సరిగ్గా ఇంకో వారం రోజుల్లో కంగువ విడుదల కానుంది. సూర్య సినిమా అంటే సహజంగానే అంచనాలు ఉంటాయి కానీ ఈసారి కోలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీస్ లో ఒకటి చేయడంతో పరిస్థితి ఎప్పుడు లేనంత తీవ్రంగా ఉంది. టీమ్ చాలా నమ్మకం వ్యక్తం చేస్తోంది. తమిళంతో సమానంగా తెలుగులోనూ వసూళ్ల సునామి ఖాయమనే ధీమాతో ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే తెల్లవారుఝాము నాలుగు గంటల ప్రీమియర్లతో పాటు టికెట్ రేట్ల పెంపు కోసం అప్లికేషన్ పెడుతోంది. తమిళనాడు కంటే ముందే ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ లో బెనిఫిట్ షోలు పడతాయి కాబట్టి టాక్ చాలా కీలకం కానుంది.
ఇప్పటిదాకా వదిలిన ప్రమోషనల్ కంటెంట్ లో ట్రైలర్ బాగుంది కానీ మరీ బాహుబలి రేంజ్ లో స్పందన రాలేదు. మెగా విజువల్ గ్రాండియర్ అనే నమ్మకాన్ని కలిగించగలిగారు. రిలీజ్ కోసం ఇంకో వెర్షన్ కట్ చేసి ఉంటే బాగుండేదన్న కామెంట్ల నేపథ్యంలో టీమ్ ఇంకో రెండు మూడు రోజుల్లో ఆ లాంఛనం పూర్తి చేయబోతోంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి, బోయపాటి శీను అతిథులుగా వస్తున్నారు. ప్రభాస్ ని ట్రై చేశారు కానీ డేట్ సమస్య వల్ల కుదరలేదని తెలిసింది. ఏదైనా చివరి నిమిషంలో అనూహ్యంగా జరిగితే డార్లింగ్-సూర్య కాంబోని స్టేజీ మీద చూడొచ్చు.
మెడ మీద అంచనాల కత్తిని మోయడం కంగువకు సవాలే. అసలే పోటీ ఉంది. వరుణ్ తేజ్ మట్కా, అశోక్ గల్లాగా దేవకీనందన వాసుదేవ చాలా ధీమాగా పబ్లిసిటీ చేసుకుని నవంబర్ 14నే క్లాష్ అయ్యేందుకు సై అంటున్నాయి. అటుపక్క బాలీవుడ్ లో శబర్మతి రిపోర్ట్ మీద బజ్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో కంగువకి ఎక్స్ ట్రాడినరీ టాక్ రావాలి. దర్శకుడు సిరుతై శివ ట్రాక్ రికార్డు కన్నా సూర్య ఇమేజ్, భారీ ఖర్చు ఆడియన్స్ ని దీనివైపు చూసేలా చేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అటవీ నేపధ్యం ఊహించని స్థాయిలో ఉంటాయట. దేవరలాగా ఇది బ్లాక్ బస్టర్ అయితే కంగువ 2 వైపు అడుగులు వేగంగా పడతాయి.
This post was last modified on November 7, 2024 10:18 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…