Movie News

మహేష్‌ సినిమా ఆగిపోయిందంటే ఒప్పుకోవట్లేదు

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సింది. వంశీ ఈ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు ప్రస్తావించాడు కూడా. అయితే ఏమైందో ఏమో కాని తనకు ‘మహర్షి’ వంటి మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లిని కాదని, ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశురామ్‌కి ఛాన్స్ ఇచ్చాడు సూపర్ స్టార్. అయితే మహేష్‌తో సినిమా లేట్ కావచ్చు కానీ ఆగిపోలేదని అంటున్నాడు వంశీ పైడిపల్లి.

మహేష్ కెరీర్‌లో 25వ సినిమాగా రూపొందిన ‘మహర్షి’లో కాలేజ్ కుర్రాడిగా, యంగ్ బిజినెస్ మ్యాన్‌గా, స్నేహితుడి కోసం ఏం చేయడానికైన వెనుకాడని ఫ్రెండ్‌గా అద్భుతంగా నటించి, మెప్పించాడు మహేష్. ఈ మూవీ టైంలోనే మహేష్‌కి, వంశీ పైడిపల్లికి మంచి సింక్ కుదిరిందని, ఆ బంధంతోనే సూపర్ స్టార్, తన 27వ సినిమా కూడా ఈ డైరెక్టర్‌తోనే కమిట్ అయ్యాడని వార్తలు వచ్చాయి.

అయితే వంశీ పైడిపల్లి చెప్పిన స్క్రిప్ట్‌తో పెద్దగా ఇంప్రెస్ కాని మహేష్… ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల కథలు విని, చివరికి పరుశురామ్‌తో సినిమాను కన్ఫార్మ్ చేశాడు. అయితే మహేష్‌తో సినిమా రద్దు కాలేదని, త్వరలోనే సూపర్ స్టార్‌తో సినిమా చేస్తానంటున్నాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. కాని మూవీ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

ఒకవేళ నిజంగానే వంశీ కనుక మహేష్‌‌ను మెప్పించే స్క్రిప్ట్ పట్టినా, పరుశురామ్‌తో, రాజమౌళితో మూవీ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయకతప్పదు. లాక్‌డౌన్ తర్వాత పరుశురామ్ మూవీ ప్రారంభమైనా, రాజమౌళి- మహేష్ మూవీ పూర్తవ్వాలంటే ఎంతలేదన్నా మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. మరి వంశీ పైడిపల్లి, మహేష్ కోసం అన్నేళ్ళు వెయిట్ చేస్తాడా?

This post was last modified on April 29, 2020 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

10 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

1 hour ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

4 hours ago