పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కీడా కోలా మాత్రమే డైరెక్ట్ చేశాడు. నటుడిగా బిజీగా మారిపోతూ పలు బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకుని ఇప్పుడు ఏకంగా సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఏఆర్ సంజీవ్ దర్శకత్వంలో 35 చిన్న కథ కాదు నిర్మాతలు రూపొందిస్తున్న ఎంటర్ టైనర్ కి ఓం శాంతి శాంతి శాంతిః టైటిల్ లాక్ చేసినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఖరారైనట్టు తెలిసింది.
దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఇది మలయాళం సూపర్ హిట్ జయ జయ జయ జయహే రీమేక్. పెళ్లయ్యాక కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలనుకున్న అమ్మాయికి భర్తే అడ్డంకిగా మారతాడు. ముందు ఒప్పుకుని తర్వాత ప్లేట్ ఫిరాయించి భార్య మీద పెత్తనం చేయడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఆసక్తికరమైన సంఘటనలు జరిగి వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. ఈగోలు, కోపాలతో ఊగిపోయే జంట మధ్య శాంతి ఎలా ఏర్పడిందనే పాయింట్ తో ఒరిజినల్ వెర్షన్ తీశారు.
గోదావరి బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న ఈ పల్లెటూరి డ్రామాలో ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కనక హిట్ అయితే తరుణ్ భాస్కర్ కు మరో ప్రమోషన్ దక్కినట్టే. ఈ నగరానికి ఏమైంది 2 త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్న తరుణ్ భాస్కర్ దీన్ని కూడా ఇదే బ్యానర్ లో చేయబోతున్నట్టు టాక్. మొత్తానికి డైరెక్టర్ గా కన్నా యాక్టర్ గా చాలా బిజీ అవుతున్న ఈ క్రియేటివ్ టాలెంట్ వీలైనంత ఎక్కువ సినిమాలు తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతేసి గ్యాప్ తో ఆలస్యం చేస్తే ఎలానే వాళ్ళ ప్రశ్న సబబే. ఓం శాంతి శాంతి శాంతిః కనక పెద్ద సక్సెస్ అయితే నటుడిగా ఇంకెంత బిజీగా మారిపోతాడో.
This post was last modified on November 5, 2024 2:53 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…