తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాస్ అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. అనూహ్యంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. సంక్రాంతికి రావాలని అభిమానులు కోరుకుంటే పోటీ దృష్ట్యా అనవసరంగా ఓపెనింగ్స్ దెబ్బ తీసుకోవడం ఇష్టం లేని గీత ఆర్ట్స్ నాగచైతన్య కెరీర్ లో మొదటి ప్యాన్ ఇండియా సినిమాకు మంచి వెల్కమ్ దక్కేలా ప్లాన్ చేసుకుంటోంది. జనవరి చివరి వారం ఒక ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ పలు కారణాల దాన్ని కాదనుకుని మరుసటి నెలకు షిఫ్ట్ అయ్యారు.
ఇదిలా ఉండగా ఇదే ఫిబ్రవరిలో కుబేర రావొచ్చని తాజా లీక్. ధనుష్ హీరో అయినప్పటికీ నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండటంతో మల్టీస్టారర్ లుక్ వచ్చేసింది. లీడర్ తర్వాత శేఖర్ కమ్ముల తీసుకున్న సీరియస్ సబ్జెక్టు ఇదే. ఒక బిచ్చగాడు వ్యవస్థను శాశించే శక్తిగా ఎలా మారాడనే పాయింట్ తో రూపొందిందని సమాచారం. ఆ నెల 14 లేదా 21 రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తండేల్ 7 వస్తుంది కాబట్టి తండ్రి కొడుకుల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండటం అవసరం. అదే నిజమైన పక్షంలో 21 బాగుంటుంది. ఇంకా లాక్ చేయలేదు.
ఈ నెల పదిహేనో తేదీ జరగబోయే టీజర్ లాంచ్ లో దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు. ఇప్పటికే కొంచెం లేట్ అయిన కుబేర మీద భారీ బడ్జెట్ పెట్టారు. రష్మిక మందన్న హీరోయిన్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఊహించని ట్విస్టులతో శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లే షాక్ ఇచ్చేలా ఉంటుందని వినికిడి. తండేల్ నిర్ణయం విన్న తర్వాత కుబేరను ఎప్పుడు లాక్ చేయాలనేది డిసైడ్ చేయొచ్చు. చైతు ఫిబ్రవరి అంటేనే ఫీలవుతున్న ఫ్యాన్స్ ఒకవేళ నాగార్జున కూడా సేమ్ అంటే ఇంకెలా తీసుకుంటారో. మార్చి వైపు చూడొచ్చు కానీ శివరాత్రి దాకా ఆగాల్సి ఉంటుంది. కానీ ఆ స్లాట్ లో తమ్ముడు, హరిహర వీరమల్లు, ఎల్ 2 ఎంపూరన్ ఉన్నాయి.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…