మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క దర్శనం జరిగి ఏడాదికి పైగానే అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్లలో స్వీటీ నేరుగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఒకటి రెండు వీడియోలతో ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది తప్ప షూట్ చేసిన ఇంటర్వ్యూ సైతం ఎందుకో స్ట్రీమింగ్ జరగలేదు. ఏదైతేనేం సూపర్ హిట్ దక్కిన ఆనందం అభిమానులకు మిగిలింది.
తర్వాత అనుష్క వైపు ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయాయి. ఏ సినిమా చేస్తుంది, కాంబినేషన్ లాంటి వివరాలు చాలా రోజులు బయటికి రాలేదు. కానీ తెలుగు, మలయాళం కలిపి తను రెండు కమిట్మెంట్లు ఇచ్చిన సంగతి కొన్ని నెలల క్రితం రివీలయ్యింది.
వాటిలో మొదటిది క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఘాటీ. హరిహరవీరమల్లు ఆలస్యం అవుతుండటంతో దాన్నుంచి తప్పుకుని క్రిష్ ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేక్ష శ్రద్ధతో పని చేశాడు. గతంలో ఈ కాంబోలో వేదం వచ్చింది. అనుష్క కెరీర్ లో వేశ్యగా నటించిన ఏకైన సినిమా ఇది. అంతే పేరు తీసుకొచ్చింది కూడా.
ఇప్పుడు ఘాటీలో అంతకు మించి పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రను డిజైన్ చేశాడని టాక్. ఒక ఒంటరి మహిళ అతి పెద్ద నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించడమే కాక అక్కడ ఆధిపత్యం చెలాయించడమనే పాయింట్ చుట్టూ ఘాటీ నడుస్తుందట. నవంబర్ 7 అనుష్క బర్త్ డేకి ఫస్ట్ లుక్ వదలబోతున్నారు.
కథనర్ – ది వైల్డ్ సార్సరర్ అనే పీరియాడిక్ మల్లువుడ్ మూవీలో అనుష్క కలియన్ కట్టు నీలిగా కనిపించబోతోంది. దీనికి సంబంధించిన స్టిల్ కూడా పుట్టినరోజు వదలబోతున్నారని సమాచారం. జయసూర్య హీరోగా నటించిన ఈ భారీ చిత్రం స్వంతంగా సెటప్ చేసుకున్న స్టూడియోలో వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని వాడి షూట్ చేశారు. బడ్జెట్ కూడా భారీగానే అయ్యింది.
తొమ్మిదో శతాబ్దానికి చెందిన క్రిస్టియన్ యోధుడి కథ ఆధారంగా కథనర్ రూపొందింది. ఈ సినిమాతో పాటు ఘాటీ రెండూ వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. రిలీజ్ డేట్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఏమైనా వస్తుందేమో చూడాలి.
This post was last modified on November 4, 2024 1:20 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…