ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్. ఇది పుష్ప 2 ది రూల్ కు అక్షరాలా వర్తిస్తోంది. విడుదలకు ఇంకా నెల రోజులు ఉండగానే ఓవర్సీస్ లో రికార్డుల ఊచకోత మొదలుపెట్టింది. ఇప్పటిదాకా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 4 లక్షల 10 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసిన పుష్ప 2 మొదటి భాగం ఫుల్ రన్ (4 లక్షల డాలర్లు) ని ఇంత ముందుగా దాటేయడం సరికొత్త రికార్డు. దీన్ని బట్టే బజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఓపెన్ చేసిన రెండు వేల ఏడు వందల యాభై షోల నుంచి నమోదైన డేటా ఇది.
ఏడు వందలకు పైగా లొకేషన్లలో ఇప్పటికే పదిహేను వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా బోలెడు షోలు జోడించాల్సి ఉంది. రోజులు గడిచే కొద్దీ నెంబర్లు షాక్ ఇచ్చే రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇంకా చాలా సమయం ఉంది కనక ప్రీమియర్ల క్లోజింగ్ అంకె బయ్యర్ల ఊహకు అందటం లేదు. ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడిలకు దగ్గరగా వెళ్లినా లేదా దాటేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదని జోస్యం చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే అదే జరిగేలా ఉంది. నార్త్ అమెరికాలోనే ఇలా ఉంటె ఇక కెనడా తదితర దేశాల్లో టికెట్ల అమ్మకాలు మొదలైతే జరిగే అరాచకం మాటలకు అందదేమో.
ఇక తెలుగు రాష్ట్రాలలోనూ అలాంటి సీనే రిపీట్ అయ్యేలా ఉంది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి థర్డ్ పార్టీ కొనుగోలుదారులు భారీ మొత్తాలు ఇచ్చి సెంటర్ల వారీగా కొనేసుకుంటున్నారు. ఇది అందరికి లాభదాయకంగా ఉంటోంది. తెల్లవారుఝాము నుంచే షోలు ఉంటాయి కనక దానికి తగ్గట్టే జనం పోటెత్తడం ఖాయం. దేవరని మించిన భీభత్సం అల్లు అర్జున్ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ వచ్చాక నార్త్ నుంచి సౌత్ దాకా పుష్ప 2నే హాట్ టాపిక్ కావడం ఖాయమని యూనిట్ టాక్. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం బాలన్స్ ఉన్న ఐటెం సాంగ్ చిత్రీకరణ ప్లానింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంకో వారంలోపే అయిపోతుంది.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…