళ్లీ మళ్లీ అడిగేవాడని.. కానీ అంత గొప్ప దర్శకుడికి తాను చెప్పడం ఏంటి అని ఆయన చేసింది ఓకే చేసేవాడినని వివరించి తెలిపాడు.
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…