పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కీడా కోలా మాత్రమే డైరెక్ట్ చేశాడు. నటుడిగా బిజీగా మారిపోతూ పలు బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకుని ఇప్పుడు ఏకంగా సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఏఆర్ సంజీవ్ దర్శకత్వంలో 35 చిన్న కథ కాదు నిర్మాతలు రూపొందిస్తున్న ఎంటర్ టైనర్ కి ఓం శాంతి శాంతి శాంతిః టైటిల్ లాక్ చేసినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఖరారైనట్టు తెలిసింది.
దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఇది మలయాళం సూపర్ హిట్ జయ జయ జయ జయహే రీమేక్. పెళ్లయ్యాక కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలనుకున్న అమ్మాయికి భర్తే అడ్డంకిగా మారతాడు. ముందు ఒప్పుకుని తర్వాత ప్లేట్ ఫిరాయించి భార్య మీద పెత్తనం చేయడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఆసక్తికరమైన సంఘటనలు జరిగి వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. ఈగోలు, కోపాలతో ఊగిపోయే జంట మధ్య శాంతి ఎలా ఏర్పడిందనే పాయింట్ తో ఒరిజినల్ వెర్షన్ తీశారు.
గోదావరి బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న ఈ పల్లెటూరి డ్రామాలో ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కనక హిట్ అయితే తరుణ్ భాస్కర్ కు మరో ప్రమోషన్ దక్కినట్టే. ఈ నగరానికి ఏమైంది 2 త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్న తరుణ్ భాస్కర్ దీన్ని కూడా ఇదే బ్యానర్ లో చేయబోతున్నట్టు టాక్. మొత్తానికి డైరెక్టర్ గా కన్నా యాక్టర్ గా చాలా బిజీ అవుతున్న ఈ క్రియేటివ్ టాలెంట్ వీలైనంత ఎక్కువ సినిమాలు తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతేసి గ్యాప్ తో ఆలస్యం చేస్తే ఎలానే వాళ్ళ ప్రశ్న సబబే. ఓం శాంతి శాంతి శాంతిః కనక పెద్ద సక్సెస్ అయితే నటుడిగా ఇంకెంత బిజీగా మారిపోతాడో.
This post was last modified on November 5, 2024 2:53 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…