యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం టాప్ హిట్స్ లో చోటు దక్కించుకున్న దేవర పార్ట్ 1 థియేటర్ రిలీజ్ జరుపుకున్న నలభై రెండు రోజుల తర్వాత ఓటిటిలో వచ్చేస్తోంది. నిజానికి ఎనిమిది వారాల తర్వాత కానీ రాదనే ప్రచారం తొలుత జరిగింది. కానీ నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం నెలన్నరలోపే రాసుకోవడంతో అభిమానులు ఊహించిన దానికన్నాముందుగానే డిజిటల్ లో వచ్చేస్తోంది. ఏడో తేదీ అర్థరాత్రి నుంచే చూసుకోవచ్చు. అఫీషియల్ గా నెట్ ఫ్లిక్స్ యాప్ లో ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ కాబోతున్నట్టు చెప్పడంతో డౌట్లు తీరిపోయాయి.
ఇంత పెద్ద హిట్టు కనీసం యాభై రోజుల తర్వాత ఓటిటికి వచ్చి ఉండాల్సిందనే కామెంట్స్ ఉన్నాయి కానీ ప్రాక్టికల్ గా చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. దేవర ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. మెయిన్ సెంటర్స్ లో 50 రోజులు ఆడటం ఖరారయ్యింది కానీ మిగిలిన చోట్ల కొత్త సినిమాల వల్ల తీసేశారు. దసరా, దీపావళికి బోలెడు రిలీజులు ఉండటం వల్ల స్క్రీన్ల సర్దుబాటు కోసం దేవరకు సెలవు ఇచ్చేశారు. పైగా మొదటి మూడు వారాల్లోనే లాభాల్లోకి తీసుకొచ్చిన దేవర ఆపై నెమ్మదించినా, రన్ లేకపోయినా నష్టమేమీ లేదు. కాకపోతే గతంలో హనుమాన్, ఆర్ఆర్ఆర్ లాంటివి ఫిఫ్టీ డేస్ తర్వాతే ఓటిటికి వచ్చాయి.
నెట్ ఫ్లిక్స్ సంస్థ దేవర వ్యూస్ మీద భారీ అంచనాలతో ఉంది. ఇప్పటిదాకా ఆ ప్లాట్ ఫార్మ్ లో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్, గంగుబాయ్ కటియావాడి, మహారాజ్, గుంటూరు కారం మైలురాళ్ళను దాటుతుందనే నమ్మకంతో ఉంది. దాన్ని బట్టే దేవర 2 అంతకన్నా పెద్ద మొత్తంతో సొంతం చేసుకోవడానికి దారి సుగమం అవుతుంది. ఆల్రెడీ చూసినవాళ్ళైనా సరే దేవర విశ్వరూపం, అనిరుధ్ రవిచందర్ సంగీతం కోసం మళ్ళీ షోలు వేసుకోవడం ఖాయం. దేవరతో పాటు నవంబర్ 8న రజనీకాంత్ వెట్టయన్ ది హంటర్ (అమెజాన్ ప్రైమ్), టోవినో థామస్ ఏఆర్ఎం (డిస్నీ హాట్ స్టార్) ఒకేసారి రాబోతున్నాయి.
This post was last modified on November 5, 2024 11:19 am
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…
ఇటీవల టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలవడం…
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్కు మద్దతు పలికిన…
నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…